ETV Bharat / bharat

ఆ రాష్ట్ర మంత్రికి రెండోసారి కరోనా పాజిటివ్​

author img

By

Published : Apr 15, 2021, 12:45 PM IST

దేశంలో కరోనా బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేరళ మంత్రి సునీల్​ కుమార్​కు రెండోసారి కరోనా సోకింది. గతవారం వైరస్​ బారినపడిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్​ కోలుకుని డిశ్చార్జి​ అయ్యారు.

Kerala Agriculture Minister VS Sunil Kumar
కేరళ మంత్రి సునీల్​ కుమార్​

కేరళ వ్యవసాయ శాఖ మంత్రి వీఎస్​ సునీల్​ కుమార్​కు రెండోసారి కరోనా సోకింది. గతేడాది సెప్టెంబర్​ 23న తొలిసారి వైరస్​ బారిన పడిన ఆయనకు.. ఇటీవల పరీక్షలు నిర్వహించగా మరోసారి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఎలాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ.. త్రిస్సూర్​ మెడికల్​ కళాశాలలో చేరారు సునీల్​.

సునీల్​తో పాటు ఆయన​ కుమారుడు నిరంజన్​ కృష్ణకు సైతం వైరస్​ పాజిటివ్​గా తేలినట్లు వైద్యులు వెల్లడించారు.

ఇదీ చదవండి: కరోనా కొత్త స్ట్రెయిన్ లక్షణాలేంటి?

వైరస్​ను జయించిన సీఎం

ఏప్రిల్​ 8న.. కొవిడ్​-19 బారినపడిన కేరళ సీఎం పినరయి విజయన్​ కోలుకున్నారు. చికిత్స నిమిత్తం కోజికోడ్​ మెడికల్​ కాలేజ్​ ఆస్పత్రిలో చేరిన ఆయన.. డిశ్చార్జి ​ అయ్యారు.

ఇదీ చదవండి: కరోనా ఉగ్రరూపం: భారత్​లో ఒక్కరోజే 2 లక్షల కేసులు

కేరళ వ్యవసాయ శాఖ మంత్రి వీఎస్​ సునీల్​ కుమార్​కు రెండోసారి కరోనా సోకింది. గతేడాది సెప్టెంబర్​ 23న తొలిసారి వైరస్​ బారిన పడిన ఆయనకు.. ఇటీవల పరీక్షలు నిర్వహించగా మరోసారి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఎలాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ.. త్రిస్సూర్​ మెడికల్​ కళాశాలలో చేరారు సునీల్​.

సునీల్​తో పాటు ఆయన​ కుమారుడు నిరంజన్​ కృష్ణకు సైతం వైరస్​ పాజిటివ్​గా తేలినట్లు వైద్యులు వెల్లడించారు.

ఇదీ చదవండి: కరోనా కొత్త స్ట్రెయిన్ లక్షణాలేంటి?

వైరస్​ను జయించిన సీఎం

ఏప్రిల్​ 8న.. కొవిడ్​-19 బారినపడిన కేరళ సీఎం పినరయి విజయన్​ కోలుకున్నారు. చికిత్స నిమిత్తం కోజికోడ్​ మెడికల్​ కాలేజ్​ ఆస్పత్రిలో చేరిన ఆయన.. డిశ్చార్జి ​ అయ్యారు.

ఇదీ చదవండి: కరోనా ఉగ్రరూపం: భారత్​లో ఒక్కరోజే 2 లక్షల కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.