ETV Bharat / bharat

హిజాబ్ ధరించిన విద్యార్థులకు అనుమతి.. కానీ స్పెషల్ క్లాస్​లో...

author img

By

Published : Feb 7, 2022, 12:58 PM IST

Hijab Karnataka: హిజాబ్ ధరించిన విద్యార్థులను కుందాపుర్​ కళాశాల యాజమాన్యం అనుమతించింది. అయితే వారికి ప్రత్యేకంగా తరగతి గదులు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హిజాబ్​ నిరసనల్లో ప్రమాదకర ఆయుధాలు కలిగి ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

Karnataka hijab
విద్యార్థునులతో సిబ్బంది చర్చలు

Karnataka hijab controversy: కర్ణాటకలో హిజాబ్ వివాదం రోజుకురోజుకు ముదురుతోంది. విద్యాసంస్థల్లోకి హిజాబ్​ ధరించిన వారిని అనుమతించకపోవడంపై పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరసనకు దిగారు. ఉడుపి జిల్లా కుందాపుర్​లోని ప్రభుత్వ పీజీ కళాశాల వద్ద ఆందోళన చేపట్టారు. ఇందులో ఇద్దరు ప్రమాదకర ఆయుధాలతో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు తప్పించుకున్నట్లు వెల్లడించారు. అరెస్టు చేసిన ఇద్దరి పేర్లు హజి అబ్దుల్​ మాజిద్​, రజ్జబ్​ అని పేర్కొన్నారు. ఆయుధాలతో అల్లర్లకు ప్రేరేపించేందుకు నిందితులు ప్రయత్నించారని పోలీసులు ఇద్దరు నిందితులపై అభియోగాలు మోపారు.

అనుమతి..

Karnataka hijab
హిజాబ్ ధరించిన విద్యార్థులతో మాట్లాడుతున్న సిబ్బంది

కొద్ది రోజులుగా విద్యార్థినులు, తల్లిదండ్రులు చేస్తున్న నిరసనల అనంతరం కుందాపుర్​ పీజీ కళాశాలలోకి హిజాబ్ ధరించిన వారిని సిబ్బంది అనుమతించారు. అయితే వారందరికీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తరగతి గదుల్లో పాఠాలు బోధించనున్నట్లు తెలుస్తోంది.

Karnataka hijab
విద్యార్థులతో సిబ్బంది చర్చలు
Karnataka hijab
హిజాబ్ ధరించిన విద్యార్థులను అనుమతిస్తున్న సిబ్బంది

మరోవైపు విజయపురలో శాంతేశ్వర్ ఎడ్యుకేషన్​ ట్రస్టులో కొందరు విద్యార్థులు కాషాయ శాలువా ధరించి క్యాంపస్​లోకి వచ్చారు. దీంతో యాజమాన్యం ఈరోజు తరగతులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

Karnataka hijab
కాషాయ శాలువా ధరించి వచ్చిన విద్యార్థులు
Karnataka hijab
కాషాయ శాలువా ధరించి వచ్చిన విద్యార్థులు
Karnataka hijab
కాషాయ శాలువా ధరించి వచ్చిన విద్యార్థులు

Hijab news

రాజకీయ దుమారం..

కర్ణాటకలో పలు కళాశాలల్లో హిజాబ్‌ ధరించిన ముస్లిం విద్యార్థులను అడ్డుకోవడం.. రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వం నిర్దేశించిన యూనిఫామ్ డ్రెస్​ కోడ్​ను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఆయా పాఠశాలలు నిర్ణయించిన డ్రెస్ కోడ్​ను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. డ్రెస్ కోడ్​ లేని కళాశాలల్లో సమానత్వం, సమగ్రత, శాంతి భద్రతలపై ప్రభావం చూపని దుస్తులు ధరించాలని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: రూ.900 కోసం కన్నతండ్రినేే కడతేర్చిన కుమారుడు

Karnataka hijab controversy: కర్ణాటకలో హిజాబ్ వివాదం రోజుకురోజుకు ముదురుతోంది. విద్యాసంస్థల్లోకి హిజాబ్​ ధరించిన వారిని అనుమతించకపోవడంపై పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరసనకు దిగారు. ఉడుపి జిల్లా కుందాపుర్​లోని ప్రభుత్వ పీజీ కళాశాల వద్ద ఆందోళన చేపట్టారు. ఇందులో ఇద్దరు ప్రమాదకర ఆయుధాలతో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు తప్పించుకున్నట్లు వెల్లడించారు. అరెస్టు చేసిన ఇద్దరి పేర్లు హజి అబ్దుల్​ మాజిద్​, రజ్జబ్​ అని పేర్కొన్నారు. ఆయుధాలతో అల్లర్లకు ప్రేరేపించేందుకు నిందితులు ప్రయత్నించారని పోలీసులు ఇద్దరు నిందితులపై అభియోగాలు మోపారు.

అనుమతి..

Karnataka hijab
హిజాబ్ ధరించిన విద్యార్థులతో మాట్లాడుతున్న సిబ్బంది

కొద్ది రోజులుగా విద్యార్థినులు, తల్లిదండ్రులు చేస్తున్న నిరసనల అనంతరం కుందాపుర్​ పీజీ కళాశాలలోకి హిజాబ్ ధరించిన వారిని సిబ్బంది అనుమతించారు. అయితే వారందరికీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తరగతి గదుల్లో పాఠాలు బోధించనున్నట్లు తెలుస్తోంది.

Karnataka hijab
విద్యార్థులతో సిబ్బంది చర్చలు
Karnataka hijab
హిజాబ్ ధరించిన విద్యార్థులను అనుమతిస్తున్న సిబ్బంది

మరోవైపు విజయపురలో శాంతేశ్వర్ ఎడ్యుకేషన్​ ట్రస్టులో కొందరు విద్యార్థులు కాషాయ శాలువా ధరించి క్యాంపస్​లోకి వచ్చారు. దీంతో యాజమాన్యం ఈరోజు తరగతులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

Karnataka hijab
కాషాయ శాలువా ధరించి వచ్చిన విద్యార్థులు
Karnataka hijab
కాషాయ శాలువా ధరించి వచ్చిన విద్యార్థులు
Karnataka hijab
కాషాయ శాలువా ధరించి వచ్చిన విద్యార్థులు

Hijab news

రాజకీయ దుమారం..

కర్ణాటకలో పలు కళాశాలల్లో హిజాబ్‌ ధరించిన ముస్లిం విద్యార్థులను అడ్డుకోవడం.. రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వం నిర్దేశించిన యూనిఫామ్ డ్రెస్​ కోడ్​ను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఆయా పాఠశాలలు నిర్ణయించిన డ్రెస్ కోడ్​ను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. డ్రెస్ కోడ్​ లేని కళాశాలల్లో సమానత్వం, సమగ్రత, శాంతి భద్రతలపై ప్రభావం చూపని దుస్తులు ధరించాలని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: రూ.900 కోసం కన్నతండ్రినేే కడతేర్చిన కుమారుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.