ETV Bharat / bharat

లోదుస్తులు, సాక్సుల్లో పసిడి పొడి

author img

By

Published : Apr 3, 2021, 2:27 PM IST

రోజుకో రీతిలో అంతుచిక్కని తరహాలో స్మగ్లింగ్​కు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. విదేశాల నుంచి లోదుస్తులు, సాక్సుల్లో అక్రమంగా బంగారం తరలిస్తూ.. మంగళూరు విమానాశ్రయంలో ఓ వ్యక్తి శనివారం పట్టుబడ్డాడు. అతడి నుంచి రూ. 92లక్షల విలువైన పసిడి పొడి బయటపడింది. ఇలా మూడు రోజుల్లో ముగ్గుర్ని అరెస్ట్​ చేసిన అధికారులు.. వారి నుంచి మొత్తం 2.569 కిలోల బంగారాన్ని సీజ్​ చేసినట్టు చెప్పారు.

CUSTOMS OFFICER SEIZED A 92 LAKH GOLD IN MANGALORE AIRPORT
లోదుస్తులు, సాక్సుల్లో రూ.92లక్షల విలువైన పసిడి పొడి

కర్ణాటకలో అక్రమంగా తరలిస్తున్న పసిడిని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్​ అధికారులు. మంగళూరు విమానాశ్రయంలో శనివారం ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.92.27 లక్షల విలువైన బంగారాన్ని గుర్తించారు.

దొరికిపోయాడిలా..

మంగళూరు జిల్లా ఉల్లాల్​కు​ చెందిన మహ్మద్​ ఆసిఫ్​.. దుబాయ్​ నుంచి ఎయిర్​ ఇండియా విమానంలో సొంత జిల్లాకు వచ్చాడు. అధికారులు అతణ్ని తనిఖీ చేశారు. ప్రత్యేకంగా రూపొందించిన జీన్స్​ ప్యాంటు, లోదుస్తులు, సాక్సుల్లో నుంచి 1.993 కిలోల పసిడి పొడి దొరికింది. దీని విలువ రూ.92.27 లక్షలు ఉంటుందని కస్టమ్స్​ విభాగం అంచనా వేసింది. బంగారం పొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు.. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు.

CUSTOMS OFFICER SEIZED A 92 LAKH GOLD IN MANGALORE AIRPORT
అధికారులు స్వాధీనం చేసుకున్నపుత్తడి
CUSTOMS OFFICER SEIZED A 92 LAKH GOLD IN MANGALORE AIRPORT
బూట్లలో బయటపడిన బంగారం

కేరళకు చెందిన మరో ఇద్దరు..

అదే విమానాశ్రయంలో జరిగిన మరో ఘటనలో.. కేరళ కాసరగోడ్‌కు చెందిన అబ్దుల్ సలాం.. శుక్రవారం(ఏప్రిల్ 2న) ఇండిగో విమానంలో పట్టుబడ్డాడు. అంతకుముందు రోజు(ఏప్రిల్​ 1న) కాసరగోడ్​(కేరళ) వాసి అష్రాఫ్​ నుంచి 576 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్​ అధికారులు. అష్రాఫ్..​ జీన్స్​ షర్ట్​ ప్రెస్సింగ్​ బటన్స్​, బూట్లలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నాడని అధికారులు వెల్లడించారు. ఈ ఇద్దరి నుంచి సేకరించిన పుత్తడి విలువ రూ.26.43 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

CUSTOMS OFFICER SEIZED A 92 LAKH GOLD IN MANGALORE AIRPORT
జీన్స్​ షర్ట్​ బటన్స్​లో గుర్తించిన పసిడి
CUSTOMS OFFICER SEIZED A 92 LAKH GOLD IN MANGALORE AIRPORT
జీన్స్​, లోదుస్తుల్లో తరలిస్తున్న బంగారం

ఇలా మూడు రోజుల్లోనే మొత్తం 2.569 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది కస్టమ్స్​ విభాగం. దీని మొత్తం విలువ రూ.1.18 కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది.

ఇదీ చదవండి: ఫోన్​లో​ మాట్లాడుతూ.. ఒకేసారి 2 కరోనా డోసులు

కర్ణాటకలో అక్రమంగా తరలిస్తున్న పసిడిని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్​ అధికారులు. మంగళూరు విమానాశ్రయంలో శనివారం ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.92.27 లక్షల విలువైన బంగారాన్ని గుర్తించారు.

దొరికిపోయాడిలా..

మంగళూరు జిల్లా ఉల్లాల్​కు​ చెందిన మహ్మద్​ ఆసిఫ్​.. దుబాయ్​ నుంచి ఎయిర్​ ఇండియా విమానంలో సొంత జిల్లాకు వచ్చాడు. అధికారులు అతణ్ని తనిఖీ చేశారు. ప్రత్యేకంగా రూపొందించిన జీన్స్​ ప్యాంటు, లోదుస్తులు, సాక్సుల్లో నుంచి 1.993 కిలోల పసిడి పొడి దొరికింది. దీని విలువ రూ.92.27 లక్షలు ఉంటుందని కస్టమ్స్​ విభాగం అంచనా వేసింది. బంగారం పొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు.. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు.

CUSTOMS OFFICER SEIZED A 92 LAKH GOLD IN MANGALORE AIRPORT
అధికారులు స్వాధీనం చేసుకున్నపుత్తడి
CUSTOMS OFFICER SEIZED A 92 LAKH GOLD IN MANGALORE AIRPORT
బూట్లలో బయటపడిన బంగారం

కేరళకు చెందిన మరో ఇద్దరు..

అదే విమానాశ్రయంలో జరిగిన మరో ఘటనలో.. కేరళ కాసరగోడ్‌కు చెందిన అబ్దుల్ సలాం.. శుక్రవారం(ఏప్రిల్ 2న) ఇండిగో విమానంలో పట్టుబడ్డాడు. అంతకుముందు రోజు(ఏప్రిల్​ 1న) కాసరగోడ్​(కేరళ) వాసి అష్రాఫ్​ నుంచి 576 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్​ అధికారులు. అష్రాఫ్..​ జీన్స్​ షర్ట్​ ప్రెస్సింగ్​ బటన్స్​, బూట్లలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నాడని అధికారులు వెల్లడించారు. ఈ ఇద్దరి నుంచి సేకరించిన పుత్తడి విలువ రూ.26.43 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

CUSTOMS OFFICER SEIZED A 92 LAKH GOLD IN MANGALORE AIRPORT
జీన్స్​ షర్ట్​ బటన్స్​లో గుర్తించిన పసిడి
CUSTOMS OFFICER SEIZED A 92 LAKH GOLD IN MANGALORE AIRPORT
జీన్స్​, లోదుస్తుల్లో తరలిస్తున్న బంగారం

ఇలా మూడు రోజుల్లోనే మొత్తం 2.569 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది కస్టమ్స్​ విభాగం. దీని మొత్తం విలువ రూ.1.18 కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది.

ఇదీ చదవండి: ఫోన్​లో​ మాట్లాడుతూ.. ఒకేసారి 2 కరోనా డోసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.