ETV Bharat / bharat

యడియూరప్పకు ఆ రెండేళ్లు సవాళ్ల సవారీనే!

author img

By

Published : Jul 26, 2021, 2:53 PM IST

కర్ణాటకలో భాజపా అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. 2019, జులై 26న ముఖ్యమంత్రిగా బీఎస్​ యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రెండేళ్లలో ప్రభుత్వ పయనం ఏమంత సజావుగా సాగలేదు. ఎన్నో ఆటుపోట్లలో ఊగిసలాడింది.

Karnataka CM Yediyurappa
యడియూరప్ప సర్కారు

సమన్వయం లేని జనతాదళ్‌- కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కారు కూలిన వెంటనే మొదలైన యడియూరప్ప భాజపా సర్కారు రెండేళ్లు పాటు ఆటుపోట్లలో ఊగిసలాడింది. 2019 జులై 26న ముఖ్యమంత్రిగా బి.ఎస్‌.యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారంతో ఆ సర్కారుకు రెండేళ్లు నిండింది. ఈ రెండేళ్లలో ప్రభుత్వ పయనం ఏమంత సజావుగా సాగలేదు. 2008 నుంచి 2013 వరకు ఐదేళ్ల పాటు భాజపా సర్కారు నడిచినా వివిధ కారణాలతో మూడుసార్లు నాయకత్వాన్ని మార్చాల్సి వచ్చింది. 2018లోనూ అత్యధిక స్థానాలు పొందినా అధికారానికి సరిపడా సంఖ్యాబలం లేక.. కేవలం ఆరు రోజులకే చతికిల పడింది. ఆపై సంకీర్ణ సర్కారు కూలిపోగా 2019 జులై 26న మరోమారు యడియూరప్ప నాయకత్వంలోనే భాజపా సర్కారు ఏర్పాటు కావడం నిన్నటి చరిత్ర. రెండేళ్ల పాటు యడియూరప్ప నేతృత్వంలో సర్కారు బండి నడిచినా లెక్కలేనన్ని ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది.

Karnataka CM Yediyurappa
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వేళ.. కీలక నేత ఎస్‌.ఎం.కృష్ణతో..

ఆది నుంచి తడబాటు

సర్కారు ఏర్పాటైన కేవలం పది రోజులకే ఉత్తర కర్ణాటకలో భారీ వర్షాలు పలకరించాయి. మహారాష్ట్రలో ఎప్పటిలాగే కురిసిన భారీ వర్షాలతో రాష్ట్ర సరిహద్దులోని 10 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. అప్పటికీ మంత్రివర్గాన్నే ఏర్పాటు చేయని యడియూరప్ప తానొక్కడే వరద ప్రాంతాలను సందర్శించారు. ఆగస్టు 5 నుంచి మూడు రోజుల పాటు బెళగావి, కొడగు, రాయచూరు తదితర జిల్లాలను చుట్టేశారు. ఆప్పటికి రూ.38 వేల కోట్ల వరద నష్టాన్ని అంచనా వేసినా కేంద్ర సర్కారు రూ.1,809 కోట్లు మాత్రమే విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే సర్కారు ఉంటే ఎంతో సానుకూలమని ప్రకటించిన యడియూరప్పకు ఈ పరిహారం పెద్ద ఎదురుదెబ్భ 2020 ఏడాది జులై, ఆగస్టు, సెప్టెంబరులోనూ భారీ వర్షాల కారణంగా 15 జిల్లాల్లో 157 తాలూకాలు నష్టపోయాయి. నాడు కేంద్ర సర్కారు రూ.890 కోట్లు మాత్రమే విడుదల చేయటంతో రాష్ట్ర సర్కారు తీవ్ర నిరాశకు గురైంది.

కరోనాతో కష్టాలు

సర్కారు ఏర్పాటైన ఎనిమిది నెలల్లోనే కరోనా రూపంలో మరో అవాంతరం ఎదురైంది. యావత్తు ప్రపంచంతో పాటు రాష్ట్రంలోనూ కరోనా సృష్టించిన సమస్యలు అన్నీ ఇన్నీ కావు. 2020 ఏప్రిల్‌ నుంచి జులై వరకు విధించిన లాక్‌డౌన్‌తో ఆదాయం గణనీయంగా తగ్గింది. వైద్య సదుపాయాల కోసం వేల కోట్లను వ్యయం చేసిన సర్కారు కేంద్ర సాయాన్ని కోరినా అడపాదడపా విడుదల చేసింది రూ.950 కోట్లు మాత్రమే. పీఎం కేర్స్‌ నుంచి వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు అందినా.. చాలక పోవటంతో రాష్ట్ర సర్కారు రూ.50వేల కోట్ల అదనపు వ్యయం చేసి.. ఖజానా ఖాళీ చేసుకుంది. రూ.2,500కోట్ల ఆర్థిక ప్యాకేజీ, రైతులు, వీధి వ్యాపారులకు ప్రత్యేక రుణ సదుపాయం కల్పించిన సర్కారుకు రాబడి కంటే పోబడి మరింత భారంగా మారింది. 2020 ఆగస్టు నుంచి కరోనా కేసులు తగ్గి ఆర్థికంగా పుంజుకున్నా 2021 ఫిబ్రవరి నుంచి రెండో దఫా కరోనా మరిన్ని అవాంతరాలు సృష్టించింది.

Karnataka CM Yediyurappa
వ్యాక్సిన్​ తీసుకుంటున్న యడియూరప్ప

అభివృద్ధి.. అప్పులు

రెండేళ్ల సర్కారు కట్టుబడి వ్యయం కోసం కూడా అప్పులు చేసింది. 2020-21 ఏడాది ఆర్థిక సంవత్సరంలో రూ.33 వేల కోట్లు, 2021-22 ఏడాదిలో రూ.99 వేల కోట్లను ఆర్థిక బద్దత చట్టాన్ని సవరించి రుణాలు చేసింది. ఇప్పటికీ రూ.18,289 కోట్ల జీఎస్‌టీ పరిహారాన్ని కేంద్రం చెల్లించాలి. ఆర్థిక సంఘం సిఫార్సు చేసినా రాష్టానికి దక్కాల్సిన వాటా కేంద్రం చెల్లించలేదని విపక్షాలు పదేపదే విమర్శించటం భాజపా సర్కారును ఇరుకునపడేసింది.

మార్పే లక్ష్యమా?

2018 ఎన్నికల తర్వాత రెండు సార్లు భాజపా సర్కారు ఏర్పాటైంది. ఈ రెండు సార్లూ యడియూరప్పను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అధిష్ఠానం ప్రకటించలేదు. తనకు తానుగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్లు పార్టీ వర్గాలు విశ్లేషించాయి. ఈ సారి భాజపా సర్కారు ఏర్పాటులో రెండో శ్రేణి నేతల సహకారాన్ని అధిష్ఠానం గుర్తించింది. అప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం పొందిన యడియూరప్పను కాదని కొత్త నాయకత్వం వైపు దృష్టి సారించింది. ఆయన సేవలను గుర్తించి రెండేళ్ల ఒప్పందంతో ముఖ్యమంత్రిని చేసినట్లు తెలుస్తోంది. ఆ ఒప్పందం పూర్తవడంతో నేడు ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

ఇదీ చూడండి: కర్ణాటకలో సీఎం మార్పు- అసలు కారణమిదే..

సమన్వయం లేని జనతాదళ్‌- కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కారు కూలిన వెంటనే మొదలైన యడియూరప్ప భాజపా సర్కారు రెండేళ్లు పాటు ఆటుపోట్లలో ఊగిసలాడింది. 2019 జులై 26న ముఖ్యమంత్రిగా బి.ఎస్‌.యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారంతో ఆ సర్కారుకు రెండేళ్లు నిండింది. ఈ రెండేళ్లలో ప్రభుత్వ పయనం ఏమంత సజావుగా సాగలేదు. 2008 నుంచి 2013 వరకు ఐదేళ్ల పాటు భాజపా సర్కారు నడిచినా వివిధ కారణాలతో మూడుసార్లు నాయకత్వాన్ని మార్చాల్సి వచ్చింది. 2018లోనూ అత్యధిక స్థానాలు పొందినా అధికారానికి సరిపడా సంఖ్యాబలం లేక.. కేవలం ఆరు రోజులకే చతికిల పడింది. ఆపై సంకీర్ణ సర్కారు కూలిపోగా 2019 జులై 26న మరోమారు యడియూరప్ప నాయకత్వంలోనే భాజపా సర్కారు ఏర్పాటు కావడం నిన్నటి చరిత్ర. రెండేళ్ల పాటు యడియూరప్ప నేతృత్వంలో సర్కారు బండి నడిచినా లెక్కలేనన్ని ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది.

Karnataka CM Yediyurappa
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వేళ.. కీలక నేత ఎస్‌.ఎం.కృష్ణతో..

ఆది నుంచి తడబాటు

సర్కారు ఏర్పాటైన కేవలం పది రోజులకే ఉత్తర కర్ణాటకలో భారీ వర్షాలు పలకరించాయి. మహారాష్ట్రలో ఎప్పటిలాగే కురిసిన భారీ వర్షాలతో రాష్ట్ర సరిహద్దులోని 10 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. అప్పటికీ మంత్రివర్గాన్నే ఏర్పాటు చేయని యడియూరప్ప తానొక్కడే వరద ప్రాంతాలను సందర్శించారు. ఆగస్టు 5 నుంచి మూడు రోజుల పాటు బెళగావి, కొడగు, రాయచూరు తదితర జిల్లాలను చుట్టేశారు. ఆప్పటికి రూ.38 వేల కోట్ల వరద నష్టాన్ని అంచనా వేసినా కేంద్ర సర్కారు రూ.1,809 కోట్లు మాత్రమే విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే సర్కారు ఉంటే ఎంతో సానుకూలమని ప్రకటించిన యడియూరప్పకు ఈ పరిహారం పెద్ద ఎదురుదెబ్భ 2020 ఏడాది జులై, ఆగస్టు, సెప్టెంబరులోనూ భారీ వర్షాల కారణంగా 15 జిల్లాల్లో 157 తాలూకాలు నష్టపోయాయి. నాడు కేంద్ర సర్కారు రూ.890 కోట్లు మాత్రమే విడుదల చేయటంతో రాష్ట్ర సర్కారు తీవ్ర నిరాశకు గురైంది.

కరోనాతో కష్టాలు

సర్కారు ఏర్పాటైన ఎనిమిది నెలల్లోనే కరోనా రూపంలో మరో అవాంతరం ఎదురైంది. యావత్తు ప్రపంచంతో పాటు రాష్ట్రంలోనూ కరోనా సృష్టించిన సమస్యలు అన్నీ ఇన్నీ కావు. 2020 ఏప్రిల్‌ నుంచి జులై వరకు విధించిన లాక్‌డౌన్‌తో ఆదాయం గణనీయంగా తగ్గింది. వైద్య సదుపాయాల కోసం వేల కోట్లను వ్యయం చేసిన సర్కారు కేంద్ర సాయాన్ని కోరినా అడపాదడపా విడుదల చేసింది రూ.950 కోట్లు మాత్రమే. పీఎం కేర్స్‌ నుంచి వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు అందినా.. చాలక పోవటంతో రాష్ట్ర సర్కారు రూ.50వేల కోట్ల అదనపు వ్యయం చేసి.. ఖజానా ఖాళీ చేసుకుంది. రూ.2,500కోట్ల ఆర్థిక ప్యాకేజీ, రైతులు, వీధి వ్యాపారులకు ప్రత్యేక రుణ సదుపాయం కల్పించిన సర్కారుకు రాబడి కంటే పోబడి మరింత భారంగా మారింది. 2020 ఆగస్టు నుంచి కరోనా కేసులు తగ్గి ఆర్థికంగా పుంజుకున్నా 2021 ఫిబ్రవరి నుంచి రెండో దఫా కరోనా మరిన్ని అవాంతరాలు సృష్టించింది.

Karnataka CM Yediyurappa
వ్యాక్సిన్​ తీసుకుంటున్న యడియూరప్ప

అభివృద్ధి.. అప్పులు

రెండేళ్ల సర్కారు కట్టుబడి వ్యయం కోసం కూడా అప్పులు చేసింది. 2020-21 ఏడాది ఆర్థిక సంవత్సరంలో రూ.33 వేల కోట్లు, 2021-22 ఏడాదిలో రూ.99 వేల కోట్లను ఆర్థిక బద్దత చట్టాన్ని సవరించి రుణాలు చేసింది. ఇప్పటికీ రూ.18,289 కోట్ల జీఎస్‌టీ పరిహారాన్ని కేంద్రం చెల్లించాలి. ఆర్థిక సంఘం సిఫార్సు చేసినా రాష్టానికి దక్కాల్సిన వాటా కేంద్రం చెల్లించలేదని విపక్షాలు పదేపదే విమర్శించటం భాజపా సర్కారును ఇరుకునపడేసింది.

మార్పే లక్ష్యమా?

2018 ఎన్నికల తర్వాత రెండు సార్లు భాజపా సర్కారు ఏర్పాటైంది. ఈ రెండు సార్లూ యడియూరప్పను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అధిష్ఠానం ప్రకటించలేదు. తనకు తానుగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్లు పార్టీ వర్గాలు విశ్లేషించాయి. ఈ సారి భాజపా సర్కారు ఏర్పాటులో రెండో శ్రేణి నేతల సహకారాన్ని అధిష్ఠానం గుర్తించింది. అప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం పొందిన యడియూరప్పను కాదని కొత్త నాయకత్వం వైపు దృష్టి సారించింది. ఆయన సేవలను గుర్తించి రెండేళ్ల ఒప్పందంతో ముఖ్యమంత్రిని చేసినట్లు తెలుస్తోంది. ఆ ఒప్పందం పూర్తవడంతో నేడు ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

ఇదీ చూడండి: కర్ణాటకలో సీఎం మార్పు- అసలు కారణమిదే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.