ETV Bharat / bharat

రోడ్​ రోలర్‌ను కొట్టేసి.. కిలోల లెక్కన అమ్మేసి.. - రోడ్డురోలర్​ను కిలోలు చొప్పున అమ్మిన వార్త

దొంగలంటే.. డబ్బో, బంగారమో, ఏవైనా విలువైన వస్తువులో, అంతకూ మించిపోతే వాహనాలు కొట్టేస్తారు. అయితే కర్ణాటకకు చెందిన ముగ్గురు దుండగులు.. ఓ రోడ్​రోలర్​ను చోరీ చేశారు. ఆ రోలర్​ను ముక్కలు చేసి.. పాత ఇనుప సామానుగా అమ్మేశారు.

road roller theft
రోడ్డురోలర్​ దొంగతనం
author img

By

Published : Jun 24, 2021, 2:11 PM IST

Updated : Jun 24, 2021, 2:44 PM IST

బైకులు, కార్లను చోరీ చేసి వాటిని అమ్ముకుని వచ్చిన డబ్బులతో విందులు వినోదాలు చేసుకునే దొంగలున్నారు! అయితే కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఇద్దరు దొంగలు... అంతకుమించి. లాక్​డౌన్​ కారణంగా రోడ్డు పక్కనే పార్కు చేసిన ఓ రోడ్ రోలర్​ను కొట్టేశారు. పాత ఇనుప సామాన్లు కొనుగోలు చేసే డీలర్​తో కిలో రూ.28 చొప్పున బేరం కుదుర్చుకున్నారు.

road roller theft
ముక్కలు చేసిన రోడ్డురోలర్​

నగరంలోని చంద్ర లేవుట్ వద్ద కొన్ని రోజులుగా పార్కు చేసి ఉన్న రోడ్ రోలర్​ను కేటుగాళ్లు గుర్తించారు. అదును చూసి అక్కడ నుంచి.. అన్నా బైదరహళ్లి సమీపంలోని సీగహళ్లికి తరలించారు. గ్యాస్​ కట్టర్​ మిషన్​తో మూడు ముక్కలు చేశారు. అనంతరం బేరం పెట్టారు. కొనుగోలుకు ఒప్పుకున్న వ్యక్తి కూడా ఈ చోరీ కేసులో ఇరుక్కున్నాడు.

యజమాని ఫిర్యాదుతో..

తమిళనాడు చెందిన వీ సెల్వరాజ్​ 12ఏళ్ల క్రితం అదే రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి వద్ద రోడ్ రోలర్​ను కొనుగోలు చేశారు. ఆ రోలర్​ను పని కోసం కర్ణాటకకు తరలించారు. అయితే లాక్​డౌన్ కారణంగా పని లేకపోవడం వల్ల దానిని చంద్ర లేఔట్​ ప్రాంతంలోని ఓ మైదానంలో పార్కు చేసి మే 25న సొంత రాష్ట్రానికి వెళ్లిపోయారు. తిరిగి ఈ నెల 19 వచ్చి చూసేసరికి రోలర్​ కనిపించలేదు. దీంతో చంద్ర లేఔట్​ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు సెల్వరాజ్​. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

దీనిలో భాగంగా పట్టణంలోని సీసీటీవీ ఫుటేజ్​ను పరిశీలించారు. రోలర్​ను ఓ ట్రక్కులో తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ కేసులో నగరభావికి చెందిన ఎన్​ వినయ్​ ప్రధాన నిందితుడని పోలీసులు గుర్తించారు. మరో నిందితుడు, రోలర్​ను సీగహళ్లికి తరలించిన డ్రైవర్ పవన్​ కుమార్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు.

road roller theft
నిందితుడు పవన్​ కుమార్​

"వాహనం చోరీ కేసులో పవన్​ కుమార్​ను అరెస్టు చేశాం. కిలో రూ.28 చొప్పున అమ్మడానికి పాత ఇనుప సామాన్ల డీలర్​ ఇస్మాయిల్​తో వినయ్​ బేరం కుదిర్చాడని పవన్​ చెప్పాడు. ఆ రోడ్ రోలర్​ మొత్తం బరువు 7,800కేజీలు. వినయ్​, ఇస్మాయిల్​ కోసం గాలిస్తున్నాం" అని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: మరుగుదొడ్ల వ్యర్థాలు కలిసిన నీళ్లు తాగి.. ఇద్దరు మృతి!

బైకులు, కార్లను చోరీ చేసి వాటిని అమ్ముకుని వచ్చిన డబ్బులతో విందులు వినోదాలు చేసుకునే దొంగలున్నారు! అయితే కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఇద్దరు దొంగలు... అంతకుమించి. లాక్​డౌన్​ కారణంగా రోడ్డు పక్కనే పార్కు చేసిన ఓ రోడ్ రోలర్​ను కొట్టేశారు. పాత ఇనుప సామాన్లు కొనుగోలు చేసే డీలర్​తో కిలో రూ.28 చొప్పున బేరం కుదుర్చుకున్నారు.

road roller theft
ముక్కలు చేసిన రోడ్డురోలర్​

నగరంలోని చంద్ర లేవుట్ వద్ద కొన్ని రోజులుగా పార్కు చేసి ఉన్న రోడ్ రోలర్​ను కేటుగాళ్లు గుర్తించారు. అదును చూసి అక్కడ నుంచి.. అన్నా బైదరహళ్లి సమీపంలోని సీగహళ్లికి తరలించారు. గ్యాస్​ కట్టర్​ మిషన్​తో మూడు ముక్కలు చేశారు. అనంతరం బేరం పెట్టారు. కొనుగోలుకు ఒప్పుకున్న వ్యక్తి కూడా ఈ చోరీ కేసులో ఇరుక్కున్నాడు.

యజమాని ఫిర్యాదుతో..

తమిళనాడు చెందిన వీ సెల్వరాజ్​ 12ఏళ్ల క్రితం అదే రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి వద్ద రోడ్ రోలర్​ను కొనుగోలు చేశారు. ఆ రోలర్​ను పని కోసం కర్ణాటకకు తరలించారు. అయితే లాక్​డౌన్ కారణంగా పని లేకపోవడం వల్ల దానిని చంద్ర లేఔట్​ ప్రాంతంలోని ఓ మైదానంలో పార్కు చేసి మే 25న సొంత రాష్ట్రానికి వెళ్లిపోయారు. తిరిగి ఈ నెల 19 వచ్చి చూసేసరికి రోలర్​ కనిపించలేదు. దీంతో చంద్ర లేఔట్​ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు సెల్వరాజ్​. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

దీనిలో భాగంగా పట్టణంలోని సీసీటీవీ ఫుటేజ్​ను పరిశీలించారు. రోలర్​ను ఓ ట్రక్కులో తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ కేసులో నగరభావికి చెందిన ఎన్​ వినయ్​ ప్రధాన నిందితుడని పోలీసులు గుర్తించారు. మరో నిందితుడు, రోలర్​ను సీగహళ్లికి తరలించిన డ్రైవర్ పవన్​ కుమార్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు.

road roller theft
నిందితుడు పవన్​ కుమార్​

"వాహనం చోరీ కేసులో పవన్​ కుమార్​ను అరెస్టు చేశాం. కిలో రూ.28 చొప్పున అమ్మడానికి పాత ఇనుప సామాన్ల డీలర్​ ఇస్మాయిల్​తో వినయ్​ బేరం కుదిర్చాడని పవన్​ చెప్పాడు. ఆ రోడ్ రోలర్​ మొత్తం బరువు 7,800కేజీలు. వినయ్​, ఇస్మాయిల్​ కోసం గాలిస్తున్నాం" అని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: మరుగుదొడ్ల వ్యర్థాలు కలిసిన నీళ్లు తాగి.. ఇద్దరు మృతి!

Last Updated : Jun 24, 2021, 2:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.