ETV Bharat / bharat

'అమ్మ' స్మారకాన్ని ఆవిష్కరించిన పళనిస్వామి

author img

By

Published : Jan 27, 2021, 1:10 PM IST

Updated : Jan 27, 2021, 2:04 PM IST

తమిళనాడు మెరీనా బీచ్​లో మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత స్మారక చిహ్నాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఆవిష్కరించారు. అనంతరం ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు.

Jayalalithaa memorial
'అమ్మ' స్మారకాన్ని ఆవిష్కరించిన తమిళనాడు సీఎం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత స్మారక చిహ్నం.. మెరీనా బీచ్​లో ఆవిష్కృతమైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.పళని స్వామి.. బుధవారం ఈ స్మారకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పనీర్​ సెల్వం, తమిళనాడు అసెంబ్లీ స్పీకర్​ ధనపాల్​ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం వారు జయలలిత చిత్రపటానికి నివాళులు అర్పించారు.

Jayalalithaa memorial
జయలలిత స్మారకాన్ని ఆవిష్కరిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి
Jayalalithaa memorial
జయలలిత చిత్రపటం వద్ద తమిళనాడు సీఎం, డిప్యూటీ సీఎం, అసెంబ్లీ స్పీకర్​ నివాళులు
Jayalalithaa memorial
జయలలిత సమాధి వద్ద తమిళనాడు సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పనీర్​ సెల్వం, అసెంబ్లీ స్పీకర్​ పి.ధనపాల్​

ఈ స్మారక నిర్మాణానికి మూడేళ్ల క్రితం.. ముఖ్యమంత్రి పళని స్వామి, ఉప ముఖ్యమంత్రి పనీర్​ సెల్వం శంకుస్థాపన చేశారు. హంసాకృతిలో దీన్ని నిర్మించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు కేటాయించింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్​ స్మారకం పక్కనే.. జయలలిత స్మారకాన్ని ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:జైలు నుంచి శశికళ విడుదల- ఇంకా ఆస్పత్రిలోనే.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత స్మారక చిహ్నం.. మెరీనా బీచ్​లో ఆవిష్కృతమైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.పళని స్వామి.. బుధవారం ఈ స్మారకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పనీర్​ సెల్వం, తమిళనాడు అసెంబ్లీ స్పీకర్​ ధనపాల్​ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం వారు జయలలిత చిత్రపటానికి నివాళులు అర్పించారు.

Jayalalithaa memorial
జయలలిత స్మారకాన్ని ఆవిష్కరిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి
Jayalalithaa memorial
జయలలిత చిత్రపటం వద్ద తమిళనాడు సీఎం, డిప్యూటీ సీఎం, అసెంబ్లీ స్పీకర్​ నివాళులు
Jayalalithaa memorial
జయలలిత సమాధి వద్ద తమిళనాడు సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పనీర్​ సెల్వం, అసెంబ్లీ స్పీకర్​ పి.ధనపాల్​

ఈ స్మారక నిర్మాణానికి మూడేళ్ల క్రితం.. ముఖ్యమంత్రి పళని స్వామి, ఉప ముఖ్యమంత్రి పనీర్​ సెల్వం శంకుస్థాపన చేశారు. హంసాకృతిలో దీన్ని నిర్మించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు కేటాయించింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్​ స్మారకం పక్కనే.. జయలలిత స్మారకాన్ని ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:జైలు నుంచి శశికళ విడుదల- ఇంకా ఆస్పత్రిలోనే.

Last Updated : Jan 27, 2021, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.