ETV Bharat / bharat

'దేశంలో మార్పు అవసరం.. దీదీకి మద్దతిస్తాం'

author img

By

Published : Jul 29, 2021, 8:44 PM IST

దేశంలో మార్పు అనివార్యమని కవి, గేయ రచయిత జావెద్​ అక్తర్​ అన్నారు. ఉద్యమాల పురిటి గడ్డ బంగాల్​ అని అభిప్రాయపడ్డారు. బంగాల్ సీఎం మమతా బెనర్జీని జావెద్​ అక్తర్, నటి షబానా అజ్మీ దిల్లీలో కలిశారు.

mamata, Javed Akhtar, Shabana Azmi
మమత, జావెద్​ అక్తర్, షబానా అజ్మీ

బంగాల్ సీఎం మమతా బెనర్జీని కవి, గేయ రచయిత జావెద్​ అక్తర్, నటి షబానా అజ్మీ దిల్లీలో కలిశారు. ప్రస్తుతం దేశంలో మార్పు అవసరమని జావెద్ అక్తర్ అన్నారు. ఉద్యమాల పురిటి గడ్డ బంగాల్​ అని అభిప్రాయపడ్డారు. 'దేశంలో ఎన్నో ఆందోళనలు జరుగుతున్నాయి. హింస పెరిగిపోతోంది. దిల్లీ లాంటి ప్రదేశాల్లోనూ మత విద్వేషాలు జరుగుతుండడం సిగ్గుచేటు. బంగాల్​లో కవులు, కళాకారులు దీదీకి మద్దతిస్తారు'అని అన్నారు.

థర్డ్​ ఫ్రంట్​కు మమత నాయకత్వం వహిస్తారా అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. 'నాయకత్వం ఎవరనేదానికి దీదీ ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వరు. ఆమె మార్పు కోరుకునే తత్వం గలవారు. గతంలో బంగాల్​ కోసం పోరాడారు. ఇప్పుడు దేశం కోసం పోరాడుతున్నారు. దేశానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారనేది ముఖ్యం కాదు, హిందుస్థాన్​ ఎలా ఉన్నది అనేది మాత్రమే ప్రధానమైన అంశం.'అని చెప్పుకొచ్చారు.

బంగాల్​ సీఎం మమతా బెనర్జీ దిల్లీని సందర్శించారు. 2024 ఎన్నికల్లో థర్డ్​ ఫ్రంట్ కోసం ప్రతిపక్షాలతో భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీతో కూడా మంగళవారం సమావేశమయ్యారు. కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీతో పాటు రాహుల్​ గాంధీని ప్రత్యేకంగా కలిశారు. భాజపాను ఓడించడానికి ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావాలని సూచించారు.

ఇదీ చూడండి: పెగసస్​పై కేంద్రం, రాహుల్ మధ్య మాటల యుద్ధం!

బంగాల్ సీఎం మమతా బెనర్జీని కవి, గేయ రచయిత జావెద్​ అక్తర్, నటి షబానా అజ్మీ దిల్లీలో కలిశారు. ప్రస్తుతం దేశంలో మార్పు అవసరమని జావెద్ అక్తర్ అన్నారు. ఉద్యమాల పురిటి గడ్డ బంగాల్​ అని అభిప్రాయపడ్డారు. 'దేశంలో ఎన్నో ఆందోళనలు జరుగుతున్నాయి. హింస పెరిగిపోతోంది. దిల్లీ లాంటి ప్రదేశాల్లోనూ మత విద్వేషాలు జరుగుతుండడం సిగ్గుచేటు. బంగాల్​లో కవులు, కళాకారులు దీదీకి మద్దతిస్తారు'అని అన్నారు.

థర్డ్​ ఫ్రంట్​కు మమత నాయకత్వం వహిస్తారా అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. 'నాయకత్వం ఎవరనేదానికి దీదీ ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వరు. ఆమె మార్పు కోరుకునే తత్వం గలవారు. గతంలో బంగాల్​ కోసం పోరాడారు. ఇప్పుడు దేశం కోసం పోరాడుతున్నారు. దేశానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారనేది ముఖ్యం కాదు, హిందుస్థాన్​ ఎలా ఉన్నది అనేది మాత్రమే ప్రధానమైన అంశం.'అని చెప్పుకొచ్చారు.

బంగాల్​ సీఎం మమతా బెనర్జీ దిల్లీని సందర్శించారు. 2024 ఎన్నికల్లో థర్డ్​ ఫ్రంట్ కోసం ప్రతిపక్షాలతో భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీతో కూడా మంగళవారం సమావేశమయ్యారు. కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీతో పాటు రాహుల్​ గాంధీని ప్రత్యేకంగా కలిశారు. భాజపాను ఓడించడానికి ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావాలని సూచించారు.

ఇదీ చూడండి: పెగసస్​పై కేంద్రం, రాహుల్ మధ్య మాటల యుద్ధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.