ETV Bharat / bharat

'లాంచ్​ప్యాడ్​ల వద్ద 300 మంది ఉగ్రవాదులు'

author img

By

Published : Nov 9, 2020, 10:03 PM IST

నవంబర్​ నెలలో భారత్​లోకి చొరబడేందుకు పెద్ద ఎత్తున ఉగ్రవాదులు కుట్ర పన్నే అవకాశం ఉందని బీఎస్​ఎఫ్​ ఏడీజీ తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న లాంచ్​ప్యాడ్స్​ వద్ద 250 నుంచి 300 మంది ఉగ్రవాదులు ఉన్నారని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు.

LoC
'లాంచ్​ప్యాడ్​ల వద్ద 300 మంది ఉగ్రవాదులు'

నియంత్రణ రేఖ వెంబడి ఉన్న లాంచ్​ప్యాడ్స్​ వద్ద ఉగ్రకార్యకలాపాలు తగ్గలేదని సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​) అదనపు డైరక్టర్​ జనరల్ సురిందర్​ పవార్​ తెలిపారు. అయితే బలగాలు ఎలాంటి సవాల్​నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

నవంబర్​లో హిమపాతం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో భారత్​లో చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించే అవకాశం ఉంది. ఎల్ఓసీ వెంబడి ఉన్న లాంచ్​ప్యాడ్​ల వద్ద 250 నుంచి 300 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. అయితే 2019లో 140 మంది ఉగ్రవాదులు చొరబాటుకు యత్నిస్తే ఈ ఏడాది 25-30 మంది ప్రయత్నించారు.

- సురిందర్​ పవార్, బీఎస్​ఎఫ్​ ఏడీజీ

ఉత్తర కశ్మీర్​ కుప్వారా జిల్లా మాచిల్​ సెక్టార్​లో ఈ నెల 7న అర్ధరాత్రి వేళల్లో ఉగ్రవాదులు.. భారత బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పులపై సురిందర్​ స్పందించారు. ఉగ్రవాదుల చొరబాటును దీటుగా ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఈ ఎదురుకాల్పుల్లో కెప్టెన్​ అశుతోశ్ సహా ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. మొత్తం ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ప్రస్తుతం మాచిల్​ సెక్టార్​లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సురిందర్​ వెల్లడించారు.

నియంత్రణ రేఖ వెంబడి ఉన్న లాంచ్​ప్యాడ్స్​ వద్ద ఉగ్రకార్యకలాపాలు తగ్గలేదని సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​) అదనపు డైరక్టర్​ జనరల్ సురిందర్​ పవార్​ తెలిపారు. అయితే బలగాలు ఎలాంటి సవాల్​నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

నవంబర్​లో హిమపాతం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో భారత్​లో చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించే అవకాశం ఉంది. ఎల్ఓసీ వెంబడి ఉన్న లాంచ్​ప్యాడ్​ల వద్ద 250 నుంచి 300 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. అయితే 2019లో 140 మంది ఉగ్రవాదులు చొరబాటుకు యత్నిస్తే ఈ ఏడాది 25-30 మంది ప్రయత్నించారు.

- సురిందర్​ పవార్, బీఎస్​ఎఫ్​ ఏడీజీ

ఉత్తర కశ్మీర్​ కుప్వారా జిల్లా మాచిల్​ సెక్టార్​లో ఈ నెల 7న అర్ధరాత్రి వేళల్లో ఉగ్రవాదులు.. భారత బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పులపై సురిందర్​ స్పందించారు. ఉగ్రవాదుల చొరబాటును దీటుగా ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఈ ఎదురుకాల్పుల్లో కెప్టెన్​ అశుతోశ్ సహా ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. మొత్తం ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ప్రస్తుతం మాచిల్​ సెక్టార్​లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సురిందర్​ వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.