ETV Bharat / bharat

కశ్మీర్​లో ఇద్దరు పౌరుల్ని కాల్చిచంపిన ఉగ్రవాదులు

on-local street vendor shot dead by unidentified gunmen
వీధి వర్తకుడిని కాల్చిచంపిన ఉగ్రవాదులు
author img

By

Published : Oct 16, 2021, 7:18 PM IST

Updated : Oct 16, 2021, 9:22 PM IST

19:15 October 16

కశ్మీర్​లో ఇద్దరు పౌరుల్ని కాల్చిచంపిన ఉగ్రవాదులు

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇద్దరు స్థానికేతరులను పొట్టనపెట్టుకున్నారు.

శ్రీనగర్​లోని ఈద్గా ప్రాంతంలో.. ఓ వీధివ్యాపారిని కాల్చిచంపారు. ఈ మేరకు పోలీసులు వెల్లడించారు. చనిపోయిన వ్యక్తిని బిహార్​కు చెందిన అరవింద్​ కుమార్​గా గుర్తించారు. కాల్పులు జరిగిన ప్రాంతంలోనే అరవింద్​ కుప్పకూలినట్లు తెలిపారు. అరవింద్​ మృతిపై విచారం వ్యక్తం చేసిన బిహార్​ సీఎం నితీశ్​ కుమార్​.. బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ మొత్తం అందించనున్నట్లు పేర్కొన్నారు. 

పుల్వామాలో మరొకరు..

పుల్వామాలో జరిగిన మరో ఉగ్రదాడిలో.. ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన అహ్మద్​ అనే వ్యక్తి చనిపోయాడు. ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. 

గత వారంలో మైనారిటీలపై ముష్కరులు కాల్పులు జరిపిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఏరివేతను చేపట్టాయి బలగాలు. ఈ హత్యలకు పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను.. 24 గంటల వ్యవధిలో హతమార్చినట్లు పోలీసులు ప్రకటించిన రోజునే మళ్లీ ఇలా దుశ్చర్యకు పాల్పడ్డారు. 

19:15 October 16

కశ్మీర్​లో ఇద్దరు పౌరుల్ని కాల్చిచంపిన ఉగ్రవాదులు

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇద్దరు స్థానికేతరులను పొట్టనపెట్టుకున్నారు.

శ్రీనగర్​లోని ఈద్గా ప్రాంతంలో.. ఓ వీధివ్యాపారిని కాల్చిచంపారు. ఈ మేరకు పోలీసులు వెల్లడించారు. చనిపోయిన వ్యక్తిని బిహార్​కు చెందిన అరవింద్​ కుమార్​గా గుర్తించారు. కాల్పులు జరిగిన ప్రాంతంలోనే అరవింద్​ కుప్పకూలినట్లు తెలిపారు. అరవింద్​ మృతిపై విచారం వ్యక్తం చేసిన బిహార్​ సీఎం నితీశ్​ కుమార్​.. బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ మొత్తం అందించనున్నట్లు పేర్కొన్నారు. 

పుల్వామాలో మరొకరు..

పుల్వామాలో జరిగిన మరో ఉగ్రదాడిలో.. ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన అహ్మద్​ అనే వ్యక్తి చనిపోయాడు. ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. 

గత వారంలో మైనారిటీలపై ముష్కరులు కాల్పులు జరిపిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఏరివేతను చేపట్టాయి బలగాలు. ఈ హత్యలకు పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను.. 24 గంటల వ్యవధిలో హతమార్చినట్లు పోలీసులు ప్రకటించిన రోజునే మళ్లీ ఇలా దుశ్చర్యకు పాల్పడ్డారు. 

Last Updated : Oct 16, 2021, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.