ETV Bharat / bharat

ఎల్​డీఎఫ్ వ్యూహంతో తమిళనాట కమల్ పోరు

author img

By

Published : Feb 21, 2021, 12:09 PM IST

కేరళ సీఎం పినరయి విజయన్ దారిలో నడుస్తున్నారు మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్. తమిళనాట విజయం కోసం ఎల్​డీఎఫ్ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. మరి వామపక్షాల ఇలాకాలో ఫలించిన ఎత్తుగడలు.. ద్రవిడ గడ్డపై ప్రభావం చూపుతాయా? తమిళనాడులో ఉన్న ద్విముఖ పోరుకు చరమగీతం పాడి, మూడో పార్టీకి ఆధిక్యం కట్టబెడతాయా?

Is Kamal Hassan following LDF's Kerala model?
ఎల్​డీఎఫ్ వ్యూహంతో తమిళనాట కమల్ పోరు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పాలక, విపక్షాలు వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్నాయి. ప్రశాంత్​ కిశోర్​కు చెందిన ఐ-ప్యాక్​తో డీఎంకే జట్టుకట్టగా.. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుతో ఎన్నికల బరిలోకి దిగుతోంది అధికార అన్నాడీఎంకే. తమిళనాడులో దశాబ్దాలుగా ద్విముఖ పోరే నడుస్తోంది. సూపర్​స్టార్ రజనీకాంత్ రంగ ప్రవేశంతో ఈ ఆనవాయితీకి తెరపడుతుందని భావించినప్పటికీ.. తలైవా వెనక్కి తగ్గడం వల్ల ఇందుకు ఆస్కారం లేకుండా పోయింది. మరోవైపు, 2018లోనే పార్టీని ప్రారంభించి గత సార్వత్రిక ఎన్నికల్లో నామమాత్రపు ఓట్లను దక్కించుకున్న కమల్​ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం... ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తోంది. ఈ క్రమంలో కేరళలో లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్​డీఎఫ్) అమలు చేసిన వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: 35 ఏళ్ల తర్వాత రజనీ-కమల్​ కాంబో!

కేరళ సీఎం పినరయి విజయన్​ను కమల్ తన రాజకీయ గురువుగా భావిస్తారు. ఇదే విషయాన్ని గతంలో బహిరంగంగా వెల్లడించారు కూడా. ఇప్పుడు ఆయన గురువు దారిలోనే నడిచి విజయాన్ని అందుకోవాలని కమల్ తాపత్రయపడుతున్నారు.

ఏంటా వ్యూహం?

గతేడాది డిసెంబర్​లో కేరళలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఎల్​డీఎఫ్ అఖండ విజయాన్ని నమోదు చేసింది. ప్రజల్లో పలుకుబడి ఉన్న వ్యక్తులను, వివిధ రంగాలకు చెందిన నిపుణులను, పబ్లిక్ సర్వెంట్లను ఉపయోగించుకొని ఓటర్లను ఆకర్షించింది ఎల్​డీఎఫ్. ఇప్పుడు కమల్​ హాసన్ సైతం ఇదే దారిలో వెళ్తున్నారు. పదవిలో ఉండగా ప్రజల సంక్షేమానికి విశేష కృషి చేసిన ఐఏఎస్​, ఐపీఎస్​, శాస్త్రవేత్తలు ఇతర ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానించారు.

ఇదీ చదవండి: కమల్​కు ఊరట.. పార్టీకి టార్చ్ గుర్తు

విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏజీ మౌర్యకు ఇటీవలే పార్టీ సభ్యత్వాన్ని ఇచ్చారు కమల్. ఐఏఎస్ అధికారి డా. సంతోష్ కుమార్ సైతం స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) తీసుకొని కమల్ పార్టీలో చేరారు. మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాంకు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన పొన్​రాజ్​తో పాటు వీఆర్​ఎస్ తీసుకున్న మరో ఐఏఎస్ అధికారి సఘాయమ్​ను పార్టీలోకి ఆహ్వానించారు కమల్.

ఇదీ చదవండి: కమల్​ నోట 'థర్డ్​ ఫ్రంట్​' మాట

కార్యకర్తలు, సంస్థలతోనూ

అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అరాప్పోర్ ఇయాక్కమ్, పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడే 'పూవులాగిన్ నన్​బార్గల్' సంస్థతోనూ కమల్ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా మంచి పేరున్న వ్యక్తులు, ప్రముఖులతోనూ సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: రజనీతో పొత్తుకు 'ఫోన్​కాల్​' దూరంలో కమల్‌

ఎన్నికల్లో వీలైనన్ని సీట్లు గెలవడమే లక్ష్యంగా కమల్ వేగంగా పావులు కదుపుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సఘాయమ్, పొన్​రాజ్​లకు పార్టీ టికెట్ ఇచ్చి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించాలని కమల్ భావిస్తున్నట్లు తెలిపాయి. ఈ విషయంపై కమల్​ నుంచి ఆదివారం కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

'ఫలిస్తే.. అందరూ పాటిస్తారు'

రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికే కమల్ రాజకీయ రంగ ప్రవేశం చేశారని మక్కల్ నీది మయ్యం రాష్ట్ర కార్యదర్శి మురళి అప్పాస్ చెబుతున్నారు. ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రెండు పార్టీల విధానం తప్పు అని అన్నారు. కమల్ పాటిస్తున్న కొత్త విధానం విజయవంతమైతే.. భవిష్యత్తులో ఇతర పార్టీలూ దీన్నే అనుసరిస్తాయని చెప్పారు.

2019 లోక్​సభ ఎన్నికల్లో ఎంఎన్ఎం 40 స్థానాల్లో పోటీ చేసింది. అయితే 0.26 శాతం ఓట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న కమల్​హాసన్.. అసెంబ్లీ ఎన్నికల్లో రాణించాలని కోరుకుంటున్నారు. ఇటీవల రజనీకాంత్​ను సైతం కలిశారు. ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని అడిగేందుకే రజనీతో కమల్ సమావేశమయ్యారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్- మే నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

చిన్నమ్మ దారెటు? పార్టీపై పెత్తనం సాధ్యమా?

అన్నాడీఎంకే 'మౌనం'- ఏకాకిగా విజయకాంత్!

స్టాలిన్​ను దాటి అన్నాడీఎంకే హ్యాట్రిక్​ కొట్టేనా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పాలక, విపక్షాలు వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్నాయి. ప్రశాంత్​ కిశోర్​కు చెందిన ఐ-ప్యాక్​తో డీఎంకే జట్టుకట్టగా.. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుతో ఎన్నికల బరిలోకి దిగుతోంది అధికార అన్నాడీఎంకే. తమిళనాడులో దశాబ్దాలుగా ద్విముఖ పోరే నడుస్తోంది. సూపర్​స్టార్ రజనీకాంత్ రంగ ప్రవేశంతో ఈ ఆనవాయితీకి తెరపడుతుందని భావించినప్పటికీ.. తలైవా వెనక్కి తగ్గడం వల్ల ఇందుకు ఆస్కారం లేకుండా పోయింది. మరోవైపు, 2018లోనే పార్టీని ప్రారంభించి గత సార్వత్రిక ఎన్నికల్లో నామమాత్రపు ఓట్లను దక్కించుకున్న కమల్​ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం... ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తోంది. ఈ క్రమంలో కేరళలో లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్​డీఎఫ్) అమలు చేసిన వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: 35 ఏళ్ల తర్వాత రజనీ-కమల్​ కాంబో!

కేరళ సీఎం పినరయి విజయన్​ను కమల్ తన రాజకీయ గురువుగా భావిస్తారు. ఇదే విషయాన్ని గతంలో బహిరంగంగా వెల్లడించారు కూడా. ఇప్పుడు ఆయన గురువు దారిలోనే నడిచి విజయాన్ని అందుకోవాలని కమల్ తాపత్రయపడుతున్నారు.

ఏంటా వ్యూహం?

గతేడాది డిసెంబర్​లో కేరళలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఎల్​డీఎఫ్ అఖండ విజయాన్ని నమోదు చేసింది. ప్రజల్లో పలుకుబడి ఉన్న వ్యక్తులను, వివిధ రంగాలకు చెందిన నిపుణులను, పబ్లిక్ సర్వెంట్లను ఉపయోగించుకొని ఓటర్లను ఆకర్షించింది ఎల్​డీఎఫ్. ఇప్పుడు కమల్​ హాసన్ సైతం ఇదే దారిలో వెళ్తున్నారు. పదవిలో ఉండగా ప్రజల సంక్షేమానికి విశేష కృషి చేసిన ఐఏఎస్​, ఐపీఎస్​, శాస్త్రవేత్తలు ఇతర ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానించారు.

ఇదీ చదవండి: కమల్​కు ఊరట.. పార్టీకి టార్చ్ గుర్తు

విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏజీ మౌర్యకు ఇటీవలే పార్టీ సభ్యత్వాన్ని ఇచ్చారు కమల్. ఐఏఎస్ అధికారి డా. సంతోష్ కుమార్ సైతం స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) తీసుకొని కమల్ పార్టీలో చేరారు. మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాంకు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన పొన్​రాజ్​తో పాటు వీఆర్​ఎస్ తీసుకున్న మరో ఐఏఎస్ అధికారి సఘాయమ్​ను పార్టీలోకి ఆహ్వానించారు కమల్.

ఇదీ చదవండి: కమల్​ నోట 'థర్డ్​ ఫ్రంట్​' మాట

కార్యకర్తలు, సంస్థలతోనూ

అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అరాప్పోర్ ఇయాక్కమ్, పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడే 'పూవులాగిన్ నన్​బార్గల్' సంస్థతోనూ కమల్ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా మంచి పేరున్న వ్యక్తులు, ప్రముఖులతోనూ సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: రజనీతో పొత్తుకు 'ఫోన్​కాల్​' దూరంలో కమల్‌

ఎన్నికల్లో వీలైనన్ని సీట్లు గెలవడమే లక్ష్యంగా కమల్ వేగంగా పావులు కదుపుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సఘాయమ్, పొన్​రాజ్​లకు పార్టీ టికెట్ ఇచ్చి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించాలని కమల్ భావిస్తున్నట్లు తెలిపాయి. ఈ విషయంపై కమల్​ నుంచి ఆదివారం కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

'ఫలిస్తే.. అందరూ పాటిస్తారు'

రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికే కమల్ రాజకీయ రంగ ప్రవేశం చేశారని మక్కల్ నీది మయ్యం రాష్ట్ర కార్యదర్శి మురళి అప్పాస్ చెబుతున్నారు. ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రెండు పార్టీల విధానం తప్పు అని అన్నారు. కమల్ పాటిస్తున్న కొత్త విధానం విజయవంతమైతే.. భవిష్యత్తులో ఇతర పార్టీలూ దీన్నే అనుసరిస్తాయని చెప్పారు.

2019 లోక్​సభ ఎన్నికల్లో ఎంఎన్ఎం 40 స్థానాల్లో పోటీ చేసింది. అయితే 0.26 శాతం ఓట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న కమల్​హాసన్.. అసెంబ్లీ ఎన్నికల్లో రాణించాలని కోరుకుంటున్నారు. ఇటీవల రజనీకాంత్​ను సైతం కలిశారు. ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని అడిగేందుకే రజనీతో కమల్ సమావేశమయ్యారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్- మే నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

చిన్నమ్మ దారెటు? పార్టీపై పెత్తనం సాధ్యమా?

అన్నాడీఎంకే 'మౌనం'- ఏకాకిగా విజయకాంత్!

స్టాలిన్​ను దాటి అన్నాడీఎంకే హ్యాట్రిక్​ కొట్టేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.