ETV Bharat / bharat

డెలివరీ ఇవ్వమంటే చోరీ.. రూ.27కోట్లు విలువైన ఐఫోన్​లతో పరార్ - హరియాణా పల్​వల్​లో రూ 27 కోట్ల ఐఫోన్​లు చోరీ

Haryana Iphones Stolen : దాదాపు రూ.27 కోట్లు విలువ చేసే ఐఫోన్​లను ఇద్దరు ట్రక్కు డ్రైవర్లు దొంగిలించారు. తాము పనిచేస్తున్న కంపెనీలోనే దోపిడీకి పాల్పడ్డారు. వాటిని అమ్ముతుండగా పోలీసులకు చిక్కారు. ఈ ఘటన హరియాణాలోని పల్​వల్ జిల్లాలో జరిగింది.

Iphones Stolen In Haryana
Iphones Stolen In Haryana
author img

By

Published : Jul 16, 2023, 1:00 PM IST

Iphones Stolen In Haryana : హరియాణాలోని పల్​వల్​ జిల్లాకు చెందిన ఇద్దరు ట్రక్ డ్రైవర్లు దాదాపు రూ.27 కోట్లు విలువైన ఐఫోన్​లను దొంగిలించారు. తాము పనిచేస్తున్న లాజిస్టిక్స్​ కంపెనీలోనే చోరీకి పాల్పడ్డారు. కంపెనీ మేనేజర్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని రిమాండ్​కు తరలించి విచారించనున్నట్లు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్​వల్​ జిల్లా మెవాత్ ప్రాంతంలోని అలీమేవ్ గ్రామంలో జఫ్​రుద్దీన్, సాఢ్​వాడీ గ్రామంలో సహబ్​జీన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ గురుగ్రామ్​కు చెందిన ఎన్​వీఆర్​ లాజిస్టిక్స్​ కంపెనీలో ట్రక్కు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. దాదాపు రూ.27 కోట్లు విలువైన 3700 ఐఫోన్​లను లోడ్​ చేసుకుని.. జులై 11న తమిళనాడులోని చెన్నై నుంచి బయలుదేరారు. గురుగ్రామ్​లోని మానెసర్​లో వీటిని డెలివరీ ఇవ్వాల్సి ఉంది. అయితే, డ్రైవర్లు డెలివరీ ఇవ్వకుండానే.. ట్రక్కును హోడల్​ పోలీస్ స్టేషన్​ పరిధిలోని కర్మన్​ అనే గ్రామం వద్ద వదిలేసి.. ఐఫోన్​లతో పారారయ్యారు.

చెన్నై నుంచి బయలుదేరి నాలుగు రోజులు గడుస్తున్నా.. ఇంకా ట్రక్కు గమ్యం చేరుకోలేదు. అనుమానం వచ్చి ఆరా తీస్తే.. ట్రక్కును ఓ చోట పార్క్​ చేసి.. ఐఫోన్​లతో డ్రైవర్లు పారిపోయినట్లు తెలిసింది. దీంతో ఎన్​ఆర్​వీ లాజిస్టిక్స్​ మేనేజర్​ రాకేశ్​.. హోడల్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న క్రైమ్ బ్రాంచ్​ పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు ఐఫోన్​లు అమ్మాలని ప్రయత్నిస్తుండగా.. స్పెషల్​ ఇన్​ఫార్మర్​ ద్వారా సమాచారం అందుకుని.. హతిన్ మండలంలోని అంధోప్​ గ్రామం వద్ద వారిని అరెస్ట్​ చేశారు.

Iphones Stolen In Haryana
పోలీసులు స్వాధీనం చేసుకున్న ఐఫోన్​లు

నిందితుల వద్ద నుంచి కొన్ని ఫోన్​లను స్వాధీనం చేసుకున్నామని పల్​వల్​ డీఎస్​పీ సజ్జన్​ సింగ్ తెలిపారు. నిందితులిద్దరినీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని అన్నారు. ఈ చోరీలో ఇంకా ఎవరెవరు ఉన్నారు?.. ఫోన్​లు ఎంతమందికి ఇచ్చారు? అనే కోణంలో విచారిస్తామని చెప్పారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉంటే వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని, నిందితుల పాత రికార్డులను కూడా పరిశీలిస్తామని తెలిపారు.

Iphones Stolen In Haryana
నిందితులు

రూ.8.5 కోట్లు చోరీ.. రూ.10 కోసం దొరికిపోయి..
Ludhiana Cash Van Robbery : సప్తసముద్రాలు ఈది ఇంటి ముందు మురుగుకాల్వలో పడిపోయినట్లు.. రూ. కోట్లు కొట్టేసి రూ.10 వల్ల పట్టుబడ్డారు. దాదాపు రూ.8.5 కోట్ల సొమ్మును దోచుకొని పారిపోయారు పంజాబ్​కు చెందిన భార్యాభర్తలు. కానీ రూ.10 కూల్‌డ్రింక్‌ కోసం కక్కుర్తిపడి దొరికిపోయారు. ఈ ఘటన జూన్​ 10న జరిగింది. వీరెందుకు ఇలా చేశారో? ఎక్కడి నుంచి రూ.8.5 కోట్ల డబ్బును చోరీ చేశారో? తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్​ చేసి స్టోరీ చదివేయండి.

Iphones Stolen In Haryana : హరియాణాలోని పల్​వల్​ జిల్లాకు చెందిన ఇద్దరు ట్రక్ డ్రైవర్లు దాదాపు రూ.27 కోట్లు విలువైన ఐఫోన్​లను దొంగిలించారు. తాము పనిచేస్తున్న లాజిస్టిక్స్​ కంపెనీలోనే చోరీకి పాల్పడ్డారు. కంపెనీ మేనేజర్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని రిమాండ్​కు తరలించి విచారించనున్నట్లు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్​వల్​ జిల్లా మెవాత్ ప్రాంతంలోని అలీమేవ్ గ్రామంలో జఫ్​రుద్దీన్, సాఢ్​వాడీ గ్రామంలో సహబ్​జీన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ గురుగ్రామ్​కు చెందిన ఎన్​వీఆర్​ లాజిస్టిక్స్​ కంపెనీలో ట్రక్కు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. దాదాపు రూ.27 కోట్లు విలువైన 3700 ఐఫోన్​లను లోడ్​ చేసుకుని.. జులై 11న తమిళనాడులోని చెన్నై నుంచి బయలుదేరారు. గురుగ్రామ్​లోని మానెసర్​లో వీటిని డెలివరీ ఇవ్వాల్సి ఉంది. అయితే, డ్రైవర్లు డెలివరీ ఇవ్వకుండానే.. ట్రక్కును హోడల్​ పోలీస్ స్టేషన్​ పరిధిలోని కర్మన్​ అనే గ్రామం వద్ద వదిలేసి.. ఐఫోన్​లతో పారారయ్యారు.

చెన్నై నుంచి బయలుదేరి నాలుగు రోజులు గడుస్తున్నా.. ఇంకా ట్రక్కు గమ్యం చేరుకోలేదు. అనుమానం వచ్చి ఆరా తీస్తే.. ట్రక్కును ఓ చోట పార్క్​ చేసి.. ఐఫోన్​లతో డ్రైవర్లు పారిపోయినట్లు తెలిసింది. దీంతో ఎన్​ఆర్​వీ లాజిస్టిక్స్​ మేనేజర్​ రాకేశ్​.. హోడల్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న క్రైమ్ బ్రాంచ్​ పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు ఐఫోన్​లు అమ్మాలని ప్రయత్నిస్తుండగా.. స్పెషల్​ ఇన్​ఫార్మర్​ ద్వారా సమాచారం అందుకుని.. హతిన్ మండలంలోని అంధోప్​ గ్రామం వద్ద వారిని అరెస్ట్​ చేశారు.

Iphones Stolen In Haryana
పోలీసులు స్వాధీనం చేసుకున్న ఐఫోన్​లు

నిందితుల వద్ద నుంచి కొన్ని ఫోన్​లను స్వాధీనం చేసుకున్నామని పల్​వల్​ డీఎస్​పీ సజ్జన్​ సింగ్ తెలిపారు. నిందితులిద్దరినీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని అన్నారు. ఈ చోరీలో ఇంకా ఎవరెవరు ఉన్నారు?.. ఫోన్​లు ఎంతమందికి ఇచ్చారు? అనే కోణంలో విచారిస్తామని చెప్పారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉంటే వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని, నిందితుల పాత రికార్డులను కూడా పరిశీలిస్తామని తెలిపారు.

Iphones Stolen In Haryana
నిందితులు

రూ.8.5 కోట్లు చోరీ.. రూ.10 కోసం దొరికిపోయి..
Ludhiana Cash Van Robbery : సప్తసముద్రాలు ఈది ఇంటి ముందు మురుగుకాల్వలో పడిపోయినట్లు.. రూ. కోట్లు కొట్టేసి రూ.10 వల్ల పట్టుబడ్డారు. దాదాపు రూ.8.5 కోట్ల సొమ్మును దోచుకొని పారిపోయారు పంజాబ్​కు చెందిన భార్యాభర్తలు. కానీ రూ.10 కూల్‌డ్రింక్‌ కోసం కక్కుర్తిపడి దొరికిపోయారు. ఈ ఘటన జూన్​ 10న జరిగింది. వీరెందుకు ఇలా చేశారో? ఎక్కడి నుంచి రూ.8.5 కోట్ల డబ్బును చోరీ చేశారో? తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్​ చేసి స్టోరీ చదివేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.