ETV Bharat / bharat

చిదంబరం, ఆయన తనయుడికి దిల్లీ కోర్టు సమన్లు

author img

By

Published : Mar 24, 2021, 6:07 PM IST

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, ఆయన తనయుడు కార్తీ చిదంబరానికి దిల్లీ న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఏప్రిల్​ 7న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది.

INX Media: Delhi court issues summons against P Chidambaram, son Karti and others in money laundering case. PTI URD
చిదంబరానికి, ఆయన తనయుడికి దిల్లీ కోర్టు సమన్లు

ఐఎన్​ఎక్స్​ మీడియా మనీలాండరింగ్​ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్​​ నేత పి.చిదంబరం, ఆయన కుమారుడికి దిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. వారిపై ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ)​ దాఖలు చేసిన అభియోగపత్రాన్నిన్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ఏప్రిల్​ 7న కోర్టు ముందు హాజరు కావాలని.. జస్టిస్​ ఎంకే నాగ్​​పాల్​ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఆదేశించింది.

ఈడీ తన అభియోగపత్రంలో చిదంబరం, కార్తీ చిదంబరంతో పాటు అకౌంటెంట్​ ఎస్​ఎస్​ భాస్కరన్​ సహా పలువురి పేర్లను పేర్కొంది.

ఇదీ కేసు..

చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు.. ఐఎన్​ఎక్స్​ మీడియాకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు అనుమతులు ఇవ్వడంలో అవకతవకలకు పాల్పడినట్లు 2017 మే 15న సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగా ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ మనీలాండరింగ్ కేసు పెట్టింది. 2018 ఆగస్టు 21న కస్టడీలోకి తీసుకుంది సీబీఐ, అనంతరం అక్టోబర్​ 16న ఈడీ అదుపులోకి తీసుకుంది. ఈడీ కేసులో డిసెంబర్​ 4, 2019న ఆయనకు బెయిల్​ మంజూరు అయింది.

ఇదీ చూడండి:శబరిమల కోసం ప్రత్యేక చట్టం: భాజపా హామీ

ఐఎన్​ఎక్స్​ మీడియా మనీలాండరింగ్​ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్​​ నేత పి.చిదంబరం, ఆయన కుమారుడికి దిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. వారిపై ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ)​ దాఖలు చేసిన అభియోగపత్రాన్నిన్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ఏప్రిల్​ 7న కోర్టు ముందు హాజరు కావాలని.. జస్టిస్​ ఎంకే నాగ్​​పాల్​ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఆదేశించింది.

ఈడీ తన అభియోగపత్రంలో చిదంబరం, కార్తీ చిదంబరంతో పాటు అకౌంటెంట్​ ఎస్​ఎస్​ భాస్కరన్​ సహా పలువురి పేర్లను పేర్కొంది.

ఇదీ కేసు..

చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు.. ఐఎన్​ఎక్స్​ మీడియాకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు అనుమతులు ఇవ్వడంలో అవకతవకలకు పాల్పడినట్లు 2017 మే 15న సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగా ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ మనీలాండరింగ్ కేసు పెట్టింది. 2018 ఆగస్టు 21న కస్టడీలోకి తీసుకుంది సీబీఐ, అనంతరం అక్టోబర్​ 16న ఈడీ అదుపులోకి తీసుకుంది. ఈడీ కేసులో డిసెంబర్​ 4, 2019న ఆయనకు బెయిల్​ మంజూరు అయింది.

ఇదీ చూడండి:శబరిమల కోసం ప్రత్యేక చట్టం: భాజపా హామీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.