ETV Bharat / bharat

రైతు ఆందోళనల్లో ఉగ్రదాడి.. దిల్లీలో హై అలర్ట్​!

author img

By

Published : Jun 26, 2021, 9:27 AM IST

జూన్​ 26న దిల్లీలో రైతులు చేపట్టనున్న ఆందోళనల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.

high alert
హై అలర్ట్

రైతు ఉద్యమం ప్రారంభమై ఏడు నెలలు పూర్తయిన సందర్భంగా జూన్​ 26(శనివారం)న దిల్లీలో రైతు నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. అయితే.. రైతుల ఆందోళనల్లో పాకిస్థాన్​ గూఢచర్య సంస్థ ఐఎస్​ఐ ఆధ్వర్యంలో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో నిఘా పెంచారు. మెట్రో స్టేషన్లను ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరకు మూసివేయనున్నారు.

సేవ్ అగ్రికల్చర్​ అండ్ సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్​కేఎం) ఆధ్వర్యంలో రైతులు ఆందోళనలు నిర్వహించనున్నారు. ఈ నిరసనల్లో ఇతర రైతు సంఘాలు కూడా పాల్గొనే అవకాశం ఉంది.

అంతకు ముందు రైతులనుద్దేశించి మాట్లాడారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్. ఉద్యమాన్ని విరమించాలని రైతులను కోరారు.

ఇదీ చదవండి : 'రైతులతో మరోసారి చర్చలకు సిద్ధమే..'

రైతు ఉద్యమం ప్రారంభమై ఏడు నెలలు పూర్తయిన సందర్భంగా జూన్​ 26(శనివారం)న దిల్లీలో రైతు నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. అయితే.. రైతుల ఆందోళనల్లో పాకిస్థాన్​ గూఢచర్య సంస్థ ఐఎస్​ఐ ఆధ్వర్యంలో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో నిఘా పెంచారు. మెట్రో స్టేషన్లను ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరకు మూసివేయనున్నారు.

సేవ్ అగ్రికల్చర్​ అండ్ సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్​కేఎం) ఆధ్వర్యంలో రైతులు ఆందోళనలు నిర్వహించనున్నారు. ఈ నిరసనల్లో ఇతర రైతు సంఘాలు కూడా పాల్గొనే అవకాశం ఉంది.

అంతకు ముందు రైతులనుద్దేశించి మాట్లాడారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్. ఉద్యమాన్ని విరమించాలని రైతులను కోరారు.

ఇదీ చదవండి : 'రైతులతో మరోసారి చర్చలకు సిద్ధమే..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.