ETV Bharat / bharat

భారత్​కు కొనసాగుతున్న విదేశాల సాయం

author img

By

Published : May 5, 2021, 10:16 PM IST

కరోనా మహమ్మారితో ధైర్యంగా పోరాడుతున్న భారత్​కు విదేశాల నుంచి ఆపన్నహస్తం అందుతోంది. ఆస్ట్రేలియా, బహ్రెయిన్​, ఇజ్రాయెల్ దేశాలు బుధవారం ఆక్సిజన్​ మెషిన్లు, అత్యవసర వైద్యసామగ్రి, వెంటిలేటర్లను పంపించి తమ ఉదారతను చాటుకున్నాయి.

INS Talwar
ఐఎన్​ఎస్ తల్వార్

కరోనా సెకండ్ వేవ్​పై ధైర్యంగా పోరాడుతున్న భారత్​కు విదేశాల నుంచి సాయం అందుతోంది. ఆస్ట్రేలియా, బహ్రెయిన్​, ఇజ్రాయెల్ దేశాలు బుధవారం ఆపన్నహస్తం అందించాయి. ఆస్ట్రేలియా నుంచి 1056 వెంటిలేటర్లు, 43 ఆక్సిజన్ మెషిన్లు ప్రత్యేక విమానంలో భారత్​కు వచ్చాయి. అటు ఇజ్రాయెల్.. అత్యవసర వైద్యసామగ్రిని భారత్​కు పంపించి తన ఉదారతను చాటుకుంది.

medical supplies from plane
ఆస్ట్రేలియా నుంచి విమానం
medical supplies
వైద్య సామగ్రి
medical supplies from plane
విమానం నుంచి వైద్యసామగ్రి
medical supplies
అత్యవసర వైద్య సామగ్రి

ఆపరేషన్ సముద్రసేతు-2

ఇక బహ్రెయిన్​ కూడా ఆపరేషన్ సముద్రసేతు-2లో భాగంగా.. 20 మెట్రిక్​ టన్నులు కలిగిన రెండు ద్రవ ఆక్సిజన్​ ట్యాంకర్లను పంపించింది. ఇవి ఐఎన్​ఎస్​ తల్వార్ నౌకలో.. కర్ణాటకలోని న్యూ మంగళూరు నౌకాశ్రయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు బహ్రెయిన్ మద్దతుకు విదేశాంగ ప్రతినిధి అరిందమ్​ బాగిచీ కృతజ్ఞతలు తెలిపారు.

oxygen tanker
ఆక్సిజన్ ట్యాంకరు
ins talwar
ఐఎన్​ఎస్​ తల్వార్
officers at ins talwar
ఐఎన్ఎస్​ తల్వార్​ వద్ద అధికారులు
medical suppiles
వైద్య పరికరాలు
medical supplies on ins iravat ship
ఐఎన్​ఎస్​ ఐరావత్
medical supplies
ఇజ్రాయెల్​ విమానం నుంచి వైద్యపరికరాలు
medical supplies
ఇజ్రాయెల్​ నుంచి సహకారం
medical supplies
ఇజ్రాయెల్​ నుంచి వైద్యపరికరాలు పంపిణీ

వీటితో పాటు సింగపూర్​ నుంచి ఐఎన్​ఎస్ ఐరావత్​, కువైట్ నుంచి ఐఎన్ఎస్ కోల్​కతా.. ఆక్సిజన్​ మెషిన్లు, అత్యవసర వైద్యసామాగ్రి, వెంటిలేటర్లతో భారత్​కు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఈయూ రూ. 19 కోట్లు సాయం

కరోనాతో పోరాడుతున్న భారత్​కు అత్యవసర విరాళం కింద రూ. 19 కోట్లు ప్రకటించింది ఈయూ. వైద్య పరికరాలనూ అందిస్తున్నట్లు యూరోపియన్ కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్​ఓ)తో కలిసి పనిచేస్తామని తెలిపింది. వైరస్​తో కలిసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చింది.

ఇదీ చదవండి : చైనా రాకెట్​తో ప్రపంచానికి ముప్పు!

కరోనా సెకండ్ వేవ్​పై ధైర్యంగా పోరాడుతున్న భారత్​కు విదేశాల నుంచి సాయం అందుతోంది. ఆస్ట్రేలియా, బహ్రెయిన్​, ఇజ్రాయెల్ దేశాలు బుధవారం ఆపన్నహస్తం అందించాయి. ఆస్ట్రేలియా నుంచి 1056 వెంటిలేటర్లు, 43 ఆక్సిజన్ మెషిన్లు ప్రత్యేక విమానంలో భారత్​కు వచ్చాయి. అటు ఇజ్రాయెల్.. అత్యవసర వైద్యసామగ్రిని భారత్​కు పంపించి తన ఉదారతను చాటుకుంది.

medical supplies from plane
ఆస్ట్రేలియా నుంచి విమానం
medical supplies
వైద్య సామగ్రి
medical supplies from plane
విమానం నుంచి వైద్యసామగ్రి
medical supplies
అత్యవసర వైద్య సామగ్రి

ఆపరేషన్ సముద్రసేతు-2

ఇక బహ్రెయిన్​ కూడా ఆపరేషన్ సముద్రసేతు-2లో భాగంగా.. 20 మెట్రిక్​ టన్నులు కలిగిన రెండు ద్రవ ఆక్సిజన్​ ట్యాంకర్లను పంపించింది. ఇవి ఐఎన్​ఎస్​ తల్వార్ నౌకలో.. కర్ణాటకలోని న్యూ మంగళూరు నౌకాశ్రయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు బహ్రెయిన్ మద్దతుకు విదేశాంగ ప్రతినిధి అరిందమ్​ బాగిచీ కృతజ్ఞతలు తెలిపారు.

oxygen tanker
ఆక్సిజన్ ట్యాంకరు
ins talwar
ఐఎన్​ఎస్​ తల్వార్
officers at ins talwar
ఐఎన్ఎస్​ తల్వార్​ వద్ద అధికారులు
medical suppiles
వైద్య పరికరాలు
medical supplies on ins iravat ship
ఐఎన్​ఎస్​ ఐరావత్
medical supplies
ఇజ్రాయెల్​ విమానం నుంచి వైద్యపరికరాలు
medical supplies
ఇజ్రాయెల్​ నుంచి సహకారం
medical supplies
ఇజ్రాయెల్​ నుంచి వైద్యపరికరాలు పంపిణీ

వీటితో పాటు సింగపూర్​ నుంచి ఐఎన్​ఎస్ ఐరావత్​, కువైట్ నుంచి ఐఎన్ఎస్ కోల్​కతా.. ఆక్సిజన్​ మెషిన్లు, అత్యవసర వైద్యసామాగ్రి, వెంటిలేటర్లతో భారత్​కు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఈయూ రూ. 19 కోట్లు సాయం

కరోనాతో పోరాడుతున్న భారత్​కు అత్యవసర విరాళం కింద రూ. 19 కోట్లు ప్రకటించింది ఈయూ. వైద్య పరికరాలనూ అందిస్తున్నట్లు యూరోపియన్ కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్​ఓ)తో కలిసి పనిచేస్తామని తెలిపింది. వైరస్​తో కలిసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చింది.

ఇదీ చదవండి : చైనా రాకెట్​తో ప్రపంచానికి ముప్పు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.