దేశంలోనే అతి పొడవైన సరుకు రవాణా రైలు వాసుకిని విజయవంతంగా ప్రారంభించి దక్షిణ-తూర్పు రైల్వే రికార్డు సృష్టించింది. ఐదు కార్గో రైళ్లను జతచేసి 3.5 కిలోమీటర్ల వాసుకి రైలును ఏర్పాటు చేశారు.
జనవరి 22న ఛత్తీస్గఢ్లోని భిలాయి నుంచి రాయ్పూర్ రైల్వే డివిజన్లోని కోర్బావరకు నడిపి ఈ ఘనత సాధించింది దక్షిణ- తూర్పు రైల్వే. ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న 224కిలోమీటర్ల దూరాన్ని కేవలం 7 గంటల్లోనే వాసుకి పూర్తి చేసింది. కాగా భిలాయీ నుంచి కోర్బా కు బొగ్గు రవాణా చేయాడానికి వాసుకిని వాడనున్నారు.
దీన్ని నడపడానికి ఒక లోకో పైలెట్, అసిస్టెంట్ పైలెట్ ఉంటే సరిపోతుంది. ఇంకా ఒక భద్రతా సిబ్బంది చాలు. అదే మామూలు రైలుకైతే ఐదుగురు లోకో పైలెట్లు, ఐదుగురు అసిస్టెంట్ పైలెట్లు, ఐదుగురు భద్రతా సిబ్బంది అవసరం. దేశంలో వాసుకి తర్వాత శేష్నాగ్ రైలు పొడవైనది.
ఇదీ చూడండి: 'సవాళ్లు ఎదురవుతాయని నేతాజీ ఊహించారు'