ETV Bharat / bharat

Indians in Ukraine: 219 మంది భారతీయులతో బయల్దేరిన విమానం

author img

By

Published : Feb 26, 2022, 3:26 PM IST

Updated : Feb 26, 2022, 4:30 PM IST

Indians in Ukraine: ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయుల తరలింపులో పురోగతి సాధిస్తున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్​ తెలిపారు. 219 మంది భారతీయులతో రొమేనియా నుంచి విమానం బయల్దేరినట్లు ట్వీట్​ చేశారు. మరోవైపు.. తమ దేశంలోకి వచ్చిన భారతీయులకు సాయం చేస్తామని భారత్​లోని రొమేనియా రాయబారి తెలిపారు.

219 Indian nationals
219 మంది భారతీయులతో బయల్దేరిన విమానం
219 మంది భారతీయులతో బయల్దేరిన విమానం

Indians in Ukraine: ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం ముమ్మర ప్రయత్నాల్లో పురోగతి సాధిస్తున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​ తెలిపారు. ఇప్పటికే రొమేనియా సరిహద్దులకు చేరుకున్న 219 మందితో తొలి ఎయిర్​ ఇండియా విమానం ముంబయికి బయల్దేరినట్లు ఆయన ట్విట్టర్​లో వెల్లడించారు. అందరినీ సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు అహర్నిశలు పనిచేస్తున్నట్లు తెలిపారు. స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నానని మంత్రి తెలిపారు. భారతీయుల తరలింపులో మంచి సహకారం అందించిన రొమేనియా విదేశాంగ శాఖ మంత్రి బోగ్దాన్​ అరెస్కూకు కృతజ్ఞతలు తెలిపారు.

219 Indian nationals
రొమేనియాలోని భారతీయులు
219 Indian nationals
విమానాశ్రయంలో భారత పౌరులు
219 Indian nationals
విమానంలోకి ఎక్కే ముందు తనిఖీ చేస్తున్న సిబ్బంది

భారతీయుల తరలింపునకు సాయం..

ఉక్రెయిన్​పై దాడిని పోలండ్​తో పాటు యూరోపియన్​ యూనియన్​ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని భారత్​లో పోలండ్​ రాయబారి ఆడమ్​ బురాకౌస్కీ తెలిపారు. పోలండ్​, ఇతర దేశాలు ఉక్రెయిన్​కు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయన్నారు. ఐరోపా సమాఖ్య, ఇతర సంస్థలు కూడా రష్యాపై ఆంక్షలు విధించాయని తెలిపారు. ఉక్రెయిన్​పై రష్యా తీవ్ర దాడులు తమ పౌరులకు కూడా పెద్ద సమస్యేనన్నారు. ఉక్రెయిన్​ నుంచి తప్పించుకొని తమ దేశానికి చేరుకున్న భారతీయులకు సహాయం చేస్తున్నామని చెప్పారు.

ఇదీ చూడండి: Russia Ukraine War: శునకంపై ప్రేమతో.. ఉక్రెయిన్​లోనే భారతీయ విద్యార్థి

ఉక్రెయిన్​లోని భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు- ఫ్రీగా...

219 మంది భారతీయులతో బయల్దేరిన విమానం

Indians in Ukraine: ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం ముమ్మర ప్రయత్నాల్లో పురోగతి సాధిస్తున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​ తెలిపారు. ఇప్పటికే రొమేనియా సరిహద్దులకు చేరుకున్న 219 మందితో తొలి ఎయిర్​ ఇండియా విమానం ముంబయికి బయల్దేరినట్లు ఆయన ట్విట్టర్​లో వెల్లడించారు. అందరినీ సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు అహర్నిశలు పనిచేస్తున్నట్లు తెలిపారు. స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నానని మంత్రి తెలిపారు. భారతీయుల తరలింపులో మంచి సహకారం అందించిన రొమేనియా విదేశాంగ శాఖ మంత్రి బోగ్దాన్​ అరెస్కూకు కృతజ్ఞతలు తెలిపారు.

219 Indian nationals
రొమేనియాలోని భారతీయులు
219 Indian nationals
విమానాశ్రయంలో భారత పౌరులు
219 Indian nationals
విమానంలోకి ఎక్కే ముందు తనిఖీ చేస్తున్న సిబ్బంది

భారతీయుల తరలింపునకు సాయం..

ఉక్రెయిన్​పై దాడిని పోలండ్​తో పాటు యూరోపియన్​ యూనియన్​ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని భారత్​లో పోలండ్​ రాయబారి ఆడమ్​ బురాకౌస్కీ తెలిపారు. పోలండ్​, ఇతర దేశాలు ఉక్రెయిన్​కు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయన్నారు. ఐరోపా సమాఖ్య, ఇతర సంస్థలు కూడా రష్యాపై ఆంక్షలు విధించాయని తెలిపారు. ఉక్రెయిన్​పై రష్యా తీవ్ర దాడులు తమ పౌరులకు కూడా పెద్ద సమస్యేనన్నారు. ఉక్రెయిన్​ నుంచి తప్పించుకొని తమ దేశానికి చేరుకున్న భారతీయులకు సహాయం చేస్తున్నామని చెప్పారు.

ఇదీ చూడండి: Russia Ukraine War: శునకంపై ప్రేమతో.. ఉక్రెయిన్​లోనే భారతీయ విద్యార్థి

ఉక్రెయిన్​లోని భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు- ఫ్రీగా...

Last Updated : Feb 26, 2022, 4:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.