ETV Bharat / bharat

కరోనా చికిత్సలో అశ్వగంధ- బ్రిటన్​లో అధ్యయనం

author img

By

Published : Aug 1, 2021, 12:07 PM IST

కరోనా చికిత్సలో 'అశ్వగంధ'ను వినియోగించడంపై.. బ్రిటన్​తో కలిసి ఆయుష్​ మంత్రిత్వ శాఖ అధ్యయనం చేపట్టనుంది. బ్రిటన్​లోని 2,000 మంది పౌరులపై ఈ ఔషధానికి సంబంధించి క్లినికల్​ ట్రయల్స్​ త్వరలో నిర్వహించనున్నారు.

ashwagandha in coron treatment
కరోనా చికిత్సలో అశ్వగంధ

భారతీయ సంప్రదాయ వైద్య వ్యవస్థను బలోపేతం చేసే దిశగా.. ఆయుష్​ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సలో అశ్వగంధ ఔషధాన్ని వినియోగించడంపై.. బ్రిటన్​లోని హైజీన్​ అండ్​ ట్రాపికల్​ మెడిసిన్​ సంస్థ(ఎల్​ఎస్​హెచ్​టీఎం)తో కలిసి అఖిల భారతీయ ఆయుర్వేద సంస్థ(ఏఐఐఏ) అధ్యయనం చేపట్టనుంది. ఈ మేరకు ఇరు సంస్థలు అవగాహన ఒప్పందాన్ని(ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. ఈ ఎంఓయూలో భాగంగా.. బ్రిటన్​లోని లీసిసెట్ర్​, బర్మింగ్​హామ్​, లండన్​ నగరాలకు చెందిన 2,000 మందిపై క్లినికల్ ట్రయల్స్​ నిర్వహించనున్నారు.

శాస్త్రీయ ఆధారాలు..

భారతీయ సంప్రదాయ ఔషధ మూలికల్లో ఒకటైన అశ్వగంధ(విఠానియా సోమ్నిఫెరా).. ఒత్తిడిని తగ్గించడం సహా రోగ నిరోధక శక్తిని పెంచే ఔషధంగా పేరు పొందింది. అయితే.. ఇది కొవిడ్​ను తగ్గిస్తుందనడానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. ప్రస్తుతం దీనిపై ఏఐఐఏ, ఎల్​ఎస్​హెచ్​టీఎం​ చేపట్టనున్న క్లినికల్​ ట్రయల్స్​ ద్వారా ఇందుకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలు లభ్యం కానున్నాయి. కొవిడ్​ చికిత్సకు సంబంధించి అధ్యయనంపై ఇతర దేశాల సంస్థలతో భారత ఆయుష్​ మంత్రిత్వ శాఖ చేతులు కలపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

"మూడు నెలలపాటు ఒక గ్రూపులోని 1,000 మందికి అశ్వగంధ మాత్రలను అందిస్తాం. మరో వెయ్యి మందికి అశ్వగంధ తరహాలోనే ఉండే ప్లేసిబో(ప్రభావం లేని మందు) మాత్రలను అందిస్తాం. తాము ఏ మాత్రలను తీసుకుంటున్నామో ఇందులో పాల్గొన్న వారికే కాకుండా.. వారిని పరిశీలించే వైద్యులకు కూడా తెలియదు. వారంతా 500మిల్లీగ్రాముల మాత్రలను రోజుకు రెండు సార్లు చొప్పున తీసుకుంటారు. అనంతరం వీరి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తారు."

-తనూజ మనోజ్​ నేసారీ, ఏఐఐఏ డైరెక్టర్​

16 నెలలపాటు జరిగిన వందకుపైగా సమావేశాల తర్వాత ఎల్​హెచ్​టీఎస్​తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోగలిగామని మనోజ్​ నేసారీ తెలిపారు. తమ అధ్యయనాన్ని డబ్ల్యూహెచ్ఓ-జీఎంపీ ధ్రువీకరించిందని చెప్పారు.

ఇదీ చూడండి: అశ్వగంధతో కరోనాకు ఔషధం!

భారతీయ సంప్రదాయ వైద్య వ్యవస్థను బలోపేతం చేసే దిశగా.. ఆయుష్​ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సలో అశ్వగంధ ఔషధాన్ని వినియోగించడంపై.. బ్రిటన్​లోని హైజీన్​ అండ్​ ట్రాపికల్​ మెడిసిన్​ సంస్థ(ఎల్​ఎస్​హెచ్​టీఎం)తో కలిసి అఖిల భారతీయ ఆయుర్వేద సంస్థ(ఏఐఐఏ) అధ్యయనం చేపట్టనుంది. ఈ మేరకు ఇరు సంస్థలు అవగాహన ఒప్పందాన్ని(ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. ఈ ఎంఓయూలో భాగంగా.. బ్రిటన్​లోని లీసిసెట్ర్​, బర్మింగ్​హామ్​, లండన్​ నగరాలకు చెందిన 2,000 మందిపై క్లినికల్ ట్రయల్స్​ నిర్వహించనున్నారు.

శాస్త్రీయ ఆధారాలు..

భారతీయ సంప్రదాయ ఔషధ మూలికల్లో ఒకటైన అశ్వగంధ(విఠానియా సోమ్నిఫెరా).. ఒత్తిడిని తగ్గించడం సహా రోగ నిరోధక శక్తిని పెంచే ఔషధంగా పేరు పొందింది. అయితే.. ఇది కొవిడ్​ను తగ్గిస్తుందనడానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. ప్రస్తుతం దీనిపై ఏఐఐఏ, ఎల్​ఎస్​హెచ్​టీఎం​ చేపట్టనున్న క్లినికల్​ ట్రయల్స్​ ద్వారా ఇందుకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలు లభ్యం కానున్నాయి. కొవిడ్​ చికిత్సకు సంబంధించి అధ్యయనంపై ఇతర దేశాల సంస్థలతో భారత ఆయుష్​ మంత్రిత్వ శాఖ చేతులు కలపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

"మూడు నెలలపాటు ఒక గ్రూపులోని 1,000 మందికి అశ్వగంధ మాత్రలను అందిస్తాం. మరో వెయ్యి మందికి అశ్వగంధ తరహాలోనే ఉండే ప్లేసిబో(ప్రభావం లేని మందు) మాత్రలను అందిస్తాం. తాము ఏ మాత్రలను తీసుకుంటున్నామో ఇందులో పాల్గొన్న వారికే కాకుండా.. వారిని పరిశీలించే వైద్యులకు కూడా తెలియదు. వారంతా 500మిల్లీగ్రాముల మాత్రలను రోజుకు రెండు సార్లు చొప్పున తీసుకుంటారు. అనంతరం వీరి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తారు."

-తనూజ మనోజ్​ నేసారీ, ఏఐఐఏ డైరెక్టర్​

16 నెలలపాటు జరిగిన వందకుపైగా సమావేశాల తర్వాత ఎల్​హెచ్​టీఎస్​తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోగలిగామని మనోజ్​ నేసారీ తెలిపారు. తమ అధ్యయనాన్ని డబ్ల్యూహెచ్ఓ-జీఎంపీ ధ్రువీకరించిందని చెప్పారు.

ఇదీ చూడండి: అశ్వగంధతో కరోనాకు ఔషధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.