ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 20,021 కరోనా కేసులు

author img

By

Published : Dec 28, 2020, 10:00 AM IST

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 20,021 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 279 కొవిడ్​ మరణాలు సంభవించాయి.

India reports 20,021 new COVID-19 cases, 21,131 recoveries, and 279 deaths in last 24 hours, as per Union Health Ministry
దేశంలో కొత్తగా 20,021 కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కొవిడ్​-19 కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. తాజాగా 20,021 కేసులు వెలుగుచూశాయి. బాధితుల సంఖ్య 1కోటి 2లక్షల 7వేల 871కి చేరింది. మరో 279 మంది మహమ్మారికి బలవ్వగా.. మరణాల సంఖ్య లక్షా 47వేల 901కి పెరిగింది.

రికవరీ రేటు ఇలా..

తాజాగా సుమారు 21వేల మంది వైరస్​ను జయించగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 97లక్షల 82వేల 669కి పెరిగింది. 2లక్షల 77వేలకుపైగా యాక్టివ్​ కేసులున్నాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 95.83 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.45 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే 7లక్షల 15వేల నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. ఫలితంగా మొత్తం టెస్ట్​ల సంఖ్య 16కోట్ల 88లక్షలు దాటాయి.

ఇదీ చూడండి: కొవిడ్ పంజా: కొత్తగా నాలుగు లక్షల కేసులు

దేశవ్యాప్తంగా కొవిడ్​-19 కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. తాజాగా 20,021 కేసులు వెలుగుచూశాయి. బాధితుల సంఖ్య 1కోటి 2లక్షల 7వేల 871కి చేరింది. మరో 279 మంది మహమ్మారికి బలవ్వగా.. మరణాల సంఖ్య లక్షా 47వేల 901కి పెరిగింది.

రికవరీ రేటు ఇలా..

తాజాగా సుమారు 21వేల మంది వైరస్​ను జయించగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 97లక్షల 82వేల 669కి పెరిగింది. 2లక్షల 77వేలకుపైగా యాక్టివ్​ కేసులున్నాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 95.83 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.45 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే 7లక్షల 15వేల నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. ఫలితంగా మొత్తం టెస్ట్​ల సంఖ్య 16కోట్ల 88లక్షలు దాటాయి.

ఇదీ చూడండి: కొవిడ్ పంజా: కొత్తగా నాలుగు లక్షల కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.