ETV Bharat / bharat

భారత్​కు 75లక్షల మోడెర్నా టీకా డోసులు! - moderna vaccine india update

'కొవాక్స్' కార్యక్రమం ద్వారా 75లక్షల మోడెర్నా టీకా డోసులు భారత్​కు అందనున్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికాతో.. నష్టపరిహార నిబంధనపై ఏకాభిప్రాయం ఇంకా కుదరనందున ఈ వ్యాక్సిన్‌ దేశంలో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

Moderna vaccine
మోడెర్నా టీకా డోసులు
author img

By

Published : Jul 20, 2021, 6:50 AM IST

కొవాక్స్‌ కార్యక్రమం ద్వారా భారత్‌కు త్వరలోనే 75 లక్షల మోడెర్నా టీకా డోసులు అందే అవకాశాలున్నాయి. మోడెర్నా, ఫైజర్​ టీకాలను భారత్​లోకి తీసుకొచ్చేందుకు.. సంబంధిత కంపెనీలతో చర్చలు నిర్వహిస్తున్నట్లు ఇటీవల నీతిఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. అయితే అమెరికాతో.. నష్టపరిహార నిబంధనపై ఏకాభిప్రాయం ఇంకా కుదరనందున మోడెర్నా వ్యాక్సిన్‌ దేశంలో ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తుందనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

చర్చలు జరుగుతున్నాయ్​..

కొవాక్స్ కార్యక్రమం ద్వారా 75 లక్షల మోడెర్నా డోసులు భారత్​కు అందనున్నాయని డబ్ల్యూహెచ్​ఓ సౌత్​ ఈస్ట్​ ఏషియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్.పూనమ్ కేత్రపాల్ సింగ్​ తెలిపారు. మోడెర్నా టీకాల దిగుమతికి ప్రభుత్వం చురుకుగా పని చేస్తోందని నీతిఆయోగ్‌ఆరోగ్య విభాగ ప్రతినిధి డాక్టర్‌ వీకే పాల్‌ తెలిపారు. దానిపై చర్చలు జరుగుతున్నట్లు వివరించారు.

నష్టపరిహార నిబంధన ఒప్పందాన్ని ఖరారు చేయడానికి భారత ప్రభుత్వం పలు షరతులను విధిస్తూ... పరిశీలన కోసం వాటిని ఇటీవలే అమెరికాకు చెందిన ఔషధ తయారీదారులకు పంపినట్లు సమాచారం.

భారత్​లో మోడెర్నా టీకా అత్యవసర వినియోగానికి జూన్​లోనే డీసీజీఐ అనుమతించింది. ఈ టీకాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకునేందుకు.. సిప్లా సంస్థకు డీసీజీఐ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది.

ఇదీ చదవండి : Vaccine Trials: 2-6ఏళ్ల వారికి రెండో డోసు ట్రయల్స్​!

కొవాక్స్‌ కార్యక్రమం ద్వారా భారత్‌కు త్వరలోనే 75 లక్షల మోడెర్నా టీకా డోసులు అందే అవకాశాలున్నాయి. మోడెర్నా, ఫైజర్​ టీకాలను భారత్​లోకి తీసుకొచ్చేందుకు.. సంబంధిత కంపెనీలతో చర్చలు నిర్వహిస్తున్నట్లు ఇటీవల నీతిఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. అయితే అమెరికాతో.. నష్టపరిహార నిబంధనపై ఏకాభిప్రాయం ఇంకా కుదరనందున మోడెర్నా వ్యాక్సిన్‌ దేశంలో ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తుందనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

చర్చలు జరుగుతున్నాయ్​..

కొవాక్స్ కార్యక్రమం ద్వారా 75 లక్షల మోడెర్నా డోసులు భారత్​కు అందనున్నాయని డబ్ల్యూహెచ్​ఓ సౌత్​ ఈస్ట్​ ఏషియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్.పూనమ్ కేత్రపాల్ సింగ్​ తెలిపారు. మోడెర్నా టీకాల దిగుమతికి ప్రభుత్వం చురుకుగా పని చేస్తోందని నీతిఆయోగ్‌ఆరోగ్య విభాగ ప్రతినిధి డాక్టర్‌ వీకే పాల్‌ తెలిపారు. దానిపై చర్చలు జరుగుతున్నట్లు వివరించారు.

నష్టపరిహార నిబంధన ఒప్పందాన్ని ఖరారు చేయడానికి భారత ప్రభుత్వం పలు షరతులను విధిస్తూ... పరిశీలన కోసం వాటిని ఇటీవలే అమెరికాకు చెందిన ఔషధ తయారీదారులకు పంపినట్లు సమాచారం.

భారత్​లో మోడెర్నా టీకా అత్యవసర వినియోగానికి జూన్​లోనే డీసీజీఐ అనుమతించింది. ఈ టీకాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకునేందుకు.. సిప్లా సంస్థకు డీసీజీఐ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది.

ఇదీ చదవండి : Vaccine Trials: 2-6ఏళ్ల వారికి రెండో డోసు ట్రయల్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.