ETV Bharat / bharat

'పెద్ద పొరపాటు జరిగింది.. కానీ అదృష్టవశాత్తూ...'

author img

By

Published : Mar 15, 2022, 11:52 AM IST

Updated : Mar 15, 2022, 12:56 PM IST

India missile hit Pakistan: పాక్ భూభాగంలోకి దూసుకెళ్లిన క్షిపణి ఘటనను తీవ్రంగా పరిగణించినట్లు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ పేర్కొన్నారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఆయుధ వ్యవస్థలో లోటుపాట్లు ఉన్నట్లు విచారణలో తేలితే.. వాటిని సరిదిద్దేందుకు కట్టుబడి ఉంటామన్నారు. మరోవైపు ఈ క్షిపణి ఘటనపై భారత్​ వైఖరిని అమెరికా సమర్థించింది.

India missile hit Pakistan
India missile hit Pakistan

India missile hit Pakistan: పాక్ భుభాగంలోకి భారత క్షిపణి దూసుకెళ్లడంపై రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. భారత క్షిపణి వ్యవస్థ అత్యంత సురక్షితమైందని.. దేశ రక్షణ వ్యవస్థ భద్రతా విధానాలు, నిబంధనలకు అత్యధిక ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. మార్చి 9న సాయంత్రం 7 గంటలకు పొరపాటున భారత క్షిపణి పాకిస్థాన్​ భూభాగంలోకి దూసుకెళ్లిందని తెలిపారు. అయితే ఇది విచారకర ఘటన అని రాజ్​నాథ్ అన్నారు. అదృష్టవశాత్తూ ఎలాంటి నష్టం జరగలేదని.. ఇంది కొంత ఊరట కలిగించే అంశమని పేర్కొన్నారు.

"ఆయుధ వ్యవస్థ భద్రతకు భారత్​ అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. క్షిపణి పేలుడు ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాం. ఘటనకు గల కచ్చితమైన కారణాలు విచారణ ద్వారానే తెలుస్తాయి. క్షిపణి ఘటన నేపథ్యంలో రక్షణ పరికరాల కార్యకలాపాలు, నిర్వహణ తనిఖీల ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు కూడా సమీక్షిస్తున్నాం. ఈ విచారణ అనంతరంలో ఆయుధ వ్యవస్థలో లోటుపాట్లు ఉన్నట్లు బయటపడితే.. వాటిని సరిదిద్దేందుకు కట్టుబడి ఉంటాం."

- రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​

'పొరపాటున జరిగిందే'

పొరపాటును పేలిన క్షిపణి పాకిస్థాన్‌లో పడిన ఘటనలో భారత్ వైఖరిని అమెరికా సమర్థించింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం అది పొరపాటున జరిగిన ప్రమాదమేనని.. అంతకుమించి ఇంకే కారణాల్లేనట్లు అమెరికా అధికార ప్రతినిధి నెడ్​ ప్రైస్ తెలిపారు. ఇప్పటికే ఈ ఘటనపై మార్చి 9న భారత్ ప్రకటన చేసిందని గుర్తుచేశారు. ఈ విషయంలో ఎలాంటి అదనపు సమాచారం కావాలన్నా భారత రక్షణ శాఖనే అడగాలని ప్రైస్‌ సూచించారు. క్షిపణి ఘటనపై ఇంతకుమించి ఏం మాట్లాడబోమని స్పష్టంచేశారు.

ఇదీ చూడండి: హిజాబ్​ బ్యాన్​కు హైకోర్టు సమర్థన.. ఆ పిటిషన్లన్నీ కొట్టివేత

India missile hit Pakistan: పాక్ భుభాగంలోకి భారత క్షిపణి దూసుకెళ్లడంపై రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. భారత క్షిపణి వ్యవస్థ అత్యంత సురక్షితమైందని.. దేశ రక్షణ వ్యవస్థ భద్రతా విధానాలు, నిబంధనలకు అత్యధిక ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. మార్చి 9న సాయంత్రం 7 గంటలకు పొరపాటున భారత క్షిపణి పాకిస్థాన్​ భూభాగంలోకి దూసుకెళ్లిందని తెలిపారు. అయితే ఇది విచారకర ఘటన అని రాజ్​నాథ్ అన్నారు. అదృష్టవశాత్తూ ఎలాంటి నష్టం జరగలేదని.. ఇంది కొంత ఊరట కలిగించే అంశమని పేర్కొన్నారు.

"ఆయుధ వ్యవస్థ భద్రతకు భారత్​ అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. క్షిపణి పేలుడు ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాం. ఘటనకు గల కచ్చితమైన కారణాలు విచారణ ద్వారానే తెలుస్తాయి. క్షిపణి ఘటన నేపథ్యంలో రక్షణ పరికరాల కార్యకలాపాలు, నిర్వహణ తనిఖీల ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు కూడా సమీక్షిస్తున్నాం. ఈ విచారణ అనంతరంలో ఆయుధ వ్యవస్థలో లోటుపాట్లు ఉన్నట్లు బయటపడితే.. వాటిని సరిదిద్దేందుకు కట్టుబడి ఉంటాం."

- రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​

'పొరపాటున జరిగిందే'

పొరపాటును పేలిన క్షిపణి పాకిస్థాన్‌లో పడిన ఘటనలో భారత్ వైఖరిని అమెరికా సమర్థించింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం అది పొరపాటున జరిగిన ప్రమాదమేనని.. అంతకుమించి ఇంకే కారణాల్లేనట్లు అమెరికా అధికార ప్రతినిధి నెడ్​ ప్రైస్ తెలిపారు. ఇప్పటికే ఈ ఘటనపై మార్చి 9న భారత్ ప్రకటన చేసిందని గుర్తుచేశారు. ఈ విషయంలో ఎలాంటి అదనపు సమాచారం కావాలన్నా భారత రక్షణ శాఖనే అడగాలని ప్రైస్‌ సూచించారు. క్షిపణి ఘటనపై ఇంతకుమించి ఏం మాట్లాడబోమని స్పష్టంచేశారు.

ఇదీ చూడండి: హిజాబ్​ బ్యాన్​కు హైకోర్టు సమర్థన.. ఆ పిటిషన్లన్నీ కొట్టివేత

Last Updated : Mar 15, 2022, 12:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.