ETV Bharat / bharat

మయన్మార్​లో​ హింసను ఖండించిన భారత్

author img

By

Published : Apr 2, 2021, 5:59 PM IST

మయన్మార్​ ప్రజాస్వామ్యం పునరుద్ధరణ కోసం ఆందోళన చేస్తున్నవారిపై ఆ దేశ సైన్యం హింసకు పాల్పడడాన్ని భారత్​ ఖండించింది. రాజకీయ ఖైదీలను తక్షణమే విడుదల చేయాలని కోరింది.

India condemns use of violence in Myanmar, urges release of political prisoners
మయన్మార్​ సమస్య పరిష్కారానికి భారత్​ సిద్ధం!

మయన్మార్​లో సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసన చేస్తోన్నవారిపై ఆ దేశ సైన్యం వ్యవహరిస్తున్న తీరును భారత్​ తప్పుపట్టింది. దేశంలో చట్టపరమైన పాలన అవశ్యకతను గుర్తిస్తూ.. రాజకీయ బంధీలను విడుదల చేయాలని కోరింది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.

"హింసాత్మక ఘటనలను మేం ఖండిస్తున్నాం. చట్ట నిబంధనలు ప్రబలంగా ఉండాలని విశ్వసిస్తున్నాం. మయన్మార్​లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధిరించాలని ఆశిస్తున్నాం. నిర్భంద రాజకీయ నేతలను విడుదల చేయాలని కోరుతున్నాం. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో సమస్యను పరిష్కరించడానికి మద్దతుగా నిలుస్తాం. సమతుల్య, నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు అవసరమైతే ఐరాస భద్రతా మండలితో సంప్రదింపులు జరుపుతాం."

- అరిందమ్​ బాగ్చి, భారత విదేశాంగ శాఖ ప్రతినిధి

మయన్మార్​తో సరిహద్దు సమస్య గురించి మాట్లాడిన అరిందమ్​.. భయాందోళనతో దేశంలోకి ప్రవేశిస్తున్న శరణార్థుల పట్ల మానవాతా దృక్పథంతో భారత చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.

మయన్మార్​లో గతేడాది నవంబర్​లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో 2020 ఫిబ్రవరి 1న రాజకీయ నేతలను బంధీలుగా చేసి అధికారాన్ని చేజిక్కుంచుకుంది సైన్యం. అప్పటినుంచి సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. సైన్యం వారిపై హింసకు దిగుతుండగా ఇప్పటివరకు 500మందికి పైగా ఆందోళనకారులు మృతి చెందారు.

ఇదీ చూడండి: సొరంగంలో రైలు ప్రమాదం- 36మంది మృతి!

మయన్మార్​లో సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసన చేస్తోన్నవారిపై ఆ దేశ సైన్యం వ్యవహరిస్తున్న తీరును భారత్​ తప్పుపట్టింది. దేశంలో చట్టపరమైన పాలన అవశ్యకతను గుర్తిస్తూ.. రాజకీయ బంధీలను విడుదల చేయాలని కోరింది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.

"హింసాత్మక ఘటనలను మేం ఖండిస్తున్నాం. చట్ట నిబంధనలు ప్రబలంగా ఉండాలని విశ్వసిస్తున్నాం. మయన్మార్​లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధిరించాలని ఆశిస్తున్నాం. నిర్భంద రాజకీయ నేతలను విడుదల చేయాలని కోరుతున్నాం. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో సమస్యను పరిష్కరించడానికి మద్దతుగా నిలుస్తాం. సమతుల్య, నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు అవసరమైతే ఐరాస భద్రతా మండలితో సంప్రదింపులు జరుపుతాం."

- అరిందమ్​ బాగ్చి, భారత విదేశాంగ శాఖ ప్రతినిధి

మయన్మార్​తో సరిహద్దు సమస్య గురించి మాట్లాడిన అరిందమ్​.. భయాందోళనతో దేశంలోకి ప్రవేశిస్తున్న శరణార్థుల పట్ల మానవాతా దృక్పథంతో భారత చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.

మయన్మార్​లో గతేడాది నవంబర్​లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో 2020 ఫిబ్రవరి 1న రాజకీయ నేతలను బంధీలుగా చేసి అధికారాన్ని చేజిక్కుంచుకుంది సైన్యం. అప్పటినుంచి సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. సైన్యం వారిపై హింసకు దిగుతుండగా ఇప్పటివరకు 500మందికి పైగా ఆందోళనకారులు మృతి చెందారు.

ఇదీ చూడండి: సొరంగంలో రైలు ప్రమాదం- 36మంది మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.