ఎనిమిదేళ్ల బాలుడు పెద్ద సాహసమే చేశాడు. తమిళనాడులోని విల్లుపురానికి చెందిన శబరీనాథ్ అనే బాలుడు తన తల్లిని వెదుకుతూ రాత్రిపూట సైకిల్పై 92 కిలోమీటర్ల ప్రయాణానికి ఉపక్రమించాడు.
ఇదీ జరిగింది..
తమిళనాడు విల్లుపురంలోని తిండివనంలో విలేజ్ అసిస్టెంట్ రఘురామన్-రాజేశ్వరి భార్యాభర్తలు. నెలరోజులు క్రితం వీరి మధ్య వచ్చిన ఓ చిన్న తగాదా పెద్ద గొడవగా మారింది. దీంతో రాజేశ్వరి కల్లకురిచిలోని తన పుట్టింటికి వెళ్లింది. అమ్మ తిరిగి వస్తుందని ఎదురుచూసిన చిన్న కొడుకు శబరీనాథ్ ఎంతకీ రాకపోగా డీలాపడ్డాడు.
![శబరీనాథ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tn-klk-02-thindivanam-siruvan-missing-sabari-etv-exclusive-news-tn10026_09082021225324_0908f_1628529804_230_1008newsroom_1628573231_1064.jpg)
![శబరీనాథ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tn-klk-02-thindivanam-siruvan-missing-sabari-etv-exclusive-mailam-cycle-news-tn10026_09082021225529_0908f_1628529929_767_1008newsroom_1628573231_937.jpg)
సైకిల్పైనే..
దీనితో అమ్మను ఎలాగైనా కలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా సోమవారం రాత్రి తన అమ్మమ్మ వాళ్లింటికి బయలుదేరాడు. తిండివనం నుంచి 92 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్లకురిచికి వెళ్లేందుకు స్నేహితుడి వద్ద సైకిల్ తీసుకున్నాడు. విల్లుపురం-నాగపట్టణం జాతీయ రహదారిపై అప్పటికే 14 కి.మీ ప్రయాణించిన బాలుడిని పోలీసులు గుర్తించారు. ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళ్తున్నావంటూ అడిగారు.
![తమిళనాడు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tn-klk-02-thindivanam-siruvan-missing-sabari-etv-exclusive-mailam-inspector-news-tn10026_09082021225438_0908f_1628529878_917_1008newsroom_1628573231_57.jpg)
బాలుడు చెప్పిన విషయం విని చలించిపోయారు. ఆ సమయంలో బాలుడు ఒంటరిగా ప్రయాణించడం సురక్షితం కాదని భావించి.. తండ్రిని పిలిపించి అప్పగించారు. అనంతరం సమాచారం తెలుకున్న తల్లి రాజేశ్వరి సైతం ఇంటికి వచ్చి కుమారుడిని కలుసుకుంది. బాలుడి ప్రేమకు ఉప్పొంగిపోయింది.
ఇవీ చదవండి: