ETV Bharat / bharat

రూ.200 కోట్లతో తొలి వెండి దేవాలయం

దేశంలో మొట్టమొదటి వెండి ఆలయం మధ్యప్రదేశ్​లో నిర్మితమవుతోంది. దీనిని రూ.200 కోట్ల వ్యయంతో ఐదేళ్లలో సిద్ధం చేయనున్నారు.

author img

By

Published : Apr 27, 2021, 11:56 AM IST

silver temple worth Rs 200 cr
రూ.200 కోట్లతో తొలి వెండి దేవాలయం

దేశంలో తొలిసారిగా మధ్యప్రదేశ్​లో ఓ వెండి దేవాలయ నిర్మాణం జరగబోతోంది. బాందా జిల్లాలోని టీకమ్​గఢ్​లో రూ.200 కోట్ల వ్యయంతో ఐదేళ్లలో ఈ జైన మందిరాన్ని నిర్మించనున్నారు. దానికోసం జైసల్మేర్​ నుంచి పసుపు పాలరాతిని వాడనున్నారు. అహ్మదాబాద్​కు చెందిన ఆర్కిటెక్ట్​(రూపశిల్పి)​ ఈ కోవెల ఆకృతిని రూపొందించారు.

silver temple worth Rs 200 cr
ఆలయ లేఅవుట్

టీకమ్​గఢ్​ జిల్లా కేంద్రం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో 2 క్వింటాళ్ల చొప్పున బరువు గల 24 యాత్రికుల విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ప్రదీప్ జైన్ తెలిపారు. ఆచార్య విద్యాసాగర్​ మహారాజ్​ సూచనల మేరకు దేవాలయ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు.

silver temple worth Rs 200 cr
జైన మందిరం

ఇదీ చూడండి: సొంత డబ్బుతో 400 టన్నుల ప్రాణవాయువు

దేశంలో తొలిసారిగా మధ్యప్రదేశ్​లో ఓ వెండి దేవాలయ నిర్మాణం జరగబోతోంది. బాందా జిల్లాలోని టీకమ్​గఢ్​లో రూ.200 కోట్ల వ్యయంతో ఐదేళ్లలో ఈ జైన మందిరాన్ని నిర్మించనున్నారు. దానికోసం జైసల్మేర్​ నుంచి పసుపు పాలరాతిని వాడనున్నారు. అహ్మదాబాద్​కు చెందిన ఆర్కిటెక్ట్​(రూపశిల్పి)​ ఈ కోవెల ఆకృతిని రూపొందించారు.

silver temple worth Rs 200 cr
ఆలయ లేఅవుట్

టీకమ్​గఢ్​ జిల్లా కేంద్రం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో 2 క్వింటాళ్ల చొప్పున బరువు గల 24 యాత్రికుల విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ప్రదీప్ జైన్ తెలిపారు. ఆచార్య విద్యాసాగర్​ మహారాజ్​ సూచనల మేరకు దేవాలయ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు.

silver temple worth Rs 200 cr
జైన మందిరం

ఇదీ చూడండి: సొంత డబ్బుతో 400 టన్నుల ప్రాణవాయువు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.