ETV Bharat / bharat

'ఆక్సిజన్ అడ్డుకుంటే ఎవరికైనా ఉరిశిక్షే' - దిల్లీ హైకోర్టు కేంద్రం ఆక్సిజన్ కొరత

ఆక్సిజన్ కొరతపై దిల్లీ హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మెడికల్ ఆక్సిజన్ సరఫరాను ఎవరైనా అడ్డుకుంటే ఉరిశిక్ష విధిస్తామని పేర్కొంది. ఆక్సిజన్ సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడింది.

'ఆక్సిజన్ సరఫరా అడ్డుకుంటే అధికారులకు ఉరిశిక్షే'
author img

By

Published : Apr 24, 2021, 1:13 PM IST

Updated : Apr 24, 2021, 1:31 PM IST

ఆస్పత్రులకు ఆక్సిజన్ కొరతపై దిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రస్తుతం ఆక్సిజన్ సరఫరాకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆక్సిజన్ సరఫరాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అడ్డుకున్నట్లు తెలిస్తే ఉరిశిక్ష విధిస్తామని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరికైనా ఇదే శిక్ష అని స్పష్టం చేసింది.

ఆక్సిజన్ కొరతపై మహారాజ అగ్రసేన్ ఆస్పత్రి దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఆక్సిజన్ సరఫరాకు కేంద్రం మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

"ఆక్సిజన్ అందించలేకపోవడం నేరపూరిత చర్య. జీవించడం ప్రజల ప్రాథమిక హక్కు. ఆక్సిజన్ సరఫరా విషయంలో అలసత్వం వహిస్తే ఎంత పెద్ద అధికారినైనా ఉపేక్షించేదిలేదు. ఆక్సిజన్ సరఫరాకి ఆటంకం కలిగినట్లు తెలిస్తే క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ అధికారికి ఉరిశిక్ష విధిస్తాం. ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటున్న ఘటనను మా దృష్టికి తీసుకురండి. వారికి మేం ఉరిశిక్ష విధిస్తాం. దిల్లీకి 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్​ను మీరు(కేంద్ర ప్రభుత్వం) ఎప్పుడు అందిస్తారు? రోజుకు 480 మెట్రిక్ టన్నుల ప్రాణవాయువును దిల్లీకి అందిస్తామని ఏప్రిల్ 21న మాకు హామీ ఇచ్చారు."

-దిల్లీ హైకోర్టు

ఈ పిటిషన్​పై స్పందించిన కేంద్రం.. ఆక్సిజన్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. సమన్వయంతో ఆక్సిజన్ కొరతను అధిగమిస్తున్నట్లు పేర్కొంది. ఇందుకోసం 24 గంటలు పని చేస్తున్నామని ఆక్సిజన్ సరఫరా కోసం కేంద్రం నియమించిన నోడల్ అధికారి వెల్లడించారు.

ఈ సందర్భంగా.. దిల్లీలో ఆక్సిజన్ ప్లాంట్ ఎందుకు ఏర్పాటు చేయలేదని దిల్లీ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సొంతంగా ఆక్సిజన్ ప్లాంట్​ను ఏర్పాటు చేయాలని దిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్రం నుంచి వచ్చిన ఆక్సిజన్ వెంటనే ఆస్పత్రులకు పంపిస్తున్నామని దిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు వివరణ ఇచ్చింది.

మాస్కు సరిగా ధరించాలి

మాస్కులు సరిగా ధరించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని పంజాబ్, హరియాణా హైకోర్టు స్పష్టం చేసింది. ముక్కు, నోరు పూర్తిగా కనిపించేలా మాస్కు ధరిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి- కరోనా రోగుల కోసం 180 కి.మీ. ప్రయాణించి సేవలు

ఆస్పత్రులకు ఆక్సిజన్ కొరతపై దిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రస్తుతం ఆక్సిజన్ సరఫరాకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆక్సిజన్ సరఫరాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అడ్డుకున్నట్లు తెలిస్తే ఉరిశిక్ష విధిస్తామని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరికైనా ఇదే శిక్ష అని స్పష్టం చేసింది.

ఆక్సిజన్ కొరతపై మహారాజ అగ్రసేన్ ఆస్పత్రి దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఆక్సిజన్ సరఫరాకు కేంద్రం మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

"ఆక్సిజన్ అందించలేకపోవడం నేరపూరిత చర్య. జీవించడం ప్రజల ప్రాథమిక హక్కు. ఆక్సిజన్ సరఫరా విషయంలో అలసత్వం వహిస్తే ఎంత పెద్ద అధికారినైనా ఉపేక్షించేదిలేదు. ఆక్సిజన్ సరఫరాకి ఆటంకం కలిగినట్లు తెలిస్తే క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ అధికారికి ఉరిశిక్ష విధిస్తాం. ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటున్న ఘటనను మా దృష్టికి తీసుకురండి. వారికి మేం ఉరిశిక్ష విధిస్తాం. దిల్లీకి 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్​ను మీరు(కేంద్ర ప్రభుత్వం) ఎప్పుడు అందిస్తారు? రోజుకు 480 మెట్రిక్ టన్నుల ప్రాణవాయువును దిల్లీకి అందిస్తామని ఏప్రిల్ 21న మాకు హామీ ఇచ్చారు."

-దిల్లీ హైకోర్టు

ఈ పిటిషన్​పై స్పందించిన కేంద్రం.. ఆక్సిజన్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. సమన్వయంతో ఆక్సిజన్ కొరతను అధిగమిస్తున్నట్లు పేర్కొంది. ఇందుకోసం 24 గంటలు పని చేస్తున్నామని ఆక్సిజన్ సరఫరా కోసం కేంద్రం నియమించిన నోడల్ అధికారి వెల్లడించారు.

ఈ సందర్భంగా.. దిల్లీలో ఆక్సిజన్ ప్లాంట్ ఎందుకు ఏర్పాటు చేయలేదని దిల్లీ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సొంతంగా ఆక్సిజన్ ప్లాంట్​ను ఏర్పాటు చేయాలని దిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్రం నుంచి వచ్చిన ఆక్సిజన్ వెంటనే ఆస్పత్రులకు పంపిస్తున్నామని దిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు వివరణ ఇచ్చింది.

మాస్కు సరిగా ధరించాలి

మాస్కులు సరిగా ధరించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని పంజాబ్, హరియాణా హైకోర్టు స్పష్టం చేసింది. ముక్కు, నోరు పూర్తిగా కనిపించేలా మాస్కు ధరిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి- కరోనా రోగుల కోసం 180 కి.మీ. ప్రయాణించి సేవలు

Last Updated : Apr 24, 2021, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.