ETV Bharat / bharat

ఐటీ దాడుల్లో రూ.700కోట్ల నల్లధనం పట్టివేత

author img

By

Published : Dec 17, 2020, 6:55 PM IST

తమిళనాడు ప్రభుత్వ పనుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఐటీ శాఖ గురువారం సోదాలు చేపట్టింది. ఈ దాడుల్లో సుమారు రూ.700 కోట్ల నల్లధనం బయటపడినట్టు అధికారులు తెలిపారు.

I-T Dept detects Rs 700 cr black income after raids on TN contractor group
ఆ కంపెనీ ఐటీ దాడుల్లో రూ.700కోట్ల నల్లధనం గుట్టురట్టు

తమిళనాడుకు చెందిన ప్రభుత్వ కాంట్రాక్ట్​ నిర్వహణ సంస్థ కార్యాలయంపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో మొత్తం రూ.700 కోట్ల నల్లధనం బయటపడినట్టు ఐటీ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా లెక్కలు చూపని రూ. 21కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.

ప్రభుత్వ కాంట్రాక్ట్​కు సంబంధించి సివిల్​ వర్క్స్​, సముద్ర తీరప్రాంతాల్లో వేవ్​ బ్రేకర్లను నిర్మిస్తోన్న ఈ కంపెనీ.. బస్సు రవాణా, మ్యారేజ్​ హాల్​, ఫుడ్​ మాసాలా వ్యాపారాలను నడుపుతోంది. ఈ సంస్థపై ఈ నెల 14, 15 తేదీల్లో ఈరోడ్​, చెన్నై ప్రాంతాలలో ఈ సోదాలు నిర్వహించింది ఐటీ శాఖ. ఈ దాడుల్లో లెక్కల్లో చూపని రూ.700 కోట్ల ఆదాయాన్ని గుర్తించింది. ఈ సొమ్ముతో రియల్​ ఎస్టేట్​ విభాగం, ఇతర వ్యాపార రంగాలలో భారీగా పెట్టుబడులు పెడుతున్నట్టు గుర్తించారు అధికారులు.

ఇదీ చదవండి: 'సెక్యూరిటీ గార్డులకు ప్రత్యేక శిక్షణ తప్పనిసరి'

తమిళనాడుకు చెందిన ప్రభుత్వ కాంట్రాక్ట్​ నిర్వహణ సంస్థ కార్యాలయంపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో మొత్తం రూ.700 కోట్ల నల్లధనం బయటపడినట్టు ఐటీ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా లెక్కలు చూపని రూ. 21కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.

ప్రభుత్వ కాంట్రాక్ట్​కు సంబంధించి సివిల్​ వర్క్స్​, సముద్ర తీరప్రాంతాల్లో వేవ్​ బ్రేకర్లను నిర్మిస్తోన్న ఈ కంపెనీ.. బస్సు రవాణా, మ్యారేజ్​ హాల్​, ఫుడ్​ మాసాలా వ్యాపారాలను నడుపుతోంది. ఈ సంస్థపై ఈ నెల 14, 15 తేదీల్లో ఈరోడ్​, చెన్నై ప్రాంతాలలో ఈ సోదాలు నిర్వహించింది ఐటీ శాఖ. ఈ దాడుల్లో లెక్కల్లో చూపని రూ.700 కోట్ల ఆదాయాన్ని గుర్తించింది. ఈ సొమ్ముతో రియల్​ ఎస్టేట్​ విభాగం, ఇతర వ్యాపార రంగాలలో భారీగా పెట్టుబడులు పెడుతున్నట్టు గుర్తించారు అధికారులు.

ఇదీ చదవండి: 'సెక్యూరిటీ గార్డులకు ప్రత్యేక శిక్షణ తప్పనిసరి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.