ETV Bharat / bharat

Covid-19: కరోనాతో తగ్గిన మానవుల ఆయుర్దాయం

author img

By

Published : Oct 23, 2021, 5:52 PM IST

Updated : Oct 23, 2021, 10:34 PM IST

కరోనా మహమ్మారి ప్రజల జీవితాలపై వేర్వేరు స్థాయుల్లో తీవ్ర ప్రభావం చూపింది. ఎవరి ఊహలకు అందని విధంగా ఆయుర్దాయం కూడా తగ్గించింది. అంతర్జాతీయ జనాభా అధ్యయన సంస్థ-ఐఐపీఎస్ జరిపిన పరిశోధనలో ఈ విషయం తేలింది. ఐఐపీఎస్ పరిశోధన నివేదికలోని అంశాలపై ప్రత్యేక కథనం.

life time corona
కరోనా

గత ఏడాదిన్నర కాలంగా ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి దాదాపు అన్నివర్గాలతోపాటు అన్ని రంగాలను కుదిపేసింది. ఆర్థికంగా, సామాజికంగా కోట్లాది మంది జీవితాలపై తీవ్రప్రభావం చూపింది. అంతేకాదు క‌రోనా వ‌ల్ల దేశంలోని పురుషులు, మహిళల ఆయుర్దాయం స‌గ‌టున రెండేళ్లు త‌గ్గింది. ఈ మేరకు ఇంట‌ర్నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఫ‌ర్ పాపులేష‌న్‌ స్టడీస్ ఓ నివేదిక విడుదల చేసింది. ఐఐపీఎస్ ప్రొఫెస‌ర్ సూర్యకాంత్ యాద‌వ్ ఆధ్వర్యంలో తయారైన ఈ నివేదికను బీఎంసీ ప‌బ్లిక్ హెల్త్ జ‌ర్నల్‌ ఇటీవల ప్రచురించింది. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఆడ‌, మ‌గ‌ ఆయుర్దాయం త‌గ్గిన‌ట్లు ఈ అధ్యయనంలో తేలింది.

దేశంలోని మరణాలపై కొవిడ్‌ ప్రభావం, పర్యావసనాలపై ఐఐపీఎస్ ప్రొఫెసర్‌ సూర్యకాంత్ యాదవ్‌ అధ్యయనం చేశారు. శిశువు జన్మించిన సమయంలో మరణాల రేటు స్థిరంగా ఉంటే నవజాత శిశువు జీవించే సగటు సంవత్సరాల సంఖ్య ఆధారంగా ఆయుర్దాయం లెక్కిస్తారు. 2019 నివేదిక ప్రకారం పురుషుల జీవిత‌కాలం 69.5ఏళ్లు మహిళల జీవితకాలం 72ఏళ్లుగా ఉంది. అయితే ఆయుష్షు రెండేళ్లు త‌గ్గటం వ‌ల్ల పురుషుల ఆయురార్దం 67.5 ఏళ్లు, మ‌హిళ‌ల జీవితకాలం 69.8 ఏళ్లకు తగ్గినట్లు 2020 నివేదిక‌లో పేర్కొంది.

కొవిడ్ వ‌ల్ల 35నుంచి 79ఏళ్ల వ‌య‌సున్నవారిలో ఎక్కువ మ‌ర‌ణాలు సంభ‌వించిన‌ట్లు పరిశోధకులు తేల్చారు. అందువ‌ల్లే జీవిత‌కాలం త‌గ్గిన‌ట్లు ఐఐపీఎస్‌ ప్రొఫెసర్‌ సూర్యకాంత్‌ యాద‌వ్ తెలిపారు. కరోనా వల్ల 39-69 ఏళ్ల పురుషులు ఎక్కువగా చనిపోయినట్లు తేల్చారు. సాధారణ కాలంతో పోలిస్తే 2020లో కరోనా వల్ల 35-79 ఏళ్ల వయసువారు ఎక్కువగా చనిపోయినట్లు పేర్కొన్నారు.

మహమ్మారుల బారినపడిన ప్రతిసారి ఆయుర్దాయం తగ్గినట్లు ఐఐపీఎస్ డైరెక్టర్‌ డాక్టర్‌ కేఎస్ జెమ్స్‌ తెలిపారు. ఆఫ్రిన్‌ దేశాల్లో హెచ్​ఐవీ-ఎయిడ్స్ తర్వాత ఆయుర్దాయం పడిపోయింది. మహమ్మారి నియంత్రణలోకి వచ్చాక ఆయుర్దాయం మళ్లీ సాధారణస్థితికి చేరినట్లు చెప్పారు.

ఇవీ చదవండి:

గత ఏడాదిన్నర కాలంగా ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి దాదాపు అన్నివర్గాలతోపాటు అన్ని రంగాలను కుదిపేసింది. ఆర్థికంగా, సామాజికంగా కోట్లాది మంది జీవితాలపై తీవ్రప్రభావం చూపింది. అంతేకాదు క‌రోనా వ‌ల్ల దేశంలోని పురుషులు, మహిళల ఆయుర్దాయం స‌గ‌టున రెండేళ్లు త‌గ్గింది. ఈ మేరకు ఇంట‌ర్నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఫ‌ర్ పాపులేష‌న్‌ స్టడీస్ ఓ నివేదిక విడుదల చేసింది. ఐఐపీఎస్ ప్రొఫెస‌ర్ సూర్యకాంత్ యాద‌వ్ ఆధ్వర్యంలో తయారైన ఈ నివేదికను బీఎంసీ ప‌బ్లిక్ హెల్త్ జ‌ర్నల్‌ ఇటీవల ప్రచురించింది. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఆడ‌, మ‌గ‌ ఆయుర్దాయం త‌గ్గిన‌ట్లు ఈ అధ్యయనంలో తేలింది.

దేశంలోని మరణాలపై కొవిడ్‌ ప్రభావం, పర్యావసనాలపై ఐఐపీఎస్ ప్రొఫెసర్‌ సూర్యకాంత్ యాదవ్‌ అధ్యయనం చేశారు. శిశువు జన్మించిన సమయంలో మరణాల రేటు స్థిరంగా ఉంటే నవజాత శిశువు జీవించే సగటు సంవత్సరాల సంఖ్య ఆధారంగా ఆయుర్దాయం లెక్కిస్తారు. 2019 నివేదిక ప్రకారం పురుషుల జీవిత‌కాలం 69.5ఏళ్లు మహిళల జీవితకాలం 72ఏళ్లుగా ఉంది. అయితే ఆయుష్షు రెండేళ్లు త‌గ్గటం వ‌ల్ల పురుషుల ఆయురార్దం 67.5 ఏళ్లు, మ‌హిళ‌ల జీవితకాలం 69.8 ఏళ్లకు తగ్గినట్లు 2020 నివేదిక‌లో పేర్కొంది.

కొవిడ్ వ‌ల్ల 35నుంచి 79ఏళ్ల వ‌య‌సున్నవారిలో ఎక్కువ మ‌ర‌ణాలు సంభ‌వించిన‌ట్లు పరిశోధకులు తేల్చారు. అందువ‌ల్లే జీవిత‌కాలం త‌గ్గిన‌ట్లు ఐఐపీఎస్‌ ప్రొఫెసర్‌ సూర్యకాంత్‌ యాద‌వ్ తెలిపారు. కరోనా వల్ల 39-69 ఏళ్ల పురుషులు ఎక్కువగా చనిపోయినట్లు తేల్చారు. సాధారణ కాలంతో పోలిస్తే 2020లో కరోనా వల్ల 35-79 ఏళ్ల వయసువారు ఎక్కువగా చనిపోయినట్లు పేర్కొన్నారు.

మహమ్మారుల బారినపడిన ప్రతిసారి ఆయుర్దాయం తగ్గినట్లు ఐఐపీఎస్ డైరెక్టర్‌ డాక్టర్‌ కేఎస్ జెమ్స్‌ తెలిపారు. ఆఫ్రిన్‌ దేశాల్లో హెచ్​ఐవీ-ఎయిడ్స్ తర్వాత ఆయుర్దాయం పడిపోయింది. మహమ్మారి నియంత్రణలోకి వచ్చాక ఆయుర్దాయం మళ్లీ సాధారణస్థితికి చేరినట్లు చెప్పారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 23, 2021, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.