ETV Bharat / bharat

ఎయిర్​పోర్టులో కూలిన హెలికాప్టర్​.. ల్యాండింగ్​ సమయంలో..

author img

By

Published : Mar 26, 2023, 2:20 PM IST

Updated : Mar 26, 2023, 3:42 PM IST

ఇండియన్​ కోస్ట్​గార్డ్(ఐసీజీ)కు చెందిన హెలికాప్టర్​ కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో కూలింది. ప్రమాదం సమయంలో హెలికాప్టర్​​లో ముగ్గురు వ్యక్తులున్నారు.

helicopter crash indian coast helicopter crashed
helicopter crash indian coast helicopter crashed

ఇండియన్​ కోస్ట్​ గార్డ్(ఐసీజీ)​ హెలికాప్టర్​ కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో కుప్పకూలింది. టేకాఫ్​ అయిన కొద్దిసేపటికే కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. అది ఒక ఏఎల్​హెచ్​ ధ్రువ్​ మాక్​-3 శిక్షణ​ హెలికాప్టర్​ అని తెలిపారు. హెలికాప్టర్​ను పరీక్షిస్తున్న సమయంలోనే ప్రమాదానికి గురైందని చెప్పారు. ఈ ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్​లో ముగ్గురు వ్యక్తులున్నారని.. అందులో ఓ వ్యక్తికి చేయి విరిగినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదం ఆదివారం మధ్యాహ్నం సుమారు ఒంటిగంట సమయంలో జరిగింది. ప్రమాదం తర్వాత రన్​వేను తాత్కాలికంగా మూసివేశారు అధికారులు. అనంతరం రన్​వేను పరీక్షించి మధ్యాహ్నం 2 గంటల సమయంలో విమాన రాకపోకలను పునరుద్ధరించినట్లు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.

అంతకుముందు ఇక్కడకు వచ్చే విమానాలను తిరువనంతపురం, కొయంబత్తూర్​ విమానాశ్రయాలకు మళ్లించినట్లు విమానాశ్రయ అధికారులు వివరించారు. సాధ్యమైనంత త్వరగా రన్​వేను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. సైక్లిక్​ కంట్రోల్స్ పనిచేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని.. పైలెట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. సుమారు 40 అడుగుల ఎత్తు నుంచి హెలికాప్టర్ కూలిందని చెప్పారు. హెలికాప్టర్​ రోటార్స్​, ఎయిర్​ఫ్రేమ్ దెబ్బతిందని పేర్కొన్నారు.

helicopter crash today
ప్రమాద స్థలంలో హెలికాప్టర్​
helicopter crash today
సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది

ఆర్మీ హెలికాప్టర్​ కూలి ఇద్దరు మృతి
ఇటీవలే ఇండియన్​ ఆర్మీకి చెందిన హెలికాప్టర్​ కూడా కుప్పకూలింది. మార్చి 16న అరుణాల్ ప్రదేశ్​లోని మండలా పర్వత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్​లో ఉన్న ఇద్దరు పైలట్లు మృతి చెందారు. మరణించిన పైలట్లను లెఫ్ట్​నెంట్​ కల్నల్​ వీవీబీ రెడ్డి, మేజర్​ ఎ. జయంత్​గా గుర్తించారు. కాగా, ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టనున్నామని చెప్పారు. మండలా పర్వత ప్రాంతంలో తూర్పు బంగ్లాజాప్ గ్రామ సమీపంలో విమాన శకలాలు లభించినట్లు చెప్పారు.

అధికారుల సమాచారం ప్రకారం..
మార్చి 16న ఉదయం 9.15కు భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ బోమ్డిలా ప్రాంతంలో ప్రయాణిస్తున్న సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్​తో సంబంధాలు తెగిపోయాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన హెలికాప్టర్​లో ఓ సీనియర్​ ఆఫీసర్​, పైలట్​ సహా ఇతర సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు. దిరంగ్ నుంచి 100 కి.మీ దూరంలో మండలా వైపుగా పొగను చూసినట్లు స్థానికులు చెప్పారు. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాతంలో బంగ్లాజాప్ గ్రామస్థులు.. హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైనట్లు దిరంగ్ పోలీసులకు సమాచారం అందించారని వారు వివరించారు.

ఇవీ చదవండి : రాహుల్​ కోసం కాంగ్రెస్ సత్యాగ్రహం.. ఎన్ని కుట్రలు చేసినా పోరాటం ఆగదన్న ఖర్గే

మరో పరువు హత్య.. లవర్​తో పరారైనందుకు కూతురు మర్డర్​.. కరెంట్​ షాక్​ అని చెప్పి..

ఇండియన్​ కోస్ట్​ గార్డ్(ఐసీజీ)​ హెలికాప్టర్​ కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో కుప్పకూలింది. టేకాఫ్​ అయిన కొద్దిసేపటికే కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. అది ఒక ఏఎల్​హెచ్​ ధ్రువ్​ మాక్​-3 శిక్షణ​ హెలికాప్టర్​ అని తెలిపారు. హెలికాప్టర్​ను పరీక్షిస్తున్న సమయంలోనే ప్రమాదానికి గురైందని చెప్పారు. ఈ ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్​లో ముగ్గురు వ్యక్తులున్నారని.. అందులో ఓ వ్యక్తికి చేయి విరిగినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదం ఆదివారం మధ్యాహ్నం సుమారు ఒంటిగంట సమయంలో జరిగింది. ప్రమాదం తర్వాత రన్​వేను తాత్కాలికంగా మూసివేశారు అధికారులు. అనంతరం రన్​వేను పరీక్షించి మధ్యాహ్నం 2 గంటల సమయంలో విమాన రాకపోకలను పునరుద్ధరించినట్లు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.

అంతకుముందు ఇక్కడకు వచ్చే విమానాలను తిరువనంతపురం, కొయంబత్తూర్​ విమానాశ్రయాలకు మళ్లించినట్లు విమానాశ్రయ అధికారులు వివరించారు. సాధ్యమైనంత త్వరగా రన్​వేను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. సైక్లిక్​ కంట్రోల్స్ పనిచేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని.. పైలెట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. సుమారు 40 అడుగుల ఎత్తు నుంచి హెలికాప్టర్ కూలిందని చెప్పారు. హెలికాప్టర్​ రోటార్స్​, ఎయిర్​ఫ్రేమ్ దెబ్బతిందని పేర్కొన్నారు.

helicopter crash today
ప్రమాద స్థలంలో హెలికాప్టర్​
helicopter crash today
సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది

ఆర్మీ హెలికాప్టర్​ కూలి ఇద్దరు మృతి
ఇటీవలే ఇండియన్​ ఆర్మీకి చెందిన హెలికాప్టర్​ కూడా కుప్పకూలింది. మార్చి 16న అరుణాల్ ప్రదేశ్​లోని మండలా పర్వత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్​లో ఉన్న ఇద్దరు పైలట్లు మృతి చెందారు. మరణించిన పైలట్లను లెఫ్ట్​నెంట్​ కల్నల్​ వీవీబీ రెడ్డి, మేజర్​ ఎ. జయంత్​గా గుర్తించారు. కాగా, ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టనున్నామని చెప్పారు. మండలా పర్వత ప్రాంతంలో తూర్పు బంగ్లాజాప్ గ్రామ సమీపంలో విమాన శకలాలు లభించినట్లు చెప్పారు.

అధికారుల సమాచారం ప్రకారం..
మార్చి 16న ఉదయం 9.15కు భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ బోమ్డిలా ప్రాంతంలో ప్రయాణిస్తున్న సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్​తో సంబంధాలు తెగిపోయాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన హెలికాప్టర్​లో ఓ సీనియర్​ ఆఫీసర్​, పైలట్​ సహా ఇతర సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు. దిరంగ్ నుంచి 100 కి.మీ దూరంలో మండలా వైపుగా పొగను చూసినట్లు స్థానికులు చెప్పారు. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాతంలో బంగ్లాజాప్ గ్రామస్థులు.. హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైనట్లు దిరంగ్ పోలీసులకు సమాచారం అందించారని వారు వివరించారు.

ఇవీ చదవండి : రాహుల్​ కోసం కాంగ్రెస్ సత్యాగ్రహం.. ఎన్ని కుట్రలు చేసినా పోరాటం ఆగదన్న ఖర్గే

మరో పరువు హత్య.. లవర్​తో పరారైనందుకు కూతురు మర్డర్​.. కరెంట్​ షాక్​ అని చెప్పి..

Last Updated : Mar 26, 2023, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.