ETV Bharat / bharat

సీఎం పర్యటనకు రైతుల సెగ- పోలీసుల లాఠీఛార్జ్

author img

By

Published : May 16, 2021, 3:52 PM IST

హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ ఖట్టర్​.. హిసార్​, పాణిపట్​లలో పర్యటించడంపై అక్కడి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతాల్లో కొవిడ్​ ఆస్పత్రులను ప్రారంభించేందుకు సీఎం హాజరుకాగా.. ఆయన చుట్టూ గుమిగూడి వ్యతిరేక నినాదాలు చేశారు రైతులు. ఖట్టర్​ అక్కడి నుంచి వెళ్లాక.. పోలీసులు, రైతుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది.

Protests, Police Lathicharge
నిరసన, రైతుల ఆందోళన

సీఎం పర్యటనకు రైతుల సెగ- పోలీసుల లాఠీఛార్జ్

హరియాణాలో పోలీసులు, రైతుల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ ఖట్టర్​ పర్యటనను వ్యతిరేకిస్తూ అక్కడి రైతులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిపై రాళ్లు రువ్వారు అన్నదాతలు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్​ చేయడం సహా.. బాష్పవాయువు ప్రయోగించారు.

ఏం జరిగిందంటే?

హిసార్​, పాణిపట్​ ప్రాంతాల్లో 500 పడకలు కలిగిన రెండు కొవిడ్​ ఆస్పత్రులను ప్రారంభించేందుకు ఆ రాష్ట్ర సీఎం మనోహర్​ లాల్​ ఖట్టర్​ అక్కడికి వెళ్లారు. ఓ వైపు.. సీఎం ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉండగా.. మరోవైపు రైతులంతా గుమిగూడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం.. ముఖ్యమంత్రి అక్కడి నుంచి వెళ్లిపోగా రైతులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు, అన్నదాతల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అంతకముందు రోజే.. హిసార్​లో సీఎం పర్యటనను నిరసిస్తూ.. రైతు నాయకుడు ఓ వీడియోను విడుదల చేశారు. హిసార్​లో జరిగే కొవిడ్​ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రిని అనుమతించవద్దని రైతులకు విజ్ఞప్తి చేసే దృశ్యాలు అందులో కనిపించాయి. ఆ సమయంలో మాయాద్​ టోల్​గేట్​ వద్ద అన్నదాతలు ఏకమై సీఎం పర్యటనను అడ్డుకోవాలని ఆయన ఆ వీడియోలో సూచించారు.

ఇదీ చదవండి: 'ప్రతి పల్లెలో 30 పడకల కొవిడ్ కేర్ సెంటర్!'

సీఎం పర్యటనకు రైతుల సెగ- పోలీసుల లాఠీఛార్జ్

హరియాణాలో పోలీసులు, రైతుల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ ఖట్టర్​ పర్యటనను వ్యతిరేకిస్తూ అక్కడి రైతులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిపై రాళ్లు రువ్వారు అన్నదాతలు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్​ చేయడం సహా.. బాష్పవాయువు ప్రయోగించారు.

ఏం జరిగిందంటే?

హిసార్​, పాణిపట్​ ప్రాంతాల్లో 500 పడకలు కలిగిన రెండు కొవిడ్​ ఆస్పత్రులను ప్రారంభించేందుకు ఆ రాష్ట్ర సీఎం మనోహర్​ లాల్​ ఖట్టర్​ అక్కడికి వెళ్లారు. ఓ వైపు.. సీఎం ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉండగా.. మరోవైపు రైతులంతా గుమిగూడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం.. ముఖ్యమంత్రి అక్కడి నుంచి వెళ్లిపోగా రైతులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు, అన్నదాతల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అంతకముందు రోజే.. హిసార్​లో సీఎం పర్యటనను నిరసిస్తూ.. రైతు నాయకుడు ఓ వీడియోను విడుదల చేశారు. హిసార్​లో జరిగే కొవిడ్​ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రిని అనుమతించవద్దని రైతులకు విజ్ఞప్తి చేసే దృశ్యాలు అందులో కనిపించాయి. ఆ సమయంలో మాయాద్​ టోల్​గేట్​ వద్ద అన్నదాతలు ఏకమై సీఎం పర్యటనను అడ్డుకోవాలని ఆయన ఆ వీడియోలో సూచించారు.

ఇదీ చదవండి: 'ప్రతి పల్లెలో 30 పడకల కొవిడ్ కేర్ సెంటర్!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.