ETV Bharat / bharat

కరోనా రోగుల కోసం 'ఆటో అంబులెన్స్​' సేవలు - అహ్మదాబాద్​లో కరోనా

గుజరాత్​ అహ్మదాబాద్​లో కరోనా విలయం కొనసాగుతోంది. ఆసుపత్రులకు వెళ్లాలంటే.. అంబులెన్సులు దొరకని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో పనాహ్​ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ.. అహ్మదాబాద్​ ఆటో డ్రైవర్​ యూనియన్ సహకారంతో ఆటో అంబులెన్సు సేవలను ప్రారంభించింది. దీని ద్వారా తగు జాగ్రత్తలతో కరోనా రోగులను ఆసుపత్రులకు తరలిస్తోంది.

auto ambulance
కరోనా రోగుల కోసం.. అక్కడ ఆటో అంబులెన్సులు
author img

By

Published : Apr 29, 2021, 3:54 PM IST

గుజరాత్​ అహ్మదాబాద్​లో కరోనా బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ 5వైలకు పైగా యాక్టివ్​ కేసులు ఉన్నాయి. దాంతో 108, 104 అంబులెన్సుల కోసం కరోనా రోగులు.. 24 నుంచి 36 గంటల వరకు ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి 'పనాహ్​ ఫౌండేషన్' అనే స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. అహ్మాదాబాద్​ ఆటో డ్రైవర్​ యూనియన్​తో కలిసి ఆటో అంబులెన్సు సర్వీసును ప్రారంభించింది.

auto ambulance
అహ్మాదాబాద్​లో ఆటో అంబులెన్సు సేవలు

హెల్ప్​లైన్​ నంబర్​ కూడా..

కరోనా రోగులకు వేగంగా అంబులెన్సు సర్వీసును అందించేందుకు ఓ హెల్ప్​ లైన్ నంబర్​ను కూడా ప్రవేశ పెట్టిందీ సంస్థ. 7600660760 అనే నంబర్​కు ఫోన్​ చేస్తే.. కరోనా రోగుల కోసం అంబులెన్సు సర్వీసు అందుబాటులో ఉంటుంది. దాంట్లో వారిని సీటీ స్కాన్​, ఎక్స్​రే కోసం ఆసుపత్రులకు తరలిస్తారు. ప్రస్తుతం 10 ఆటోలు ఈ అంబులెన్సు సేవలను అందిస్తున్నాయి.

auto ambulance
పనాహ్​ ఫౌండేషన్​ ఆటో అంబులెన్సు

తగు జాగ్రత్తలతో..

ఆటో డ్రైవర్లకు కరోనా సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. డ్రైవర్​కు, రోగుల మధ్య దూరం ఉండేలా.. ఓ విభజన ఉంటుంది. అంతేకాకుండా.. డ్రైవర్లు పీపీఈ కిట్లను ధరిస్తారని, గ్లౌజులు, మాస్కు, శానిటైజర్లను వాడతారని పనాహ్​ ఫౌండేషన్​కు చెందిన మమతా రావత్​ తెలిపారు. రోగులకు, డ్రైవర్లకు ప్రత్యేక వాటర్​ బాటిళ్లు ఉంటాయని చెప్పారు.

auto ambulance
పీపీఈ కిట్లు ధరించిన ఆటో అంబులెెన్సు డ్రైవర్లు

ఒకవేళ ఆటోడ్రైవర్లు గనుక కరోనా బారిన పడితే వారి వైద్యచికిత్సను పనాహ్​ ఫౌండేషనే భరిస్తుంది. ఆటోలకు గ్యాస్​, పెట్రోల్​ ఖర్చులనూ అందిస్తుంది. అంబులెన్సు సర్వీసులు మాత్రమే కాకుండా... హోం ఐసోలేషన్​లో ఉన్నవారికి ఔషధాలు, ఆహారాన్ని ఈ అంబులెన్సుల ద్వారా పనాహ్​ ఫౌండేషన్​ చేరవేస్తుంది.

ఇదీ చూడండి: ఒకే గదిలో వందకు పైగా కరోనా రోగులు!

ఇదీ చూడండి: ఉచితం అంటే అర్థం ఇదే: రాహుల్

గుజరాత్​ అహ్మదాబాద్​లో కరోనా బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ 5వైలకు పైగా యాక్టివ్​ కేసులు ఉన్నాయి. దాంతో 108, 104 అంబులెన్సుల కోసం కరోనా రోగులు.. 24 నుంచి 36 గంటల వరకు ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి 'పనాహ్​ ఫౌండేషన్' అనే స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. అహ్మాదాబాద్​ ఆటో డ్రైవర్​ యూనియన్​తో కలిసి ఆటో అంబులెన్సు సర్వీసును ప్రారంభించింది.

auto ambulance
అహ్మాదాబాద్​లో ఆటో అంబులెన్సు సేవలు

హెల్ప్​లైన్​ నంబర్​ కూడా..

కరోనా రోగులకు వేగంగా అంబులెన్సు సర్వీసును అందించేందుకు ఓ హెల్ప్​ లైన్ నంబర్​ను కూడా ప్రవేశ పెట్టిందీ సంస్థ. 7600660760 అనే నంబర్​కు ఫోన్​ చేస్తే.. కరోనా రోగుల కోసం అంబులెన్సు సర్వీసు అందుబాటులో ఉంటుంది. దాంట్లో వారిని సీటీ స్కాన్​, ఎక్స్​రే కోసం ఆసుపత్రులకు తరలిస్తారు. ప్రస్తుతం 10 ఆటోలు ఈ అంబులెన్సు సేవలను అందిస్తున్నాయి.

auto ambulance
పనాహ్​ ఫౌండేషన్​ ఆటో అంబులెన్సు

తగు జాగ్రత్తలతో..

ఆటో డ్రైవర్లకు కరోనా సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. డ్రైవర్​కు, రోగుల మధ్య దూరం ఉండేలా.. ఓ విభజన ఉంటుంది. అంతేకాకుండా.. డ్రైవర్లు పీపీఈ కిట్లను ధరిస్తారని, గ్లౌజులు, మాస్కు, శానిటైజర్లను వాడతారని పనాహ్​ ఫౌండేషన్​కు చెందిన మమతా రావత్​ తెలిపారు. రోగులకు, డ్రైవర్లకు ప్రత్యేక వాటర్​ బాటిళ్లు ఉంటాయని చెప్పారు.

auto ambulance
పీపీఈ కిట్లు ధరించిన ఆటో అంబులెెన్సు డ్రైవర్లు

ఒకవేళ ఆటోడ్రైవర్లు గనుక కరోనా బారిన పడితే వారి వైద్యచికిత్సను పనాహ్​ ఫౌండేషనే భరిస్తుంది. ఆటోలకు గ్యాస్​, పెట్రోల్​ ఖర్చులనూ అందిస్తుంది. అంబులెన్సు సర్వీసులు మాత్రమే కాకుండా... హోం ఐసోలేషన్​లో ఉన్నవారికి ఔషధాలు, ఆహారాన్ని ఈ అంబులెన్సుల ద్వారా పనాహ్​ ఫౌండేషన్​ చేరవేస్తుంది.

ఇదీ చూడండి: ఒకే గదిలో వందకు పైగా కరోనా రోగులు!

ఇదీ చూడండి: ఉచితం అంటే అర్థం ఇదే: రాహుల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.