ETV Bharat / bharat

దారుణం.. దళిత యువకుడి శరీర భాగాల్లోకి మద్యం సీసాను చొప్పించి..

author img

By

Published : Apr 16, 2022, 4:31 PM IST

uttar pradesh dalit atrocity: ఉత్తర్​ప్రదేశ్​లో దళితుడిపై దారుణం జరిగింది. కొందరు వ్యక్తులు దళిత యువకుడి రహస్య శరీరభాగాల్లోకి మద్యం బాటిల్​ను చొప్పించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

UP: Dalit man hospitalized after drunk goons thrust liquor bottle into his private parts
UP: Dalit man hospitalized after drunk goons thrust liquor bottle into his private parts

uttar pradesh dalit atrocity: ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. మహోబా జిల్లాలో ఓ దళితుడితో కర్కశంగా ప్రవర్తించారు స్థానికులు. మలవిసర్జనకు వెళ్లిన యువకుడి శరీరభాగాల్లోకి మద్యం బాటిల్​ను చొప్పించారు. అంజర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. గ్రామం శివారులో కొందరు వ్యక్తులు మద్యం తాగుతున్నారు. ఆ సమయంలో అటువైపుగా వెళ్లాడు బాధితుడు. మద్యం తాగుతున్న వ్యక్తులు అతడిని పిలిచి.. అనుచితంగా ప్రవర్తించారు. అదే సమయంలో మద్యం బాటిల్​ను అతని శరీరంలోకి చొప్పించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.

ఘటన అనంతరం ఇంటికి వెళ్లిన యువకుడు.. దీని గురించి ఎవరికీ చెప్పలేదు. అయితే, నొప్పి తీవ్రం కావడం వల్ల.. ఇంట్లో వాళ్లకు జరిగిన విషయం చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్​ను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. జైత్​పుర్​లోని స్థానిక హెల్త్ సెంటర్​లో పరీక్షలు నిర్వహించారు. మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

uttar pradesh dalit atrocity: ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. మహోబా జిల్లాలో ఓ దళితుడితో కర్కశంగా ప్రవర్తించారు స్థానికులు. మలవిసర్జనకు వెళ్లిన యువకుడి శరీరభాగాల్లోకి మద్యం బాటిల్​ను చొప్పించారు. అంజర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. గ్రామం శివారులో కొందరు వ్యక్తులు మద్యం తాగుతున్నారు. ఆ సమయంలో అటువైపుగా వెళ్లాడు బాధితుడు. మద్యం తాగుతున్న వ్యక్తులు అతడిని పిలిచి.. అనుచితంగా ప్రవర్తించారు. అదే సమయంలో మద్యం బాటిల్​ను అతని శరీరంలోకి చొప్పించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.

ఘటన అనంతరం ఇంటికి వెళ్లిన యువకుడు.. దీని గురించి ఎవరికీ చెప్పలేదు. అయితే, నొప్పి తీవ్రం కావడం వల్ల.. ఇంట్లో వాళ్లకు జరిగిన విషయం చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్​ను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. జైత్​పుర్​లోని స్థానిక హెల్త్ సెంటర్​లో పరీక్షలు నిర్వహించారు. మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ముగ్గురు బాలికలు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి హత్య

'దేశంలో మతోన్మాదం, విద్వేషపు సునామీ.. అడ్డుకోకుంటే అంతే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.