ETV Bharat / bharat

Girlfriend Family Cut Boyfriend Private Part : గుండెపోటు వచ్చిందని గర్ల్​ఫ్రెండ్​ ఫోన్.. నమ్మి వెళ్తే యువకుడి ప్రైవేట్​ పార్ట్ కట్!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2023, 1:16 PM IST

Girlfriend FAmily Cut Boyfriend Private Part : తన తండ్రికి గుండె పోటు వచ్చిందని బాయ్​ఫ్రెండ్​ను ఇంటికి పిలిపించుకున్న యువతి.. కుటుంబసభ్యులతో కలిసి ప్రియడి మర్మాంగం కోసింది. అంతటితో ఆగకుండా బాధితుడి బంగారు గొలుసు, ఉంగరం, సెల్​ఫోన్ లాక్కుంది. ఈ ఘటన బిహార్​లోని ముజఫర్​పుర్​లో జరిగింది.

Girlfriend FAmily Cut Boyfriend Private Part
Girlfriend FAmily Cut Boyfriend Private Part

Girlfriend FAmily Cut Boyfriend Private Part : గర్ల్​ ఫ్రెండ్​ నుంచి కాల్​ వచ్చిందని సంబరపడి వెళ్లిన ఓ యువకుడు భంగపడ్డాడు. ప్రేయసి కుటుంబ సభ్యులు యువకుడిపై దాడి చేసి అతడి ప్రైవేటు భాగాలను కోసేశారు. బాధితుడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన బిహార్​లోని ముజఫర్​పుర్​లో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉండే యువకుడు.. నగరంలోని సరౌయాగజ్​కు చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. అయితే అతడు రోజూ సాయంత్రం 4 గంటల సమయంలో జిమ్​కు వెళతాడు. అలా జిమ్​కు బయలుదేరిన ఆ యువకుడికి.. తన ప్రియురాలు ఫోన్​ చేసింది. తన తండ్రికి గుండెపోటు వచ్చిందని.. ఆస్పత్రికి తీసుకెళ్లాలని.. వెంటనే రావాలని యువకుడికి చెప్పింది. దీంతో నిజమే అని నమ్మిన యువకుడు ప్రేయసి ఇంటికి వెళ్లాడు. అప్పటికే అక్కడ కాపుకాసిన యువతి, ఆమె తల్లి, తండ్రి, సోదరుడు అతడిపై దాడి చేశారు. అతడి వద్ద నుంచి గోల్డ్ చైన్, ఉంగరం, సెల్​ఫోన్​ లాక్కున్నారు. అక్కడితో ఆగకుండా బాధితుడి ప్రైవేటు భాగాన్ని కోసేశారు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న బాధితుడు.. ఇంటికెళ్లి తన కుటుంబ సభ్యులకు జరిగింది చెప్పాడు. దీంతో బాధితుడు తండ్రి అతడిని బైరియాలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. అనంతరం పోలీస్​ స్టేషలో ఫిర్యాదు చేశాడు.

అయితే, వారిద్దరి మధ్య చాలా కాలంగా ప్రేమాయణం కొనసాగుతోందని బాధితుడు తండ్రి చెప్పాడు. కానీ ఇది యువతి తల్లిదండ్రులకు ఇష్టం లేదని తెలిపారు. దీని కారణంగా తన కుమారుడిపై పలుమార్లు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించాడు.

నోట్లో గుడ్డకుక్కి.. మైనర్​పై గ్యాంగ్​రేప్​
ఉత్తర్​ప్రదేశ్​.. ఫిరోజాబాద్​ జిల్లోలో మైనర్​పై సామూహక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు కామాంధులు. బాలిక తన నానమ్మ ఇంటికి వెళుతుండగా.. ఆమెను అడ్డగించిన వ్యక్తులు కత్తితో బెదిరించి అపహరించారు. అనంతరం బాలిక నోట్లో వస్త్రం కుక్కి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. గురువారం ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వైద్య పరీక్షల తర్వాత బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

సాక్షిని చంపిన నిందితుడు!
కోర్టులో సాక్ష్యం చెబుతుందని 17 ఏళ్ల బాలికను హత్య చేశాడో నిందితుడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బహ్​రాఇచ్​ జిల్లాలో జరిగింది. ఆరు నెలల క్రితం ఆమె తన చెల్లితో కలిసి బయటకు వెళ్లింది. అప్పుడు తన చెల్లిని కిడ్నాప్​ చేశారు దుండగులు. ఆ ఘటనకు సంబంధించి రమేశ్​ అనే వ్యక్తిపై కేసు నమోదైంది. ఆ కేసులో సాక్ష్యం చెప్పకుండా ఉండేందుకు.. నిందితుడు రమేశ్​, ఇప్పుడు తన మరో కుమార్తెను చంపేశాడని బాలిక తల్లి ఆరోపిస్తోంది. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

అన్న కుటుంబాన్ని అంతం చేసిన తమ్ముడు
పంజాబ్.. మొహాలి జిల్లాలో డ్రగ్స్​కు బానిసైన వ్యక్తి తన అన్న కుటుంబాన్ని అంతం చేశాడు. గ్లోబల్​ సిటీ ఖరద్​లో నివసించే సత్వీర్​ సింగ్​, అమన్​దీప్​ కౌర్​, వారి కుమారుడిని లఖ్​వీర్​ సింగ్​ అనే వ్యక్తి చంపేశాడు. ముందుగా తన అన్న భార్యను కత్తితో పొడిచి హతమార్చాడు. అనంతరం తన అన్నను పారతో బాది హత్య చేశాడు. ఆ తర్వాత రెండేళ్ల చిన్నారిని చంపేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతడికి సహాయం చేసిన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

ప్రియుడి మర్మాంగం కోసిన యువతి.. హోటల్​కు పిలిచి, ఏకాంతంగా ఉండగా..

భర్త మర్మాంగం కోసేసిన భార్య.. బలవంతంగా సెక్స్ చేసేందుకు యత్నించాడట..!

Girlfriend FAmily Cut Boyfriend Private Part : గర్ల్​ ఫ్రెండ్​ నుంచి కాల్​ వచ్చిందని సంబరపడి వెళ్లిన ఓ యువకుడు భంగపడ్డాడు. ప్రేయసి కుటుంబ సభ్యులు యువకుడిపై దాడి చేసి అతడి ప్రైవేటు భాగాలను కోసేశారు. బాధితుడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన బిహార్​లోని ముజఫర్​పుర్​లో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉండే యువకుడు.. నగరంలోని సరౌయాగజ్​కు చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. అయితే అతడు రోజూ సాయంత్రం 4 గంటల సమయంలో జిమ్​కు వెళతాడు. అలా జిమ్​కు బయలుదేరిన ఆ యువకుడికి.. తన ప్రియురాలు ఫోన్​ చేసింది. తన తండ్రికి గుండెపోటు వచ్చిందని.. ఆస్పత్రికి తీసుకెళ్లాలని.. వెంటనే రావాలని యువకుడికి చెప్పింది. దీంతో నిజమే అని నమ్మిన యువకుడు ప్రేయసి ఇంటికి వెళ్లాడు. అప్పటికే అక్కడ కాపుకాసిన యువతి, ఆమె తల్లి, తండ్రి, సోదరుడు అతడిపై దాడి చేశారు. అతడి వద్ద నుంచి గోల్డ్ చైన్, ఉంగరం, సెల్​ఫోన్​ లాక్కున్నారు. అక్కడితో ఆగకుండా బాధితుడి ప్రైవేటు భాగాన్ని కోసేశారు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న బాధితుడు.. ఇంటికెళ్లి తన కుటుంబ సభ్యులకు జరిగింది చెప్పాడు. దీంతో బాధితుడు తండ్రి అతడిని బైరియాలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. అనంతరం పోలీస్​ స్టేషలో ఫిర్యాదు చేశాడు.

అయితే, వారిద్దరి మధ్య చాలా కాలంగా ప్రేమాయణం కొనసాగుతోందని బాధితుడు తండ్రి చెప్పాడు. కానీ ఇది యువతి తల్లిదండ్రులకు ఇష్టం లేదని తెలిపారు. దీని కారణంగా తన కుమారుడిపై పలుమార్లు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించాడు.

నోట్లో గుడ్డకుక్కి.. మైనర్​పై గ్యాంగ్​రేప్​
ఉత్తర్​ప్రదేశ్​.. ఫిరోజాబాద్​ జిల్లోలో మైనర్​పై సామూహక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు కామాంధులు. బాలిక తన నానమ్మ ఇంటికి వెళుతుండగా.. ఆమెను అడ్డగించిన వ్యక్తులు కత్తితో బెదిరించి అపహరించారు. అనంతరం బాలిక నోట్లో వస్త్రం కుక్కి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. గురువారం ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వైద్య పరీక్షల తర్వాత బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

సాక్షిని చంపిన నిందితుడు!
కోర్టులో సాక్ష్యం చెబుతుందని 17 ఏళ్ల బాలికను హత్య చేశాడో నిందితుడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బహ్​రాఇచ్​ జిల్లాలో జరిగింది. ఆరు నెలల క్రితం ఆమె తన చెల్లితో కలిసి బయటకు వెళ్లింది. అప్పుడు తన చెల్లిని కిడ్నాప్​ చేశారు దుండగులు. ఆ ఘటనకు సంబంధించి రమేశ్​ అనే వ్యక్తిపై కేసు నమోదైంది. ఆ కేసులో సాక్ష్యం చెప్పకుండా ఉండేందుకు.. నిందితుడు రమేశ్​, ఇప్పుడు తన మరో కుమార్తెను చంపేశాడని బాలిక తల్లి ఆరోపిస్తోంది. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

అన్న కుటుంబాన్ని అంతం చేసిన తమ్ముడు
పంజాబ్.. మొహాలి జిల్లాలో డ్రగ్స్​కు బానిసైన వ్యక్తి తన అన్న కుటుంబాన్ని అంతం చేశాడు. గ్లోబల్​ సిటీ ఖరద్​లో నివసించే సత్వీర్​ సింగ్​, అమన్​దీప్​ కౌర్​, వారి కుమారుడిని లఖ్​వీర్​ సింగ్​ అనే వ్యక్తి చంపేశాడు. ముందుగా తన అన్న భార్యను కత్తితో పొడిచి హతమార్చాడు. అనంతరం తన అన్నను పారతో బాది హత్య చేశాడు. ఆ తర్వాత రెండేళ్ల చిన్నారిని చంపేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతడికి సహాయం చేసిన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

ప్రియుడి మర్మాంగం కోసిన యువతి.. హోటల్​కు పిలిచి, ఏకాంతంగా ఉండగా..

భర్త మర్మాంగం కోసేసిన భార్య.. బలవంతంగా సెక్స్ చేసేందుకు యత్నించాడట..!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.