ETV Bharat / bharat

స్నేహితురాలితో ట్రాన్స్​జెండర్​ లవ్​! కాదనేసరికి కాళ్లు, చేతులు కట్టేసి సజీవ దహనం

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 25, 2023, 2:17 PM IST

Updated : Dec 25, 2023, 2:26 PM IST

Girl Burnt Alive In Chennai : ప్రేమను కాదందని యువతిని హతమార్చాడు ఓ ట్రాన్స్​జెండర్​. యువతి కళ్లకు గంతలు కట్టి, కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణం తమిళనాడులో జరిగింది.

girl burnt alive in chennai
girl burnt alive in chennai

Girl Burnt Alive In Chennai : తమిళనాడులోని చెన్నైలో ఓ మహిళా ఐటీ ఉద్యోగిని గొలుసులతో బంధించి సజీవ దహనం చేశాడు ఓ ట్రాన్స్​జెండర్​. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు మృతురాలి చిన్ననాటి స్నేహితుడేనని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
చిన్నప్పుడు మృతురాలు నందిని, మహేశ్వరి (వెట్రిమారన్​) ఒకే స్కూల్​లో చదువుకున్నారు. మహేశ్వరి వయసు పెరుగుతున్నకొద్దీ ఆమెలో మగలక్షణాలు బయటపడ్డాయి. ఆమెలో వచ్చిన మార్పుల్ని గ్రహించి మగాడిలా మారింది. మహేశ్వరిగా ఉన్న తన పేరును వెట్రిమారన్​గా మార్చుకుంది. అప్పుడు వెట్రిమారన్​ను కుటుంబ సభ్యులు ఇంటి నుంచి గెంటేశారు. స్నేహితురాలు నందిని అన్నీతానై అతడిని చూసుకుంది. సొంత కుటుంబ సభ్యురాలిలా భావించి వెట్రిమారన్​కు అండగా నిలిచింది. నందిని చనువును ప్రేమ అనుకున్నాడు వెట్రిమారన్. అప్పటి నుంచి నందినిపై ప్రేమ పెంచుకున్నాడు. ఆమె కూడా తనను ప్రేమిస్తుందని అనుకున్నాడు.

అప్పటి నుంచి వేరే వ్యక్తితో నందిని మాట్లాడినా, చనువుగా ఉన్నా వెట్రిమారన్​ సహించలేకపోయేవాడు. వేరే వాళ్లతో చనువుగా ఉండొద్దని నందినిని బలవంతం చేసేవాడు. దీంతో విసిగిపోయిన ఆమె వెట్రిమారన్​ను కొన్నాళ్ల క్రితం దూరం పెట్టింది. ఈ క్రమంలో నందినిపై పగ పెంచుకున్నాడు వెట్రిమారన్​. డిసెంబరు 23న నందిని పుట్టినరోజు కావడం వల్ల ఆమెతో స్నేహపూర్వకంగా మెలిగాడు వెట్రిమారన్​. బర్త్​డేకు సర్​ప్రైజ్ ఇస్తానని చెప్పి రోజంతా చెన్నైలోని దేవాలయాలు, అనాథ శరణాలయాలకు తిప్పాడు. సాయంత్రం కాగానే నందినిని కేలంబాక్కంలోని నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు బలవంతంగా కళ్లకు గంతలు కట్టేశాడు. అక్కడితో ఆగకుండా కాళ్లు, చేతులను కట్టేసి కత్తితో నరికాడు. అనంతరం పెట్రోల్ పోసి నందినికి నిప్పంటించాడు. అప్పుడు ఆమె అరవడం వల్ల స్థానికులు వచ్చారు. మంటల్లో కాలిపోతున్న నందినిని రక్షించి ఆస్పత్రికి తరలించారు.

అయితే ఆస్పత్రికి చేరుకునేలోపే నందిని మరణించింది. మొబైల్ ఫోన్ ద్వారా బాధితురాలిని మదురైకు చెందిన నందిని(27)గా పోలీసులు గుర్తించారు. ఆమె వెంటే ఆస్పత్రికి వచ్చిన వెట్రిమారన్(27) అనే యువకుడి తీరు పట్ల పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అతడిని పట్టుకుని తమదైన శైలిలో పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. నందినిని తానే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. నందినికి నిప్పంటించిన తర్వాత స్థానికులు అక్కడికి రావడం వల్ల ఆమెను రక్షిస్తున్నట్లు నటించానని పోలీసుల ఎదుట చెప్పాడు.

నందిని హత్యకు ముందుగానే వెట్రిమారన్ ప్లాన్ చేసుకున్నాడని తాళంబూర్ పోలీసులు తెలిపారు. నిందితుడు తన బ్యాగ్‌లో గొలుసు, కత్తి, పెట్రోల్ తెచ్చుకున్నాడని చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియురాలి హత్య.. ఫ్రిజ్​లో మృతదేహం.. శ్రద్ధా వాకర్​ కేసులానే..

మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు- నమాజ్ చేస్తున్న రిటైర్డ్ పోలీస్​ అధికారి హత్య

Girl Burnt Alive In Chennai : తమిళనాడులోని చెన్నైలో ఓ మహిళా ఐటీ ఉద్యోగిని గొలుసులతో బంధించి సజీవ దహనం చేశాడు ఓ ట్రాన్స్​జెండర్​. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు మృతురాలి చిన్ననాటి స్నేహితుడేనని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
చిన్నప్పుడు మృతురాలు నందిని, మహేశ్వరి (వెట్రిమారన్​) ఒకే స్కూల్​లో చదువుకున్నారు. మహేశ్వరి వయసు పెరుగుతున్నకొద్దీ ఆమెలో మగలక్షణాలు బయటపడ్డాయి. ఆమెలో వచ్చిన మార్పుల్ని గ్రహించి మగాడిలా మారింది. మహేశ్వరిగా ఉన్న తన పేరును వెట్రిమారన్​గా మార్చుకుంది. అప్పుడు వెట్రిమారన్​ను కుటుంబ సభ్యులు ఇంటి నుంచి గెంటేశారు. స్నేహితురాలు నందిని అన్నీతానై అతడిని చూసుకుంది. సొంత కుటుంబ సభ్యురాలిలా భావించి వెట్రిమారన్​కు అండగా నిలిచింది. నందిని చనువును ప్రేమ అనుకున్నాడు వెట్రిమారన్. అప్పటి నుంచి నందినిపై ప్రేమ పెంచుకున్నాడు. ఆమె కూడా తనను ప్రేమిస్తుందని అనుకున్నాడు.

అప్పటి నుంచి వేరే వ్యక్తితో నందిని మాట్లాడినా, చనువుగా ఉన్నా వెట్రిమారన్​ సహించలేకపోయేవాడు. వేరే వాళ్లతో చనువుగా ఉండొద్దని నందినిని బలవంతం చేసేవాడు. దీంతో విసిగిపోయిన ఆమె వెట్రిమారన్​ను కొన్నాళ్ల క్రితం దూరం పెట్టింది. ఈ క్రమంలో నందినిపై పగ పెంచుకున్నాడు వెట్రిమారన్​. డిసెంబరు 23న నందిని పుట్టినరోజు కావడం వల్ల ఆమెతో స్నేహపూర్వకంగా మెలిగాడు వెట్రిమారన్​. బర్త్​డేకు సర్​ప్రైజ్ ఇస్తానని చెప్పి రోజంతా చెన్నైలోని దేవాలయాలు, అనాథ శరణాలయాలకు తిప్పాడు. సాయంత్రం కాగానే నందినిని కేలంబాక్కంలోని నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు బలవంతంగా కళ్లకు గంతలు కట్టేశాడు. అక్కడితో ఆగకుండా కాళ్లు, చేతులను కట్టేసి కత్తితో నరికాడు. అనంతరం పెట్రోల్ పోసి నందినికి నిప్పంటించాడు. అప్పుడు ఆమె అరవడం వల్ల స్థానికులు వచ్చారు. మంటల్లో కాలిపోతున్న నందినిని రక్షించి ఆస్పత్రికి తరలించారు.

అయితే ఆస్పత్రికి చేరుకునేలోపే నందిని మరణించింది. మొబైల్ ఫోన్ ద్వారా బాధితురాలిని మదురైకు చెందిన నందిని(27)గా పోలీసులు గుర్తించారు. ఆమె వెంటే ఆస్పత్రికి వచ్చిన వెట్రిమారన్(27) అనే యువకుడి తీరు పట్ల పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అతడిని పట్టుకుని తమదైన శైలిలో పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. నందినిని తానే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. నందినికి నిప్పంటించిన తర్వాత స్థానికులు అక్కడికి రావడం వల్ల ఆమెను రక్షిస్తున్నట్లు నటించానని పోలీసుల ఎదుట చెప్పాడు.

నందిని హత్యకు ముందుగానే వెట్రిమారన్ ప్లాన్ చేసుకున్నాడని తాళంబూర్ పోలీసులు తెలిపారు. నిందితుడు తన బ్యాగ్‌లో గొలుసు, కత్తి, పెట్రోల్ తెచ్చుకున్నాడని చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియురాలి హత్య.. ఫ్రిజ్​లో మృతదేహం.. శ్రద్ధా వాకర్​ కేసులానే..

మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు- నమాజ్ చేస్తున్న రిటైర్డ్ పోలీస్​ అధికారి హత్య

Last Updated : Dec 25, 2023, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.