ETV Bharat / bharat

మోదీ కోసం చెక్కతో 'హనుమాన్ చాలీసా'! - చెక్కతో హనుమాన్ చాలీసా పుస్తకం

ఒడిశా గంజాం జిల్లాకు చెందిన ఓ శిల్పి అద్భుత కళాఖండాన్ని రూపొందించాడు. చెక్కతో 'హనుమాన్​ చాలీసా' పుస్తకాన్ని తయారు చేసి అందరినీ అబ్బురపరిచాడు. ప్రధాని మోదీకి, ఒడిశా ముఖ్యమంత్రికి ఈ కళారూపాన్ని బహుమతిగా ఇవ్వాలని ఆశిస్తున్నాడు.

ganjam, odisha artist
అరుణ్ సాహు, ఒడిశా శిల్పి
author img

By

Published : Jun 11, 2021, 3:15 PM IST

చెక్కతో హనుమాన్​ చాలీసా పుస్తకం

పుస్తకాల్లో రామకోటి, సాయికోటి పేరుతో దేవుడి నామాలు రాస్తు ఆపార భక్తిని చాటుకుంటారు కొందరు. ఇదే విధంగా ఓ శిల్పి తన భక్తిని భిన్నంగా చాటుకున్నాడు. తన ప్రతిభకు పదునుపెట్టి.. హనుమాన్​ చాలీసాను పుస్తకంగా చెక్కాడు. చెక్కపై ప్రతి అక్షరానికి ఆయువు పోశాడు. ఆయనే ఒడిశా గంజాం జిల్లాకు చెందిన శిల్పి అరుణ్ సాహు.

hanuman chalisa
పుస్తకంగా చెక్కుతున్న అరుణ్ సాహు

నెల రోజుల్లోనే..

హింజులికట్ కంటేయ్​కొలి గ్రామానికి చెందిన సాహు..నెల రోజుల్లోనే చెక్కతో హనుమాన్​ చాలీసాకు పుస్తకరూపమిచ్చాడు. ఒరియా, హిందీ.. రెండు బాషల్లో ఈ పుస్తకాన్ని చెక్కడం విశేషం.

"చెక్క, ఉలి, బ్లేడు సాయంతో.. ఐదు పేజీలుగా హనుమాన్​ చాలీసా తయారు చేశాను. రెండు కవర్​ పేజీలు అమర్చి.. వాటిపై హనుమంతుడి బొమ్మను చెక్కాను. ఈ చెక్క పుస్తకం పొడవు 10.5 అంగుళాలు. వెడల్పు 9 అంగుళాలు. ప్రతి పేజీ 2.5 అంగుళాల మందం ఉంటుంది. లాక్​డౌన్​ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఈ పుస్తకాన్ని తయారు చేశాను."

- అరుణ్ సాహు, శిల్ప కళాకారుడు.

అరుణ్ తయారు చేసిన ఈ పుస్తకంపై కుటుంబ సభ్యులు, ఆయన మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ అరుణ్​ అద్భుత కళాఖండాలకు రూపమిచ్చాడని చెబుతున్నారు. తాజ్​మహల్, ఈఫిల్ టవర్, ఒడిశా అసెంబ్లీతో పాటు ఇతర కళాకృతులను చెక్కతో తయారు చేశాడని ప్రశంసించారు.

hanuman chalisa
చెక్కతో హనుమాన్ చాలీసా పుస్తకం

మోదీకి ఇవ్వాలని...

హిందీలో చేసిన హనుమాన్​ చాలీసా ప్రధాని మోదీకి, ఒరియాలో చేసింది ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్​కు బహుమతిగా ఇవ్వాలని ఆశాభావం వ్యక్తం చేశాడు అరుణ్. అన్ని బాషల్లో ఈ విధమైన హనుమాన్ చాలీసా తయారు చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపాడు. గిన్నిస్​ బుక్​ ఆఫ్​ రికార్డులో దీనికి స్థానం ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పాడు.

ఇదీ చదవండి:Viral: పిడుగు పడటం లైవ్​లో చూశారా?

చెక్కతో హనుమాన్​ చాలీసా పుస్తకం

పుస్తకాల్లో రామకోటి, సాయికోటి పేరుతో దేవుడి నామాలు రాస్తు ఆపార భక్తిని చాటుకుంటారు కొందరు. ఇదే విధంగా ఓ శిల్పి తన భక్తిని భిన్నంగా చాటుకున్నాడు. తన ప్రతిభకు పదునుపెట్టి.. హనుమాన్​ చాలీసాను పుస్తకంగా చెక్కాడు. చెక్కపై ప్రతి అక్షరానికి ఆయువు పోశాడు. ఆయనే ఒడిశా గంజాం జిల్లాకు చెందిన శిల్పి అరుణ్ సాహు.

hanuman chalisa
పుస్తకంగా చెక్కుతున్న అరుణ్ సాహు

నెల రోజుల్లోనే..

హింజులికట్ కంటేయ్​కొలి గ్రామానికి చెందిన సాహు..నెల రోజుల్లోనే చెక్కతో హనుమాన్​ చాలీసాకు పుస్తకరూపమిచ్చాడు. ఒరియా, హిందీ.. రెండు బాషల్లో ఈ పుస్తకాన్ని చెక్కడం విశేషం.

"చెక్క, ఉలి, బ్లేడు సాయంతో.. ఐదు పేజీలుగా హనుమాన్​ చాలీసా తయారు చేశాను. రెండు కవర్​ పేజీలు అమర్చి.. వాటిపై హనుమంతుడి బొమ్మను చెక్కాను. ఈ చెక్క పుస్తకం పొడవు 10.5 అంగుళాలు. వెడల్పు 9 అంగుళాలు. ప్రతి పేజీ 2.5 అంగుళాల మందం ఉంటుంది. లాక్​డౌన్​ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఈ పుస్తకాన్ని తయారు చేశాను."

- అరుణ్ సాహు, శిల్ప కళాకారుడు.

అరుణ్ తయారు చేసిన ఈ పుస్తకంపై కుటుంబ సభ్యులు, ఆయన మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ అరుణ్​ అద్భుత కళాఖండాలకు రూపమిచ్చాడని చెబుతున్నారు. తాజ్​మహల్, ఈఫిల్ టవర్, ఒడిశా అసెంబ్లీతో పాటు ఇతర కళాకృతులను చెక్కతో తయారు చేశాడని ప్రశంసించారు.

hanuman chalisa
చెక్కతో హనుమాన్ చాలీసా పుస్తకం

మోదీకి ఇవ్వాలని...

హిందీలో చేసిన హనుమాన్​ చాలీసా ప్రధాని మోదీకి, ఒరియాలో చేసింది ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్​కు బహుమతిగా ఇవ్వాలని ఆశాభావం వ్యక్తం చేశాడు అరుణ్. అన్ని బాషల్లో ఈ విధమైన హనుమాన్ చాలీసా తయారు చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపాడు. గిన్నిస్​ బుక్​ ఆఫ్​ రికార్డులో దీనికి స్థానం ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పాడు.

ఇదీ చదవండి:Viral: పిడుగు పడటం లైవ్​లో చూశారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.