ETV Bharat / bharat

'సమాఖ్య విధానమే దేశాభివృద్ధికి మూలం'

author img

By

Published : Feb 20, 2021, 11:14 AM IST

Updated : Feb 20, 2021, 12:03 PM IST

కరోనా సమయంలో కేంద్ర, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేశాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ విధంగా సహకార సమాఖ్య విధానాన్ని మరింత అర్థవంతంగా మార్చడమే దేశ అభివృద్ధికి పునాది అని చెప్పారు. నీతి ఆయోగ్ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.

modi
మోదీ

కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేసి, సహకార సమాఖ్య విధానాన్ని మరింత అర్థవంతంగా మార్చడమే భారతావని అభివృద్ధికి పునాది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. పోటీతత్వ, సహకార సమాఖ్య విధానాన్ని రాష్ట్రాలకే పరిమితం చేయకుండా జిల్లాలకూ విస్తరించాలని పిలుపునిచ్చారు.

నీతి ఆయోగ్ పాలక మండలి ఆరో సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన ఆయన... కొవిడ్ సమయంలో కేంద్ర, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. కరోనా విషయంలో దేశం విజయం సాధించిందని, ప్రపంచం ముందు భారత ప్రతిష్ఠ విరాజిల్లిందని పేర్కొన్నారు.

దేశం స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో నీతి ఆయోగ్ తాజా సమావేశానికి మరింత ప్రాధాన్యం ఏర్పడిందని అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేలా కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

'దేశ మానసిక స్థితి మారింది'

ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్​పై అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు మోదీ. సమయాన్ని వృథా చేయకుండా వేగంగా అభివృద్ధి సాధించాలని దేశం నిశ్చయించుకుందని చెప్పారు. దేశ మానసిక స్థితి ఈ విధంగా మారడంలో యువత కీలక పాత్ర పోషించాలని తెలిపారు. గత కొన్నేళ్లలో బ్యాంకు ఖాతాలు తెరవడం పెరిగిందని వివరించారు మోదీ. ఉచిత విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు పేదల జీవితాల్లో గణనీయ మార్పులు తీసుకొచ్చాయన్నారు. పేదలు సాధికారత సాధించేందుకు ఈ చర్యలు ఉపయోగపడ్డాయని తెలిపారు.

ప్రైవేటుకు ప్రాధాన్యం!

వ్యాపారాలు సజావుగా సాగేలా పురాతన చట్టాలను తొలగించాల్సిన అవసరం ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యంలో భాగమయ్యేందుకు ప్రైవేటు రంగానికి అన్ని అవకాశాలు అందించాలని చెప్పారు. ఆర్థిక పురోగతిలో ప్రైవేటు రంగానికి సరైన ప్రాతినిథ్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

వ్యవసాయ రంగంపై మాట్లాడిన మోదీ.. వంట నూనె తయారీపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. వాటి దిగుమతులను తగ్గించాలని అన్నారు. రైతులకు మార్గనిర్దేశనం చేస్తే ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని చెప్పారు. ఫలితంగా దిగుమతులపై వెచ్చించే సొమ్ము రైతుల ఖాతాల్లోకి వెళ్తుందన్నారు.

ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ నీతిఆయోగ్‌ సమావేశంలో కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమర్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఆర్థిక పునరుజ్జీవమే అజెండాగా నీతి ఆయోగ్​ సమావేశం

కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేసి, సహకార సమాఖ్య విధానాన్ని మరింత అర్థవంతంగా మార్చడమే భారతావని అభివృద్ధికి పునాది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. పోటీతత్వ, సహకార సమాఖ్య విధానాన్ని రాష్ట్రాలకే పరిమితం చేయకుండా జిల్లాలకూ విస్తరించాలని పిలుపునిచ్చారు.

నీతి ఆయోగ్ పాలక మండలి ఆరో సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన ఆయన... కొవిడ్ సమయంలో కేంద్ర, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. కరోనా విషయంలో దేశం విజయం సాధించిందని, ప్రపంచం ముందు భారత ప్రతిష్ఠ విరాజిల్లిందని పేర్కొన్నారు.

దేశం స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో నీతి ఆయోగ్ తాజా సమావేశానికి మరింత ప్రాధాన్యం ఏర్పడిందని అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేలా కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

'దేశ మానసిక స్థితి మారింది'

ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్​పై అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు మోదీ. సమయాన్ని వృథా చేయకుండా వేగంగా అభివృద్ధి సాధించాలని దేశం నిశ్చయించుకుందని చెప్పారు. దేశ మానసిక స్థితి ఈ విధంగా మారడంలో యువత కీలక పాత్ర పోషించాలని తెలిపారు. గత కొన్నేళ్లలో బ్యాంకు ఖాతాలు తెరవడం పెరిగిందని వివరించారు మోదీ. ఉచిత విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు పేదల జీవితాల్లో గణనీయ మార్పులు తీసుకొచ్చాయన్నారు. పేదలు సాధికారత సాధించేందుకు ఈ చర్యలు ఉపయోగపడ్డాయని తెలిపారు.

ప్రైవేటుకు ప్రాధాన్యం!

వ్యాపారాలు సజావుగా సాగేలా పురాతన చట్టాలను తొలగించాల్సిన అవసరం ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యంలో భాగమయ్యేందుకు ప్రైవేటు రంగానికి అన్ని అవకాశాలు అందించాలని చెప్పారు. ఆర్థిక పురోగతిలో ప్రైవేటు రంగానికి సరైన ప్రాతినిథ్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

వ్యవసాయ రంగంపై మాట్లాడిన మోదీ.. వంట నూనె తయారీపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. వాటి దిగుమతులను తగ్గించాలని అన్నారు. రైతులకు మార్గనిర్దేశనం చేస్తే ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని చెప్పారు. ఫలితంగా దిగుమతులపై వెచ్చించే సొమ్ము రైతుల ఖాతాల్లోకి వెళ్తుందన్నారు.

ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ నీతిఆయోగ్‌ సమావేశంలో కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమర్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఆర్థిక పునరుజ్జీవమే అజెండాగా నీతి ఆయోగ్​ సమావేశం

Last Updated : Feb 20, 2021, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.