ETV Bharat / bharat

రాజస్థాన్ మాజీ సీఎం పహాడియా మృతి - మోదీ సంతాపం - పహాడియా మృతిపై మోదీ సంతాపం

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతిపట్ల ప్రధాని నరేంద్రమోదీ సహా.. ఆ రాష్ట్ర సీఎం అశోక్ గహ్లోత్ సంతాపం తెలిపారు.

jagannath pahadia
జగన్నాథ్ పహాడియా
author img

By

Published : May 20, 2021, 5:23 AM IST

Updated : May 20, 2021, 9:19 AM IST

కాంగ్రెస్ సీనియర్​ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా కరోనాతో మృతి చెందారు. ఇటీవల వైరస్​ బారినపడిన ఆయన.. బుధవారం చికిత్స పొందుతూ మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

జగన్నాథ్ 1980-81లో రాజస్థాన్​ ముఖ్యమంత్రిగా పనిచేశారు. హరియాణా, బిహార్ రాష్ట్రాలకు గవర్నర్​గానూ విధులు నిర్వహించారు.

ప్రధాని మోదీ సంతాపం..

పహాడియా మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. పహాడియా.. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో సామాజిక సాధికారతకు ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు ట్విట్టర్​ వేదికగా సంతాపం తెలిపారు.

PM modi tweet
ప్రధాని మోదీ ట్వీట్​

గహ్లోత్​ కూడా..

మాజీ సీఎం మృతిపట్ల రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సంతాపం తెలిపారు. మొదటి నుంచీ పహాడియా తనకు శ్రేయోభిలాషిలా ఉండేవారని గుర్తుచేసుకున్నారు. గురువారం రాష్ట్ర అధికారిక లాంఛనాలతో పహాడియా అంత్యక్రియలు జరగనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:తౌక్టే విలయం: ఆ నౌకలో 26 మంది మృతి

కాంగ్రెస్ సీనియర్​ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా కరోనాతో మృతి చెందారు. ఇటీవల వైరస్​ బారినపడిన ఆయన.. బుధవారం చికిత్స పొందుతూ మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

జగన్నాథ్ 1980-81లో రాజస్థాన్​ ముఖ్యమంత్రిగా పనిచేశారు. హరియాణా, బిహార్ రాష్ట్రాలకు గవర్నర్​గానూ విధులు నిర్వహించారు.

ప్రధాని మోదీ సంతాపం..

పహాడియా మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. పహాడియా.. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో సామాజిక సాధికారతకు ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు ట్విట్టర్​ వేదికగా సంతాపం తెలిపారు.

PM modi tweet
ప్రధాని మోదీ ట్వీట్​

గహ్లోత్​ కూడా..

మాజీ సీఎం మృతిపట్ల రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సంతాపం తెలిపారు. మొదటి నుంచీ పహాడియా తనకు శ్రేయోభిలాషిలా ఉండేవారని గుర్తుచేసుకున్నారు. గురువారం రాష్ట్ర అధికారిక లాంఛనాలతో పహాడియా అంత్యక్రియలు జరగనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:తౌక్టే విలయం: ఆ నౌకలో 26 మంది మృతి

Last Updated : May 20, 2021, 9:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.