పంజాబ్ బఠిండాలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటో ఉన్న ఓ బ్యానర్ కలకలం రేపింది. సమాచారం అందుకున్న దయాల్పురా పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బ్యానర్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ బ్యానర్కు బెలూన్లు కట్టి గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఇటీవలే పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ఇస్లామాబాద్లో ర్యాలీ నిర్వహించారు. ఈ బ్యానర్ ఆ ర్యాలీలోనిదని పోలీసులు భావిస్తున్నారు.

"పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ర్యాలీ సమయంలో ఆయన అభిమానులు ఈ బ్యానర్కు బెలూన్లు కట్టి గాలిలో ఎగరేసి ఉండవచ్చు. గాలి వల్ల పాక్ నుంచి ఈ బెలూన్ భారత్ వైపు దూసుకొచ్చి పంట పొలంలో పడిపోయి ఉండవచ్చని భావిస్తున్నాం. బ్యానర్పై భారత్కు వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు లేవు. బ్యానర్ను స్వాధీనం చేసుకున్నాం. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం."
-పోలీసులు

ఇవీ చదవండి: ఉచితంగా వైద్యం... రూ.50కే ఆపరేషన్.. సంస్థ బంపర్ ఆఫర్!
కుమార్తెను ప్రేమించాడని సుపారీ ఇచ్చి హత్య.. 33 రోజుల తర్వాత..