దిల్లీలోని బవానా జేజే కాలనీలోని మురికివాడలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 200 ఇళ్లు కాలి బూడిదయ్యాయి.
![fire accident in bawana jj colony slum, బవానా జేజే కాలనీలో అగ్ని ప్రమాదం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11213068_fire-delhi-123.png)
అకస్మాత్తుగా మంటలు చెలరేగగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రోడ్ల మీదకు పరుగులు తీశారు. ఇళ్లు మంటలకు కాలిపోవడం వల్ల పలువురు నిరాశ్రయులయ్యారు. సమయానికి ఘటనాస్థలికి చేరిసన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడం వల్ల ఈ నష్టం 200 ఇళ్లకు పరిమితమైందని అధికారులు వెల్లడించారు. లేదంటే మంటలు ఈ మురికివాడలో వేల సంఖ్యలో ఉన్న ఇళ్లు అన్నింటికీ వ్యాపించేవని అభిప్రాయపడ్డారు.
నిరాశ్రయులను తాత్కాలిక శిబిరాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
బస్సు టెర్నినల్లో అగ్ని ప్రమాదం..
నగరంలోని అంతర్రాష్ట్ర బస్సు టెర్నినల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. భవనంలోని 6వ అంతస్తు నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
![fire accident in bawana jj colony slum, బవానా జేజే కాలనీలో అగ్ని ప్రమాదం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11213068_delhifire-2.jpg)
![fire accident in bawana jj colony slum, బవానా జేజే కాలనీలో అగ్ని ప్రమాదం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11213068_delhifire-1.jpg)
ఇదీ చదవండి : బిహార్లో ఘోరం- ఆరుగురు చిన్నారులు సజీవదహనం