ETV Bharat / bharat

'సీరం' ప్రమాద మృతులకు రూ.25 లక్షల పరిహారం

author img

By

Published : Jan 21, 2021, 3:09 PM IST

Updated : Jan 21, 2021, 8:15 PM IST

fire in serum institute
పుణె సీరం ఇన్​స్టిట్యూట్​లో అగ్ని ప్రమాదం

20:14 January 21

'సీరం' ప్రమాద మృతులకు రూ.25 లక్షల పరిహారం!

పుణెలోని తమ సంస్థలో అగ్ని ప్రమాదం జరగటంపై విచారం వ్యక్తం చేసింది సీరం ఇన్​స్టిట్యూట్​. 'ఈరోజు మనకు చాలు దురదృష్టకరమైన రోజు. ఘటనతో చాలా బాధ కలిగింది. మృతుల కుటుంబాలకు మా సంతాపం. నిబంధనల ప్రకారం అందాల్సిన నగదుతో పాటు అదనంగా మరో రూ.25 లక్షల పరిహారం ప్రకటిస్తున్నాం.' అని పేర్కొన్నారు సీరం ఇన్​స్టిట్యూట్​ ఛైర్మన్​ సైరస్​ పూనవాలా.

20:07 January 21

సీరం ప్రమాదంపై రాష్ట్రపతి కోవింద్​ దిగ్భ్రాంతి

  • The loss of lives in a fire accident at the Serum Institute of India in Pune is distressing. My thoughts and prayers are with the bereaved families. I wish speedy recovery of the injured: President Ram Nath Kovind (file pic) pic.twitter.com/L8Caiix2z2

    — ANI (@ANI) January 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మహారాష్ట్ర పుణెలోని సీరం ఇన్​స్టిట్యూట్​లో అగ్ని ప్రమాదం జరిగి ఐదుగురు ప్రాణాలు కోల్పోవటంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  

19:51 January 21

ప్రధాని మోదీ విచారం

  • Anguished by the loss of lives due to an unfortunate fire at the @SerumInstIndia. In this sad hour, my thoughts are with the families of those who lost their lives. I pray that those injured recover at the earliest.

    — Narendra Modi (@narendramodi) January 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పుణెలోని సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియాలో అగ్ని ప్రమాదం జరిగి ఐదుగురు ప్రాణాలు కోల్పోవటంపై విచారం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

19:32 January 21

  • Maharashtra: Fire breaks out again in one compartment of the same building at Serum Institute of India (SII), in Pune. Fire fighting operation is underway. More details awaited.

    Fire had broken out at Manjri Plant of SII today afternoon and claimed five lives. pic.twitter.com/6MKDWiCxZt

    — ANI (@ANI) January 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరో కంపార్ట్​మెంట్​లో మంటలు

సీరం ఇన్​స్టిట్యూట్​లో అగ్ని ప్రమాదం జరిగిన అదే భవనంలోని మరో కంపార్ట్​మెంట్​లో మంటలు చెలరేగాయి. మంటలు ఆర్పేందుకు అగ్ని మాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.  

17:52 January 21

ఐదుగురు మృతి

సీరం ఇన్​స్టిట్యూట్​లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి.10 అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపు చేశారు. 

16:23 January 21

రంగంలోకి ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం

సీరం ఇన్​స్టిట్యూట్​లో అగ్ని ప్రమాదం సంభవించగా.. ఇప్పటికే 10 అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలు అదుపు చేస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రంగంలోకి జాతీయ విపత్తు స్పందనా దళం (ఎన్​డీఆర్​ఎఫ్​) దిగింది. 

15:07 January 21

పుణె సీరం ఇన్​స్టిట్యూట్​లో అగ్ని ప్రమాదం

పుణె సీరం ఇన్​స్టిట్యూట్​లో అగ్ని ప్రమాదం

మహారాష్ట్ర పుణెలోని సీరం ఇన్​స్టిట్యూట్​లో అగ్ని ప్రమాదం జరిగింది. టెర్మినల్ గేట్​ 1 వద్ద ఎస్​ఈజెడ్​-3 భవనం 4, 5 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పేందుకు 10 అగ్నిమాపక శకటాలతో సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ పని చేసే శాస్త్రవేత్తలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఈ ఘటన వల్ల కరోనా టీకా ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావం ఉండదని సీరం సంస్థ ప్రకటించింది.

కరోనా నివారణ కోసం సీరం ఇన్​స్టిట్యూట్​ తయారు చేసిన కొవిషీల్డ్​ టీకా వినియోగానికి కేంద్రం ఇటీవలే అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం ఫ్రంట్​లైన్​ వర్కర్లకు కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు అందిస్తున్నారు.

20:14 January 21

'సీరం' ప్రమాద మృతులకు రూ.25 లక్షల పరిహారం!

పుణెలోని తమ సంస్థలో అగ్ని ప్రమాదం జరగటంపై విచారం వ్యక్తం చేసింది సీరం ఇన్​స్టిట్యూట్​. 'ఈరోజు మనకు చాలు దురదృష్టకరమైన రోజు. ఘటనతో చాలా బాధ కలిగింది. మృతుల కుటుంబాలకు మా సంతాపం. నిబంధనల ప్రకారం అందాల్సిన నగదుతో పాటు అదనంగా మరో రూ.25 లక్షల పరిహారం ప్రకటిస్తున్నాం.' అని పేర్కొన్నారు సీరం ఇన్​స్టిట్యూట్​ ఛైర్మన్​ సైరస్​ పూనవాలా.

20:07 January 21

సీరం ప్రమాదంపై రాష్ట్రపతి కోవింద్​ దిగ్భ్రాంతి

  • The loss of lives in a fire accident at the Serum Institute of India in Pune is distressing. My thoughts and prayers are with the bereaved families. I wish speedy recovery of the injured: President Ram Nath Kovind (file pic) pic.twitter.com/L8Caiix2z2

    — ANI (@ANI) January 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మహారాష్ట్ర పుణెలోని సీరం ఇన్​స్టిట్యూట్​లో అగ్ని ప్రమాదం జరిగి ఐదుగురు ప్రాణాలు కోల్పోవటంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  

19:51 January 21

ప్రధాని మోదీ విచారం

  • Anguished by the loss of lives due to an unfortunate fire at the @SerumInstIndia. In this sad hour, my thoughts are with the families of those who lost their lives. I pray that those injured recover at the earliest.

    — Narendra Modi (@narendramodi) January 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పుణెలోని సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియాలో అగ్ని ప్రమాదం జరిగి ఐదుగురు ప్రాణాలు కోల్పోవటంపై విచారం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

19:32 January 21

  • Maharashtra: Fire breaks out again in one compartment of the same building at Serum Institute of India (SII), in Pune. Fire fighting operation is underway. More details awaited.

    Fire had broken out at Manjri Plant of SII today afternoon and claimed five lives. pic.twitter.com/6MKDWiCxZt

    — ANI (@ANI) January 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరో కంపార్ట్​మెంట్​లో మంటలు

సీరం ఇన్​స్టిట్యూట్​లో అగ్ని ప్రమాదం జరిగిన అదే భవనంలోని మరో కంపార్ట్​మెంట్​లో మంటలు చెలరేగాయి. మంటలు ఆర్పేందుకు అగ్ని మాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.  

17:52 January 21

ఐదుగురు మృతి

సీరం ఇన్​స్టిట్యూట్​లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి.10 అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపు చేశారు. 

16:23 January 21

రంగంలోకి ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం

సీరం ఇన్​స్టిట్యూట్​లో అగ్ని ప్రమాదం సంభవించగా.. ఇప్పటికే 10 అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలు అదుపు చేస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రంగంలోకి జాతీయ విపత్తు స్పందనా దళం (ఎన్​డీఆర్​ఎఫ్​) దిగింది. 

15:07 January 21

పుణె సీరం ఇన్​స్టిట్యూట్​లో అగ్ని ప్రమాదం

పుణె సీరం ఇన్​స్టిట్యూట్​లో అగ్ని ప్రమాదం

మహారాష్ట్ర పుణెలోని సీరం ఇన్​స్టిట్యూట్​లో అగ్ని ప్రమాదం జరిగింది. టెర్మినల్ గేట్​ 1 వద్ద ఎస్​ఈజెడ్​-3 భవనం 4, 5 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పేందుకు 10 అగ్నిమాపక శకటాలతో సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ పని చేసే శాస్త్రవేత్తలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఈ ఘటన వల్ల కరోనా టీకా ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావం ఉండదని సీరం సంస్థ ప్రకటించింది.

కరోనా నివారణ కోసం సీరం ఇన్​స్టిట్యూట్​ తయారు చేసిన కొవిషీల్డ్​ టీకా వినియోగానికి కేంద్రం ఇటీవలే అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం ఫ్రంట్​లైన్​ వర్కర్లకు కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు అందిస్తున్నారు.

Last Updated : Jan 21, 2021, 8:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.