ETV Bharat / bharat

Twitter: ఆ అధికారి నియామకంపై ట్విట్టర్ స్పష్టత

author img

By

Published : Jul 3, 2021, 3:13 PM IST

Updated : Jul 3, 2021, 5:04 PM IST

రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారి(Resident Grievance Officer) నియామకంపై ట్విట్టర్(Twitter) సంస్థ స్పందించింది. ఈ నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుందని దిల్లీ హైకోర్టుకు తెలిపింది.

TWITTER DELHI HC
ట్విట్టర్

రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారి(Resident Grievance Officer) నియామకం తుది దశకు చేరుకుందని దిల్లీ హైకోర్టుకు సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్(Twitter) వెల్లడించింది. తాము నియమించిన మధ్యంతర గ్రీవెన్స్ అధికారి జూన్ 21న పదవి నుంచి వైదొలిగారని ధర్మాసనానికి తెలిపింది.

ఈ స్థానంలో మరొకరిని నియమించే లోపు.. భారతీయ వినియోగదారుల సమస్యలను జనరల్​ గ్రీవెన్స్ అధికారి ద్వారా పరిష్కరిస్తామని ట్విట్టర్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఐటీ రూల్స్ పాటించడం లేదంటూ దాఖలైన పిటిషన్​కు స్పందనగా దిల్లీ హైకోర్టుకు సంస్థ వెల్లడించింది. అనంతరం, దీనిపై విచారణను జులై 6కు వాయిదా వేసింది ధర్మాసనం.

కేంద్ర ప్రభుత్వ నూతన ఐటీ చట్టాల ప్రకారం భారత్​కు చెందిన వ్యక్తిని రెసిడెంట్​ గ్రీవెన్స్ అధికారిగా నియమించాల్సి ఉంటుంది. వినియోగదారులు చేసే ఫిర్యాదులకు సదరు హోదాలో ఉన్న అధికారి స్పందించాల్సి ఉంటుంది.

'వెరీగుడ్!'

మరోవైపు, నూతన ఐటీ చట్టాల(New IT rules) ప్రకారం అనుచిత పోస్టులను తొలగించిన విషయంపై ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్, గూగుల్ సంస్థలు నివేదిక విడుదల చేయడాన్ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్వాగతించారు. పారదర్శకత దిశగా ఇదో గొప్ప ముందడుగు అని పేర్కొన్నారు.

మే 15 నుంచి జూన్ 15 మధ్య మూడు కోట్ల కంటెంట్​ పీస్​ల(ఫొటోలు, వీడియోలు, కామెంట్లు)పై చర్యలు తీసుకున్నట్లు ఫేస్​బుక్ శుక్రవారం వెల్లడించింది. ఇదే సమయంలో ఇన్​స్టాగ్రామ్ 20 లక్షల కంటెంట్​ను తొలగించింది. గూగుల్.. 59 వేల కంటెంట్ పీస్​ల​ను తొలగించింది.

ఇదీ చదవండి: గూగుల్​, ఫేస్​బుక్​కు థరూర్​ కమిటీ హెచ్చరిక!

రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారి(Resident Grievance Officer) నియామకం తుది దశకు చేరుకుందని దిల్లీ హైకోర్టుకు సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్(Twitter) వెల్లడించింది. తాము నియమించిన మధ్యంతర గ్రీవెన్స్ అధికారి జూన్ 21న పదవి నుంచి వైదొలిగారని ధర్మాసనానికి తెలిపింది.

ఈ స్థానంలో మరొకరిని నియమించే లోపు.. భారతీయ వినియోగదారుల సమస్యలను జనరల్​ గ్రీవెన్స్ అధికారి ద్వారా పరిష్కరిస్తామని ట్విట్టర్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఐటీ రూల్స్ పాటించడం లేదంటూ దాఖలైన పిటిషన్​కు స్పందనగా దిల్లీ హైకోర్టుకు సంస్థ వెల్లడించింది. అనంతరం, దీనిపై విచారణను జులై 6కు వాయిదా వేసింది ధర్మాసనం.

కేంద్ర ప్రభుత్వ నూతన ఐటీ చట్టాల ప్రకారం భారత్​కు చెందిన వ్యక్తిని రెసిడెంట్​ గ్రీవెన్స్ అధికారిగా నియమించాల్సి ఉంటుంది. వినియోగదారులు చేసే ఫిర్యాదులకు సదరు హోదాలో ఉన్న అధికారి స్పందించాల్సి ఉంటుంది.

'వెరీగుడ్!'

మరోవైపు, నూతన ఐటీ చట్టాల(New IT rules) ప్రకారం అనుచిత పోస్టులను తొలగించిన విషయంపై ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్, గూగుల్ సంస్థలు నివేదిక విడుదల చేయడాన్ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్వాగతించారు. పారదర్శకత దిశగా ఇదో గొప్ప ముందడుగు అని పేర్కొన్నారు.

మే 15 నుంచి జూన్ 15 మధ్య మూడు కోట్ల కంటెంట్​ పీస్​ల(ఫొటోలు, వీడియోలు, కామెంట్లు)పై చర్యలు తీసుకున్నట్లు ఫేస్​బుక్ శుక్రవారం వెల్లడించింది. ఇదే సమయంలో ఇన్​స్టాగ్రామ్ 20 లక్షల కంటెంట్​ను తొలగించింది. గూగుల్.. 59 వేల కంటెంట్ పీస్​ల​ను తొలగించింది.

ఇదీ చదవండి: గూగుల్​, ఫేస్​బుక్​కు థరూర్​ కమిటీ హెచ్చరిక!

Last Updated : Jul 3, 2021, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.