ఒడిశా సంబల్పూర్ జిల్లా దలయ్గుడా మహానదీ ఘాట్లో దుర్ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు.. నదిలో స్నానానికి దిగారు. చివరికి వరద ప్రవాహానికి కొట్టుకుపోయారు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరొకరి ఆచూకీ తెలియాల్సి ఉంది.
ఇదీ జరిగింది..
ఘాట్ సమీపంలో నివసిస్తున్న మహమ్మద్ అల్తాఫ్.. ఇంట్లో కరెంటు లేకపోవడం వల్ల అక్కడే ఉన్న నదిలో స్నానం చేయాలని వెళ్లాడు. అతని వెంట కుమారుడు మహమ్మద్ అఫ్తాఫ్, కుమార్తె రుక్సానా కూడా వచ్చారు. మొదట నదిలోకి దిగిన కుమార్తె రుక్సానా.. ప్రవాహం ఉద్ధృతికి కొట్టుకుపోయింది. రుక్సానాను రక్షించేందుకు నదిలోకి దూకిన అల్తాఫ్, అఫ్తాఫ్లు కూడా నీటిలో కొట్టుకుపోయారు.


ఘటనాస్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది.. గల్లంతైన వారి ఆచూకీ కనుగునేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అల్తాఫ్ అతని కుమారుడు అఫ్తాఫ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో బాధితురాలు రుక్సానా ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ ఘటన సోమవారం సాయంత్రం 4.50 గంటలకు జరిగినట్లు స్థానికులు వెల్లడించారు.
ఇదీ చూడండి : 'రేప్కు యత్నం.. ప్రతిఘటించిందని పెట్రోల్ పోసి నిప్పు!'