ETV Bharat / bharat

Father Killed Baby Daughter : మూడోసారీ కూతురే.. నోట్లో తంబాకు కుక్కి చిన్నారిని చంపిన తండ్రి

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 5:17 PM IST

Updated : Sep 14, 2023, 5:38 PM IST

Father Killed Baby Daughter In Maharashtra : మూడో కాన్పులోనూ ఆడపిల్ల జన్మించిందని ఎనిమిది రోజుల చిన్నారి నోట్లో తంబాకు కుక్కి హత్య చేశాడో తండ్రి. అనంతరం మృతదేహాన్ని పాతిపెట్టాడు. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్రలోని జల్​గావ్​ జిల్లాలో జరిగింది.

Father Killed Baby Daughter In Maharashtra
Father Killed Baby Daughter In Maharashtra

Father Killed Baby Daughter In Maharashtra : మహారాష్ట్ర.. జల్​గావ్​ జిల్లాలో మూడోసారి కూడా ఆడబిడ్డ జన్మించిందని ఓ తండ్రి ఆగ్రహానికి గురయ్యాడు. ఎనిమిది రోజుల నవజాత శిశువు నోట్లో తంబాకు కుక్కి హత్య చేశాడు. అనతరం మృతదేహాన్ని ఖననం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పహూర్​ పోలీస్​ స్టేషన్ పరిధిలోని జామ్నేర్​ మండలం.. హరినగర్ తండాలో గోకుల్​ జాదవ్ (30) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడికి ఇద్దరు కుమార్తెలు. అయితే మూడోసారి కూడా ఆడబిడ్డ జన్మించింది. అయితే మూడోకాన్పులోనూ కూడా ఆడపిల్ల పుట్టిందని ఆగ్రహానికి గురయ్యాడు. ఎనిమిది రోజుల చిన్నారి నోట్లో తంబాకు కుక్కి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఖననం చేశాడు. అయితే, ఈ విషయాన్ని గోకుల్ రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించాడు. జననాన్ని నమోదు చేసుకునేందుకు ఆశా వర్కర్​ గోకుల్ ఇంటికి వెళ్లగ.. అసలు విషయం బయటపడింది. దీనిపై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా నిందితుడు నేరం అంగీకరించాడు. చిన్నారిని పాతిపెట్టిన స్థలాన్ని సందర్శించిన ఫోరెన్సిక్​ బృందం.. మృతదేహాన్ని బయటకు తీసి స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని ఎస్పీ ఎమ్​ రాజ్​కుమార్ తెలిపారు.

కుమారుడు, మనవడిని చంపిన వ్యక్తి..
కుమారుడి కుటుంబంపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు ఓ వ్యక్తి. ఈ ఘటనలో నిందితుడి కుమారుడు, మనవడు మృతి చెందారు. అనంతరం విషం తాగి నిందితుడు ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు జాన్సన్​.. తన కుమారుడు జోజీ (38), కోడలు లిజీ (33), మనవడు (12) ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో బుధవారం అర్ధరాత్రి పెట్రోలు పోశాడు. ఈ ఘటనలో జోజీ, అతడి మైనర్​ కుమారుడు మృతిచెందారు. 50 శాతం కాలిన గాయాలతో లిజీ ఎర్నాకులం ఓ ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. అయితే, కుమారుడి కుటుంబానికి నిప్పంటించిన తర్వాత నిందితుడు జాన్సన్ విషం తాగి​ ఆత్మహత్యయత్నం చేశాడు. త్రిస్సూర్​లోని ఓ ఆస్పత్రికిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమందా ఉందని పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలే ఈ హత్యలకు కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నట్లు వెల్లడించారు.

కుటుంబ కలహాలతో కుమారుడిని చంపిన తండ్రి

భార్యపై అనుమానం... కుమారుడిని చంపిన తండ్రి

Father Killed Baby Daughter In Maharashtra : మహారాష్ట్ర.. జల్​గావ్​ జిల్లాలో మూడోసారి కూడా ఆడబిడ్డ జన్మించిందని ఓ తండ్రి ఆగ్రహానికి గురయ్యాడు. ఎనిమిది రోజుల నవజాత శిశువు నోట్లో తంబాకు కుక్కి హత్య చేశాడు. అనతరం మృతదేహాన్ని ఖననం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పహూర్​ పోలీస్​ స్టేషన్ పరిధిలోని జామ్నేర్​ మండలం.. హరినగర్ తండాలో గోకుల్​ జాదవ్ (30) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడికి ఇద్దరు కుమార్తెలు. అయితే మూడోసారి కూడా ఆడబిడ్డ జన్మించింది. అయితే మూడోకాన్పులోనూ కూడా ఆడపిల్ల పుట్టిందని ఆగ్రహానికి గురయ్యాడు. ఎనిమిది రోజుల చిన్నారి నోట్లో తంబాకు కుక్కి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఖననం చేశాడు. అయితే, ఈ విషయాన్ని గోకుల్ రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించాడు. జననాన్ని నమోదు చేసుకునేందుకు ఆశా వర్కర్​ గోకుల్ ఇంటికి వెళ్లగ.. అసలు విషయం బయటపడింది. దీనిపై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా నిందితుడు నేరం అంగీకరించాడు. చిన్నారిని పాతిపెట్టిన స్థలాన్ని సందర్శించిన ఫోరెన్సిక్​ బృందం.. మృతదేహాన్ని బయటకు తీసి స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని ఎస్పీ ఎమ్​ రాజ్​కుమార్ తెలిపారు.

కుమారుడు, మనవడిని చంపిన వ్యక్తి..
కుమారుడి కుటుంబంపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు ఓ వ్యక్తి. ఈ ఘటనలో నిందితుడి కుమారుడు, మనవడు మృతి చెందారు. అనంతరం విషం తాగి నిందితుడు ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు జాన్సన్​.. తన కుమారుడు జోజీ (38), కోడలు లిజీ (33), మనవడు (12) ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో బుధవారం అర్ధరాత్రి పెట్రోలు పోశాడు. ఈ ఘటనలో జోజీ, అతడి మైనర్​ కుమారుడు మృతిచెందారు. 50 శాతం కాలిన గాయాలతో లిజీ ఎర్నాకులం ఓ ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. అయితే, కుమారుడి కుటుంబానికి నిప్పంటించిన తర్వాత నిందితుడు జాన్సన్ విషం తాగి​ ఆత్మహత్యయత్నం చేశాడు. త్రిస్సూర్​లోని ఓ ఆస్పత్రికిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమందా ఉందని పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలే ఈ హత్యలకు కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నట్లు వెల్లడించారు.

కుటుంబ కలహాలతో కుమారుడిని చంపిన తండ్రి

భార్యపై అనుమానం... కుమారుడిని చంపిన తండ్రి

Last Updated : Sep 14, 2023, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.