ETV Bharat / bharat

'ప్రధాని వైఫల్యంతోనే దేశంలో లాక్​డౌన్​ పరిస్థితులు' - zero strategy of Centre pushing India towards complete lockdown: Rahul Gandhi

ప్రధాన మంత్రి, కేంద్ర ప్రభుత్వం వైఫల్యాల కారణంగా దేశంలో సంపూర్ణ లాక్​డౌన్ విధించాల్సిన పరిస్థితులు తలెత్తాయని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ విమర్శించారు. ​పేద ప్రజల సహాయార్థం ఆర్థిక ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Rahul Gandhi
'ప్రధాని వైఫల్యంతోనే దేశంలో లాక్​డౌన్​ పరిస్థితులు'
author img

By

Published : May 7, 2021, 5:52 AM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వైఫల్యం, వ్యూహం లేని కేంద్ర ప్రభుత్వ తీరు కారణంగా లాక్​డౌన్ విధించేలా దేశంలో పరిస్థితులు మారాయని కాంగ్రెస్​ రాహుల్​ గాంధీ విమర్శించారు. తాను సంపూర్ణ లాక్​డౌన్​కు వ్యతిరేకం అని ట్విట్టర్​ వేదికగా గురువారం పేర్కొన్నారు.

"గతేడాది విధించిన ప్రణాళిక లేని లాక్​డౌన్​తో ప్రజలపై ప్రాణాంతక దాడి జరిగింది. అందుకే నేను సంపూర్ణ లాక్​డౌన్​ విధించడాన్ని వ్యతిరేకిస్తాను. కానీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వైఫల్యం, ఎలాంటి వ్యూహం లేని కేంద్ర ప్రభుత్వం వైఖరి వల్ల దేశం మొత్తం లాక్​డౌన్​లోకి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇలాంటి పరిస్థితుల్లో పేద ప్రజల కోసం ఆర్థిక ప్యాకేజీ సహా అన్ని రకాల సహాయాలను అందించడం అత్యవసరం."

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్ర నేత

రాహుల్​ మరో ట్వీట్​లో పెట్రో ధరల పెరుగుదలపై తప్పుబట్టారు. ఎన్నికల ముగిసినందున చమురు ధరలతో దోపిడీ ప్రారంభమైందని విమర్శించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో పేదల బ్యాంకు ఖాతాల్లో రూ.6,000 నగదును ప్రభుత్వం జమ చేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: ఎన్నికల సంఘం పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వైఫల్యం, వ్యూహం లేని కేంద్ర ప్రభుత్వ తీరు కారణంగా లాక్​డౌన్ విధించేలా దేశంలో పరిస్థితులు మారాయని కాంగ్రెస్​ రాహుల్​ గాంధీ విమర్శించారు. తాను సంపూర్ణ లాక్​డౌన్​కు వ్యతిరేకం అని ట్విట్టర్​ వేదికగా గురువారం పేర్కొన్నారు.

"గతేడాది విధించిన ప్రణాళిక లేని లాక్​డౌన్​తో ప్రజలపై ప్రాణాంతక దాడి జరిగింది. అందుకే నేను సంపూర్ణ లాక్​డౌన్​ విధించడాన్ని వ్యతిరేకిస్తాను. కానీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వైఫల్యం, ఎలాంటి వ్యూహం లేని కేంద్ర ప్రభుత్వం వైఖరి వల్ల దేశం మొత్తం లాక్​డౌన్​లోకి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇలాంటి పరిస్థితుల్లో పేద ప్రజల కోసం ఆర్థిక ప్యాకేజీ సహా అన్ని రకాల సహాయాలను అందించడం అత్యవసరం."

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్ర నేత

రాహుల్​ మరో ట్వీట్​లో పెట్రో ధరల పెరుగుదలపై తప్పుబట్టారు. ఎన్నికల ముగిసినందున చమురు ధరలతో దోపిడీ ప్రారంభమైందని విమర్శించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో పేదల బ్యాంకు ఖాతాల్లో రూ.6,000 నగదును ప్రభుత్వం జమ చేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: ఎన్నికల సంఘం పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.