ETV Bharat / bharat

'పాజిటివిటీ రేటు 10 శాతం మించితే కంటైన్​మెంట్​ జోన్​' - పాజిటివిటీ రేటు

కరోనా విజృంభణ కొనసాగుతున్న క్రమంలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలను కంటైన్​మెంట్​ జోన్​లుగా పరిగణించి కఠిన ఆంక్షలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది కేంద్రం. అప్పుడే వైరస్​ వ్యాప్తిని అదుపు చేయగలమని పేర్కొంది.

MHA
కేంద్ర హోంశాఖ
author img

By

Published : Apr 30, 2021, 6:22 AM IST

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోం శాఖ కీలక సూచనలు చేసింది. కొవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా ఉన్నా, లేదా పడకల సామర్థ్యం 60 శాతం దాటినా.. ఆ జిల్లాలను కంటైన్​మెంట్ జోన్​లుగా పరిగణించి.. కఠిన ఆంక్షలు అమలు చేయాలని ఆదేశించింది. అంతేకాక ఆసుపత్రుల్లో ఆక్సిజన్, ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు, అంబులెన్సుల కొరత లేకుండా చూసుకోవాలని సూచించింది.

కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూలను విధించాలని సూచించింది. ప్రజలు అధిక సంఖ్యలో గుమికూడటం నిషేధించింది. పెళ్లిళ్లకు కేవలం 50 మంది మాత్రమే హాజరు కావాలని.. అంత్యక్రియలు అయితే 20 మందికి మించి హాజరు కావొద్దని స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలు మే 31 వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అయితే లాక్​డౌన్​పై మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు కేంద్ర హోం శాఖ.

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోం శాఖ కీలక సూచనలు చేసింది. కొవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా ఉన్నా, లేదా పడకల సామర్థ్యం 60 శాతం దాటినా.. ఆ జిల్లాలను కంటైన్​మెంట్ జోన్​లుగా పరిగణించి.. కఠిన ఆంక్షలు అమలు చేయాలని ఆదేశించింది. అంతేకాక ఆసుపత్రుల్లో ఆక్సిజన్, ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు, అంబులెన్సుల కొరత లేకుండా చూసుకోవాలని సూచించింది.

కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూలను విధించాలని సూచించింది. ప్రజలు అధిక సంఖ్యలో గుమికూడటం నిషేధించింది. పెళ్లిళ్లకు కేవలం 50 మంది మాత్రమే హాజరు కావాలని.. అంత్యక్రియలు అయితే 20 మందికి మించి హాజరు కావొద్దని స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలు మే 31 వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అయితే లాక్​డౌన్​పై మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు కేంద్ర హోం శాఖ.

ఇదీ చదవండి : ప్రధాని నేతృత్వంలో నేడు కేంద్ర మంత్రిమండలి భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.