ETV Bharat / bharat

'జులై-ఆగస్టు కల్లా దేశంలో సరిపడా టీకాలు'

జులై-ఆగస్టు కల్లా దేశంలో అందరికీ సరిపోయేలా టీకా డోసులు అందుబాటులో ఉంటాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. కరోనా పరిస్థితులను కేంద్రం ఎదుర్కొంటున్న తీరుపై కాంగ్రెస్​ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు.

author img

By

Published : May 17, 2021, 6:24 AM IST

narendra singh tomar
తోమర్, కేంద్ర వ్యవసాయ మంత్రి

దేశంలో కరోనా టీకా డోసుల కొరత నేపథ్యంలో కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​. జులై-ఆగస్టు కల్లా దేశంలో అందరికీ సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. కొవిడ్​ పరిస్థితులను ఎదుర్కోవడంలో కేంద్రం విఫలమైందంటూ కాంగ్రెస్​ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు.

"వ్యాక్సిన్లపై కాంగ్రెస్ పలు ఆరోపణలు చేస్తోంది. ఇది చాలా బాధాకరమైన విషయం. జులై-ఆగస్టు కల్లా దేశంలో సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయి."

- నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయ శాక మంత్రి

కొవిడ్​ లాంటి విపత్కర పరిస్థితులను కాంగ్రెస్​ తమ పాలనలో ఎదుర్కోలేదని తోమర్ అన్నారు. గ్వాలియర్​లోని ఓ ప్రభుత్వ మెడికల్ కళాశాల సమీపంలో 1000 పడకల కొవిడ్ ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే అది ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. బ్లాక్ ఫంగస్​ బాధితులకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:బురద గుంటలో ఏనుగు- జేసీబీ సాయంతో బయటకు!

దేశంలో కరోనా టీకా డోసుల కొరత నేపథ్యంలో కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​. జులై-ఆగస్టు కల్లా దేశంలో అందరికీ సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. కొవిడ్​ పరిస్థితులను ఎదుర్కోవడంలో కేంద్రం విఫలమైందంటూ కాంగ్రెస్​ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు.

"వ్యాక్సిన్లపై కాంగ్రెస్ పలు ఆరోపణలు చేస్తోంది. ఇది చాలా బాధాకరమైన విషయం. జులై-ఆగస్టు కల్లా దేశంలో సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయి."

- నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయ శాక మంత్రి

కొవిడ్​ లాంటి విపత్కర పరిస్థితులను కాంగ్రెస్​ తమ పాలనలో ఎదుర్కోలేదని తోమర్ అన్నారు. గ్వాలియర్​లోని ఓ ప్రభుత్వ మెడికల్ కళాశాల సమీపంలో 1000 పడకల కొవిడ్ ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే అది ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. బ్లాక్ ఫంగస్​ బాధితులకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:బురద గుంటలో ఏనుగు- జేసీబీ సాయంతో బయటకు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.