ETV Bharat / bharat

'ఎన్నికలు కాదు.. పాకిస్థాన్​తో చర్చలు జరపండి'

author img

By

Published : Nov 29, 2020, 9:59 PM IST

భాజపాపై మండిపడ్డారు పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ. ప్రజా సమస్యలను లేవనెత్తినందుకు తమ పార్టీని నిషేధించాలని భాజపా కుట్రపన్నుతోందని మండిపడ్డారు. 'హిందువులంటే భాజపా కార్యకర్తలేనా?' అని ప్రశ్నించారు. ఎన్నికలు నిర్వహించటం వల్ల కశ్మీర్​ సమస్య పరిష్కారం కాదని, భారత్- పాక్​ల మధ్య చర్చలు అవసరమని తెలిపారు.

elections-no-solution-to-kashmir-problem-mufti-a-day-after-ddc-polls
'కశ్మీర్​ సమస్యకు పరిష్కారం ఎన్నికలు కాదు'

పీపుల్స్​ డెమోక్రటిక్​ పార్టీ(పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ.. భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నందుకు తన పార్టీని నిషేధించాలని కొందరు ప్రయత్నిస్తున్నట్టు మండిపడ్డారు. జమ్ముకశ్మీర్​ స్థానిక ఎన్నికల ప్రచారానికి 'గుప్కార్​ కూటమి' అభ్యర్థులకు అనుమతి ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి. ప్రచారానికి వెళ్లకుండా పోటీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. కశ్మీర్​లో ప్రజాస్వామ్యాన్ని భాజపా హరిస్తోందని ఆరోపించారు. 'భాజపా కార్యకర్తలే హిందువులా?' అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాడే వారిపై యూఏపీఏ చట్టం కింద కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

'భారత్​-పాక్​ చర్చలు జరపాలి'

కశ్మీర్​ సమస్యకు పరిష్కారం.. ఎన్నికలు కాదన్న ముఫ్తీ.. భారత్- పాకిస్థాన్​ మధ్య చర్చలు అవసరమని అభిప్రాయపడ్డారు. 'చైనాతో చర్చలు జరుపుతున్నాం. పాకిస్థాన్​తో చర్చలు జరగకపోవటానికి కారణమేంటి? ఓ ముస్లిం దేశం అనే కదా పాక్​తో చర్చలకు కేంద్రం సుముఖంగా లేదు?' అని ప్రశ్నించారు ముఫ్తీ.

'బలగాల మోహరింపు ఎందుకు?'

అధికరణ 370 రద్దు చేస్తే కశ్మీర్​లో అన్ని సమస్యలు తొలిగిపోతాయని చెప్పిన కేంద్రం.. ఇప్పుడు బలగాలను ఎందుకు మోహరిస్తోందని ప్రశ్నించారు.

ఇదీ సంగతి: మరోసారి ముఫ్తీ, ఇల్తీజా గృహ నిర్బంధం!

పీపుల్స్​ డెమోక్రటిక్​ పార్టీ(పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ.. భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నందుకు తన పార్టీని నిషేధించాలని కొందరు ప్రయత్నిస్తున్నట్టు మండిపడ్డారు. జమ్ముకశ్మీర్​ స్థానిక ఎన్నికల ప్రచారానికి 'గుప్కార్​ కూటమి' అభ్యర్థులకు అనుమతి ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి. ప్రచారానికి వెళ్లకుండా పోటీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. కశ్మీర్​లో ప్రజాస్వామ్యాన్ని భాజపా హరిస్తోందని ఆరోపించారు. 'భాజపా కార్యకర్తలే హిందువులా?' అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాడే వారిపై యూఏపీఏ చట్టం కింద కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

'భారత్​-పాక్​ చర్చలు జరపాలి'

కశ్మీర్​ సమస్యకు పరిష్కారం.. ఎన్నికలు కాదన్న ముఫ్తీ.. భారత్- పాకిస్థాన్​ మధ్య చర్చలు అవసరమని అభిప్రాయపడ్డారు. 'చైనాతో చర్చలు జరుపుతున్నాం. పాకిస్థాన్​తో చర్చలు జరగకపోవటానికి కారణమేంటి? ఓ ముస్లిం దేశం అనే కదా పాక్​తో చర్చలకు కేంద్రం సుముఖంగా లేదు?' అని ప్రశ్నించారు ముఫ్తీ.

'బలగాల మోహరింపు ఎందుకు?'

అధికరణ 370 రద్దు చేస్తే కశ్మీర్​లో అన్ని సమస్యలు తొలిగిపోతాయని చెప్పిన కేంద్రం.. ఇప్పుడు బలగాలను ఎందుకు మోహరిస్తోందని ప్రశ్నించారు.

ఇదీ సంగతి: మరోసారి ముఫ్తీ, ఇల్తీజా గృహ నిర్బంధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.