ETV Bharat / bharat

యడ్డీ చట్టంతో 'జూ' జంతువులకు ఆకలి కష్టాలు! - మైసూర్​ జంతు ప్రదర్శన శాల వార్తలు

కర్ణాటక ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఓ చట్టంతో.. అక్కడి జంతు ప్రదర్శనశాలల్లోని మాంసాహార జంతువులపై తీవ్ర ప్రభావం పడుతోందని అధికారులు చెబుతున్నారు. ఫలితంగా.. జూలోని జంతువులకు సరైన ఆహారం అందక బలహీనంగా తయారవుతున్నాయని పేర్కొంటున్నారు.

Effect of cow slaughter prohibition act: Lack of food to Zoo animals
ఆకలితో అలమటిస్తున్న 'జూ' జంతువులు- కారణమదే?
author img

By

Published : Jan 28, 2021, 12:43 PM IST

ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టం.. అక్కడి జంతు ప్రదర్శనశాలల్లోని మాంసాహార జంతువులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మైసూర్​ జంతు ప్రదర్శనశాలలో ఆయా జంతువులకు ఆకలి కష్టాలు మొదలయ్యాయని అక్కడి సిబ్బంది పేర్కొంటున్నారు. గోవధ నిషేధ చట్టంతో మాంసాహార జంతువులకు చికెన్​ మాత్రమే ఇవ్వగలుగుతున్నామని, ఒక్కసారిగా ఆహారంలో మార్పుతో అలవాటుపడలేక బలహీనంగా మారుతున్నట్లు చెప్పారు.

Effect of cow slaughter prohibition act: Lack of food to Zoo animals
బలహీనపడ్డ సింహం

మైసూర్​ 'జూ'లో.. సింహం, పులి, చిరుతపులి, మొసలి, హైనా, ఆఫ్రికన్​ చిరుత వంటి మాంసాహార జంతువులు ఉన్నాయి. వాటికి మొదటి నుంచి బీఫ్​ (గొడ్డు మాంసం) పెట్టేవారు. అయితే.. యడియూరప్ప సర్కార్​ ఇటీవల తీసుకొచ్చిన చట్టంతో కేవలం పౌల్ట్రీ మాంసానికే పరిమితమైనట్లు అక్కడి సిబ్బంది తెలిపారు.

"గోవధ నిషేధంతో జంతు ప్రదర్శనశాలలో మాంసాహార జంతువులపై తీవ్ర ప్రభావం పడుతోంది. వాటికి రోజుకు 300-350 కిలోల బీఫ్​ అవసరమయ్యేది. కానీ.. ఇప్పుడు 500 కిలోలకుపైగా చికెన్​ అందించాల్సివస్తోంది. చేసేది లేక.. వైద్యుల పర్యవేక్షణలో క్రమంగా వాటికి చికెన్​ అలవాటు చేస్తున్నాం."

- అజిత్​ కులకర్ణి, జంతు సంరక్షణాధికారి

ఇదీ చదవండి: ఆ అమ్మవారికి 'రాళ్లే' నైవేద్యం!

ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టం.. అక్కడి జంతు ప్రదర్శనశాలల్లోని మాంసాహార జంతువులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మైసూర్​ జంతు ప్రదర్శనశాలలో ఆయా జంతువులకు ఆకలి కష్టాలు మొదలయ్యాయని అక్కడి సిబ్బంది పేర్కొంటున్నారు. గోవధ నిషేధ చట్టంతో మాంసాహార జంతువులకు చికెన్​ మాత్రమే ఇవ్వగలుగుతున్నామని, ఒక్కసారిగా ఆహారంలో మార్పుతో అలవాటుపడలేక బలహీనంగా మారుతున్నట్లు చెప్పారు.

Effect of cow slaughter prohibition act: Lack of food to Zoo animals
బలహీనపడ్డ సింహం

మైసూర్​ 'జూ'లో.. సింహం, పులి, చిరుతపులి, మొసలి, హైనా, ఆఫ్రికన్​ చిరుత వంటి మాంసాహార జంతువులు ఉన్నాయి. వాటికి మొదటి నుంచి బీఫ్​ (గొడ్డు మాంసం) పెట్టేవారు. అయితే.. యడియూరప్ప సర్కార్​ ఇటీవల తీసుకొచ్చిన చట్టంతో కేవలం పౌల్ట్రీ మాంసానికే పరిమితమైనట్లు అక్కడి సిబ్బంది తెలిపారు.

"గోవధ నిషేధంతో జంతు ప్రదర్శనశాలలో మాంసాహార జంతువులపై తీవ్ర ప్రభావం పడుతోంది. వాటికి రోజుకు 300-350 కిలోల బీఫ్​ అవసరమయ్యేది. కానీ.. ఇప్పుడు 500 కిలోలకుపైగా చికెన్​ అందించాల్సివస్తోంది. చేసేది లేక.. వైద్యుల పర్యవేక్షణలో క్రమంగా వాటికి చికెన్​ అలవాటు చేస్తున్నాం."

- అజిత్​ కులకర్ణి, జంతు సంరక్షణాధికారి

ఇదీ చదవండి: ఆ అమ్మవారికి 'రాళ్లే' నైవేద్యం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.