ETV Bharat / bharat

సంజయ్​ రౌత్ భార్యకు ఈడీ సమన్లు

శివసేన సీనియర్​ నేత సంజయ్​ రౌత్​ సతీమణికి ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​ సమన్లు జారీ చేసింది. పంజాబ్​, మహారాష్ట్ర కోపరేటివ్​ (పీఎంసీ) బ్యాంక్​ కుంభకోణం కేసులో ఆమెను అధికారులు ప్రశ్నించనున్నారు.

author img

By

Published : Dec 28, 2020, 10:43 AM IST

Sanjay Raut's wife
సంజయ్​ రౌత్ సతీమణికి ఈడీ సమన్లు

శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​ భార్య వర్షా రౌత్​కు ఎన్​ఫోర్స్​ మెంట్​ డైరక్టరేట్​ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. పంజాబ్​, మహారాష్ట్ర కోపరేటివ్​ (పీఎం​సీ) బ్యాంక్​ కుంభకోణంలో ఆమెను ప్రశ్నించనుంది ఈడీ. ఆమెను డిసెంబర్​ 29న తమ ముందు హాజరు కావాలని ఈ మేరకు సమన్లు జారీ చేశారు అధికారులు.

వర్షా రౌత్​ బ్యాంక్​ ఖాతాలోకి పలు లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఈ లావాదేవీలు ఎందుకు, ఎలా జరిపారనే విషయంపై సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు ఈడీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఓ ఆస్తి కొనుగోలు చేసేందుకు ఆమె తీసుకున్న రుణంపైనా అధికారులు ప్రశ్నలు వేయనున్నట్లు తెలుస్తోంది.

ఎన్​సీపీ నేతకు..

వర్షా రౌత్​ కన్నా ముందు ఎన్​సీపీ నేత ఏక్​నాథ్ ఖాడ్సేకు ఓ భూ వివాదంపై ఈడీ సమన్లు జారీ చేసింది. ఆయను డిసెంబర్​ 30న ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. 2016లో ఆయన దేవేంద్ర ఫడణవీస్​ ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడం వల్ల రాజీనామా చేశారు. భాజపాలో 40 ఏళ్లుపాటు ఉన్న ఏక్​నాథ్​ ఇటీవల ఎన్​సీపీలో చేరారు.

శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​ భార్య వర్షా రౌత్​కు ఎన్​ఫోర్స్​ మెంట్​ డైరక్టరేట్​ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. పంజాబ్​, మహారాష్ట్ర కోపరేటివ్​ (పీఎం​సీ) బ్యాంక్​ కుంభకోణంలో ఆమెను ప్రశ్నించనుంది ఈడీ. ఆమెను డిసెంబర్​ 29న తమ ముందు హాజరు కావాలని ఈ మేరకు సమన్లు జారీ చేశారు అధికారులు.

వర్షా రౌత్​ బ్యాంక్​ ఖాతాలోకి పలు లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఈ లావాదేవీలు ఎందుకు, ఎలా జరిపారనే విషయంపై సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు ఈడీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఓ ఆస్తి కొనుగోలు చేసేందుకు ఆమె తీసుకున్న రుణంపైనా అధికారులు ప్రశ్నలు వేయనున్నట్లు తెలుస్తోంది.

ఎన్​సీపీ నేతకు..

వర్షా రౌత్​ కన్నా ముందు ఎన్​సీపీ నేత ఏక్​నాథ్ ఖాడ్సేకు ఓ భూ వివాదంపై ఈడీ సమన్లు జారీ చేసింది. ఆయను డిసెంబర్​ 30న ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. 2016లో ఆయన దేవేంద్ర ఫడణవీస్​ ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడం వల్ల రాజీనామా చేశారు. భాజపాలో 40 ఏళ్లుపాటు ఉన్న ఏక్​నాథ్​ ఇటీవల ఎన్​సీపీలో చేరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.