తమిళనాడులో భారీగా బంగారాన్ని సీజ్ చేసింది ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్. తిరుపత్తూర్ జిల్లా చిన్న కంథాల్ చెక్పోస్ట్ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీలో రూ.22 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుంది.
ఎన్నికల వేళ రూ.22 కోట్ల బంగారం సీజ్
తమిళనాడులోని చిన్న కంథాల్చెక్ పోస్టు వద్ద రూ.22 కోట్లు విలువచేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది. వీటికి సరైన పత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది.
![ఎన్నికల వేళ రూ.22 కోట్ల బంగారం సీజ్ EC seizes 22 crores worth gold at Tirupathur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10970499-thumbnail-3x2-gold.jpg?imwidth=3840)
వ్యాను యజమానిని హోసూర్ టైటాన్గా గుర్తించారు అధికారులు. ఈ బంగారాన్ని జ్యువెల్లరీ దుకాణాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సరైన పత్రాలను చూపించినట్లు సమాచారం. అయితే.. ఎన్నికల సమయంలో భారీ స్థాయిలో బంగారం తరలించకూడదని ఈ వ్యాన్ను సీజ్ చేసినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.
తమిళనాడులో భారీగా బంగారాన్ని సీజ్ చేసింది ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్. తిరుపత్తూర్ జిల్లా చిన్న కంథాల్ చెక్పోస్ట్ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీలో రూ.22 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుంది.
వ్యాను యజమానిని హోసూర్ టైటాన్గా గుర్తించారు అధికారులు. ఈ బంగారాన్ని జ్యువెల్లరీ దుకాణాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సరైన పత్రాలను చూపించినట్లు సమాచారం. అయితే.. ఎన్నికల సమయంలో భారీ స్థాయిలో బంగారం తరలించకూడదని ఈ వ్యాన్ను సీజ్ చేసినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.