ETV Bharat / bharat

బెంగళూరులో వరుస భూప్రకంపనలు- జనం పరుగులు

Earthquake in Bangalore: బెంగళూరు ఉత్తర ఈశాన్య ప్రాంతంలోని చిక్కబళ్లాపుర జిల్లాలో బుధవారం ఉదయం రెండుసార్లు భూమి కంపించింది. ఆందోళన చెందిన ప్రజలు ఇళ్లల్లోంచి పరుగులు పెట్టారు.

author img

By

Published : Dec 22, 2021, 12:16 PM IST

Earthquake in Bangalore
బెంగళూరులో కంపించిన భూమి

Earthquake in Bangalore: కర్ణాటకలోని బెంగళూరు ఉత్తర ఈశాన్య ప్రాంతంలో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. చిక్కబళ్లాపుర​ జిల్లాలోని ప్రాంతాల్లో రిక్టార్​ స్కేల్​పై 2.9, 3.0 తీవ్రతతో రెండుసార్లు భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. భూ ప్రకంపనలతో ఆందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు.

Earthquake in Bangalore
ఇళ్ల నుంచి బయటకు వచ్చిన జనం
  1. మొదటి సారి: చిక్కబళ్లాపుర జిల్లాలోని మండికల్​ గ్రామపంచాయతీ పరిధిలో ఉదయం 10.05 గంటలకు భూమి కంపించినట్లు కర్ణాటక రాష్ట్ర ప్రకృతి విపత్తుల పర్యవేక్షణ కేంద్రం అధికారులు తెలిపారు. గ్రామానికి 1.4 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు చెప్పారు. రికార్ట్​ స్కేల్​పై 2.9 తీవ్రత నమోదైనట్లు తెలిపారు.
  2. రెండోసారి: చిక్కబళ్లాపుర​ తాలుకా, అడ్డగళ్లు గ్రామ పంచాయతీ పరిధిలోని భోగపర్తి గ్రామానికి తూర్పు ఆగ్నేయ ప్రాంతంలో 1.23 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 7.15 గంటలకు భూమి కంపించిందని, రికార్ట్​ స్కేల్​పై తీవ్రత 3గా నమోదైనట్లు తెలిపారు.

ఆందోళన వద్దు..

తీవ్రత స్వల్పంగానే ఉన్నందున భూ ప్రకంపనలు 10-15 కిలోమీటర్లకు మాత్రమే వ్యాపించి ఉంటాయని అధికారులు తెలిపారు. ఇలాంటి భూకంపాలు ఎలాంటి ప్రభావం చూపవన్నారు. స్వల్పంగా ప్రకంపనలు కనిపిస్తాయన్నారు. తీవ్రత తక్కువగానే ఉన్నందున ప్రజలు ఆందోళనకు గురికావద్దని సూచించారు కర్ణాటక రాష్ట్ర ప్రకృతి విపత్తు పర్యవేక్షణ కేంద్రం డైరెక్టర్​.

Earthquake in Bangalore
భయంతో ఇంటి బయట గుమిగూడిన కాలనీవాసులు

ఇదీ చూడండి:

California Earthquake: కాలిఫోర్నియాలో 6.2 తీవ్రతతో భూకంపం

ఇండోనేసియాలో భారీ భూకంపం- సునామీ హెచ్చరికలు!

Earthquake in Bangalore: కర్ణాటకలోని బెంగళూరు ఉత్తర ఈశాన్య ప్రాంతంలో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. చిక్కబళ్లాపుర​ జిల్లాలోని ప్రాంతాల్లో రిక్టార్​ స్కేల్​పై 2.9, 3.0 తీవ్రతతో రెండుసార్లు భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. భూ ప్రకంపనలతో ఆందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు.

Earthquake in Bangalore
ఇళ్ల నుంచి బయటకు వచ్చిన జనం
  1. మొదటి సారి: చిక్కబళ్లాపుర జిల్లాలోని మండికల్​ గ్రామపంచాయతీ పరిధిలో ఉదయం 10.05 గంటలకు భూమి కంపించినట్లు కర్ణాటక రాష్ట్ర ప్రకృతి విపత్తుల పర్యవేక్షణ కేంద్రం అధికారులు తెలిపారు. గ్రామానికి 1.4 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు చెప్పారు. రికార్ట్​ స్కేల్​పై 2.9 తీవ్రత నమోదైనట్లు తెలిపారు.
  2. రెండోసారి: చిక్కబళ్లాపుర​ తాలుకా, అడ్డగళ్లు గ్రామ పంచాయతీ పరిధిలోని భోగపర్తి గ్రామానికి తూర్పు ఆగ్నేయ ప్రాంతంలో 1.23 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 7.15 గంటలకు భూమి కంపించిందని, రికార్ట్​ స్కేల్​పై తీవ్రత 3గా నమోదైనట్లు తెలిపారు.

ఆందోళన వద్దు..

తీవ్రత స్వల్పంగానే ఉన్నందున భూ ప్రకంపనలు 10-15 కిలోమీటర్లకు మాత్రమే వ్యాపించి ఉంటాయని అధికారులు తెలిపారు. ఇలాంటి భూకంపాలు ఎలాంటి ప్రభావం చూపవన్నారు. స్వల్పంగా ప్రకంపనలు కనిపిస్తాయన్నారు. తీవ్రత తక్కువగానే ఉన్నందున ప్రజలు ఆందోళనకు గురికావద్దని సూచించారు కర్ణాటక రాష్ట్ర ప్రకృతి విపత్తు పర్యవేక్షణ కేంద్రం డైరెక్టర్​.

Earthquake in Bangalore
భయంతో ఇంటి బయట గుమిగూడిన కాలనీవాసులు

ఇదీ చూడండి:

California Earthquake: కాలిఫోర్నియాలో 6.2 తీవ్రతతో భూకంపం

ఇండోనేసియాలో భారీ భూకంపం- సునామీ హెచ్చరికలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.