ETV Bharat / bharat

రూ.130 కోట్ల విలువైన డ్రగ్స్​ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్​

author img

By

Published : Mar 16, 2022, 5:08 PM IST

Drugs seized in Assam: టోల్​గేట్​ వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఓ ట్రక్కులో భారీగా తరలిస్తున్న డ్రగ్స్​ పట్టుకున్నారు పోలీసులు. ఈ సంఘటన అసోంలోని సోనాపుర్​ జిల్లాలో బుధవారం జరిగింది. వీటి విలువ సుమారు రూ.130 కోట్లుగా ఉంటుందని తెలిపారు.

Assam Police recovers drugs
రూ.130 కోట్లు విలువైన డ్రగ్స్​ పట్టివేత

Drugs seized in Assam: అసోంలోని సోనాపుర్​ జిల్లాలో బుధవారం భారీస్థాయిలో మత్తుపదార్థాలను పట్టుకున్నారు పోలీసులు. వాటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.130 కోట్లుగా ఉంటుందని తెలిపారు. ఈ కేసులో మణిపుర్​కు చెందిన ఇద్దరు యువకులను అరెస్ట్​ చేశారు.

డ్రగ్స్​పై విశ్వసనీయ వర్గాల నుంచి మంగళవారం రాత్రి సమాచారం అందిన క్రమంలో సోనాపుర్​ క్రైమ్​ బ్రాంచ్​ పోలీసులు తనిఖీలు చేపట్టారు. నగరంలోని టోల్​గేట్​ వద్ద ఓ ట్రక్కులో సోదాలు నిర్వహించగా భారీస్థాయిలో డ్రగ్స్​ బయటపడ్డాయి. వాటిని మణిపుర్​ నుంచి అసోంకు తరలిస్తున్నట్లు గుర్తించారు. అందులో 4.6 లక్షల యాబా ట్యాబ్లెట్లు, 12 కిలోల మెథంఫెటమైన్​, 1.5 కిలోల హెరాయిన్​ ఉన్నట్లు చెప్పారు.

భారీస్థాయిలో డ్రగ్స్​ను పట్టుకున్న పోలీసులు, అధికారులపై ప్రశంసలు కురిపించారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.

" డ్రగ్స్​ను అరికట్టటంలో అసోం పోలీసులు మరో విజయం సాధించారు. వివేకానంద దాస్​, ఏడీసీపీ ఈస్ట్​, నవజిత్​ నాథ్​, ఓసీ సోనాపుర్​ ఆధ్వర్యంలో నిర్వహించిన కీలక ఆపరేషన్​లో 4.6 లక్షల యాబా ట్యాబ్లెట్లు, 12 కిలోల మెథంఫెటమైన్​, 1.5 కిలోల హెరాయిన్​ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. మంచి పని చేస్తున్నారు. ఇలాగే కొనసాగాలి. "

- హిమంత బిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి.

ఇదీ చూడండి: 'దిల్లీ క్యాపిటల్​' బస్సు అద్దాలు ధ్వంసం.. ఐదుగురు అరెస్ట్​

Drugs seized in Assam: అసోంలోని సోనాపుర్​ జిల్లాలో బుధవారం భారీస్థాయిలో మత్తుపదార్థాలను పట్టుకున్నారు పోలీసులు. వాటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.130 కోట్లుగా ఉంటుందని తెలిపారు. ఈ కేసులో మణిపుర్​కు చెందిన ఇద్దరు యువకులను అరెస్ట్​ చేశారు.

డ్రగ్స్​పై విశ్వసనీయ వర్గాల నుంచి మంగళవారం రాత్రి సమాచారం అందిన క్రమంలో సోనాపుర్​ క్రైమ్​ బ్రాంచ్​ పోలీసులు తనిఖీలు చేపట్టారు. నగరంలోని టోల్​గేట్​ వద్ద ఓ ట్రక్కులో సోదాలు నిర్వహించగా భారీస్థాయిలో డ్రగ్స్​ బయటపడ్డాయి. వాటిని మణిపుర్​ నుంచి అసోంకు తరలిస్తున్నట్లు గుర్తించారు. అందులో 4.6 లక్షల యాబా ట్యాబ్లెట్లు, 12 కిలోల మెథంఫెటమైన్​, 1.5 కిలోల హెరాయిన్​ ఉన్నట్లు చెప్పారు.

భారీస్థాయిలో డ్రగ్స్​ను పట్టుకున్న పోలీసులు, అధికారులపై ప్రశంసలు కురిపించారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.

" డ్రగ్స్​ను అరికట్టటంలో అసోం పోలీసులు మరో విజయం సాధించారు. వివేకానంద దాస్​, ఏడీసీపీ ఈస్ట్​, నవజిత్​ నాథ్​, ఓసీ సోనాపుర్​ ఆధ్వర్యంలో నిర్వహించిన కీలక ఆపరేషన్​లో 4.6 లక్షల యాబా ట్యాబ్లెట్లు, 12 కిలోల మెథంఫెటమైన్​, 1.5 కిలోల హెరాయిన్​ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. మంచి పని చేస్తున్నారు. ఇలాగే కొనసాగాలి. "

- హిమంత బిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి.

ఇదీ చూడండి: 'దిల్లీ క్యాపిటల్​' బస్సు అద్దాలు ధ్వంసం.. ఐదుగురు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.